Skip to main content

కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణ నూతన సచివాలయం దాదాపుగా పూర్తయింది. వచ్చే దసరా నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దేశంలోనే అత్యంత అధునాతన పరిజ్ఞానంతో వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నిర్మాణ బాధ్యతలను షాపూర్ జీ పల్లోమ్జీకి అప్పగించారు. ఇక ఖర్చు విషయానికొస్తే... మొదట 400 కోట్లతో పూర్తవుతుందనుకున్నారు. కొద్ది రోజుల‌కే ఆ అంచ‌నాల‌ు 619 కోట్లకు పెరిగాయి. ఆరు ఫ్లోర్లు, ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు అవుతుందని తొలుత లెక్క‌లు క‌ట్టారు. అయితే ఆ తరువాత ఒక ఫ్లోర్ పెంచారు.. అంటే మరో లక్ష చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం యాడ్ అయింది. దీంతో అంచనా వ్యయం ఏకంగా 219 కోట్ల రూపాయలు పెరిగింది. ఇక పనులు పూర్త‌య్యే నాటికి వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు అధికారులు. 

సచివాలయ నిర్మాణం ప్రారంభం నుంచి కరోనాతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంతో బిహార్, ఒడిశా , ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుండి రెండు వేల మందికి పైగా కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పనులు కొద్ది రోజులు మందకొడిగా జరిగాయి. ఇది కూడా వ్యయం పెరిగి ఆలస్యమవడానికి కారణమైంది అంటున్నారు అధికారులు. అయినప్పటికీ పనుల్లో వేగం తగ్గకూడదని కేసీఆర్ అధికారులను ఆదేశిస్తూ వస్తున్నారు. 2020 అక్టోబర్ 28న టెండర్లు ఖరారయ్యాయి. అప్పటి నుంచి కేసీఆర్ ఐదుసార్లు నిర్మాణ పనులు పరిశీలించారు. గత జనవరి 9న ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను ఇప్పటికే ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రస్తుతానికి మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలు దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ తో ప్రత్యేక డిజైన్లు చేయిస్తున్నారు. పిల్లర్ల డిజైన్లలో కూడా ఇంజినీర్లు మార్పులు చేస్తారంటున్నారు. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్, సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయం నిర్మిస్తున్నారు. సెక్రటేరియట్ పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. లాన్, ఫౌంటెయిన్స్ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. బిల్డింగ్ డిజైన్స్, కలర్స్, ఇంటీరియర్ సహా ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఇరవై ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 9 లక్షల చదరపు అడుగుల్లో సమీకృత సచివాలయ నిర్మాణం జరుగుతోంది. దీంట్లో ఇప్పటివరకు అన్ని స్లాబులతో పాటు 8 లక్షల చదరపు అడుగుల మేర పనులు పూర్తయ్యాయి. 1 లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. దాదాపు 60 వేల టన్నుల ఐరన్ ఇప్పటివరకు వినియోగించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి మరో 10 నుంచి 20 వేల టన్నుల ఐరన్ అవసరమవుతుంది. 2 అంతస్తులు మినహా ఇటుక పని కూడా ఐపోయింది. సగం అంతస్తుల్లో గోడలకు లప్పం వర్క్ కంప్లీటైంది. ప్రస్తుతం డోంలు, ఫ్రంట్ ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. ఫ్రంట్ ఎలివేషన్ కోసం ధోల్పూర్ ఇసుకరాయిని వినియోగించనున్నారు. కార్పెంటర్, ప్లంబింగ్ లాంటి సైడ్ వర్క్స్ సైతం సమాంతరంగా జరుగుతున్నాయి. 

ఇక మంచి గాలి, వెలుతురు ప్రసరించేలా భవనంలో మొత్తం 1008 దర్వాజాలు, 465 కిటికీలు ఉండేలా పక్కా వాస్తుతో ప్లాన్ చేశారు. ఉత్తరం వైపు రిసెప్షన్ ఉంటుంది. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లు పూర్తిగా సాధారణ పరిపాలన శాఖకు కేటాయించే అవకాశం ఉంది. 2వ అంతస్తు పూర్తిగా ఆర్థికశాఖ అవసరాల కోసం వినియోగిస్తారు. ఇదే అంతస్తులో ముగ్గురు మంత్రుల ఛాంబర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే 3, 4, 5 అంతస్తుల్లో కూడా మంత్రులు వాళ్ల కార్యదర్శులు, సంబంధిత సెక్షన్ ఆఫీసర్లు కొలువు దీరే అవకాశం ఉంది. ఇక 6వ అంతస్తు పూర్తిగా ముఖ్యమంత్రి కోసం కేటాయిస్తారు. భవనం నైరుతి భాగంలో సీఎం ఛాంబర్ ఉంటుంది. ఇదే అంతస్తులో సీఎంఓ అధికారులు, ఇతర సిబ్బందిని అకామడేట్ చేస్తారు. ఇక్కడే విశాలమైన మీటింగు హాల్స్, మంత్రివర్గ సమావేశాల నిర్వహణ కోసం సౌండ్ ప్రూఫ్ తో మరో హాల్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: కొత్త పన్నులు రాబోతున్నాయి

సచివాలయం నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. తూర్పు వైపు నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. బిల్డింగు వెనుక భాగంలో సీఎం, మినిస్టర్ల వాహనాల పార్కింగ్ ఉంటుంది. దక్షిణ భాగంలో ఉన్న గేటు నుంచి అధికారులు, ఇతర ఉద్యోగులు ఎంటరవుతారు. అక్కడే వాళ్లకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. ఇక ఉత్తర ద్వారంలో సందర్శకులకు యాక్సెస్ ఇస్తారు. ఇక్కడే వాళ్ళ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు. ప్రాంగణంలోని పడమటి ద్వారంలో అంటే ప్రధాన భవనం వెలుపల వెనుకవైపు ఇతర సౌకర్యాల కోసం మరికొన్ని నిర్మాణాలకు ప్లాన్ చేశారు. ఇక్కడే మందిరం, మసీదు, చర్చి, బ్యాంకు, పోస్టాఫీస్, డిస్పెన్సరీ, ఇతరత్రా కార్యాలయాలు ఉంటాయి. ఇప్పటివరకు దాదాపు 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయి. షిఫ్టుకు 500 మంది చొప్పున మొత్తం 3 షిఫ్టుల్లో డే అండ్ నైట్ పనులు కొనసాగుతున్నాయి. పనులు శరవేగంగా పూర్తిచేసి ఈ దసరా కల్లా సమీకృత సచివాలయంలో కార్యకలాపాలు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: కొత్తగా తయారవుతున్న మావోయిస్టుల హిట్ లిస్ట్

ఒక్క ముక్కలో చెప్పాలంటే వెంటిలేషన్ దగ్గర నుంచి పార్కింగ్ వరకు, డిజైన్ల దగ్గర నుంచి నాణ్యత వరకు కేసీఆర్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. అన్నింటినీ ఆరా తీస్తున్నారు. తాను సంతృప్తి చెందిన తరువాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నూతన సచివాలయ రూపు రేఖలతో దేశ, విదేశాల్లో తెలంగాణ ఇమేజ్ వెలిగిపోయేలా సీఎం దగ్గరుండి పూర్తి చేయిస్తున్నారు. అయితే 80 శాతం పనులు పూర్తయి.. మరో 20 శాతం పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ వచ్చే దసరా నాటికి సచివాలయం అందుబాటులోకి వస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత