Skip to main content

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా? 

మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి. 

మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం 14 శాతం ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదిలీ చేస్తోంది. ఈ విధానం ఐదేళ్లకు తీరిపోతుంది. అంటే ఈ సంవత్సరం జూన్ వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ వల్ల కలిగే నష్టాలను బ్యాలెన్స్ చేసే వాటా లభిస్తుంది. జులై నుంచి ఆ 14 శాతం బదిలీ ఇక జరగదన్నమాట. లెక్క ప్రకారం రాష్ట్రాలకు అందాల్సిన వాటా మాత్రమే అందుతుంది. కేంద్రం నుంచి అదనంగా వచ్చే 14 శాతం అందదు. ఇదే అదునుగా రాష్ట్రాలు జీఎస్టీ సవరణకు పట్టుబడుతున్నాయి. ఇప్పుడు జీఎస్టీలో 4 శ్లాబులు ఉన్నాయి. మార్కెట్లో ఉన్న వస్తువుల కేటగిరీని బట్టి ఆయా వస్తువులపై 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆగిపోనున్న 14 శాతం ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాలు 5 శాతం శ్లాబు రేటును ఎత్తేసి దాని స్థానంలో 8 లేదా 9 శాతం పన్ను వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నాయి. 5 శాతం జీఎస్టీ శ్లాబు కింద ఉన్న కొన్ని వస్తువులతో పాటు పన్ను పరిధిలో లేని అన్-ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ తో 3 శాతం జీఎస్టీ శ్లాబును సృష్టించాలని సూచిస్తున్నాయి.

5 శాతం శ్లాబులో 1 శాతం పెరిగితే అది ఏడాదికి 50 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే 3 శాతం పెరిగితే.. లక్షా 50 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందన్నమాట. ఈ ఆదాయం మీద కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వాలు.. 5 శాతం జీఎస్టీ శ్లాబును 8 లేదా 9 శాతానికి పెంచాలని పట్టుబడుతున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... మరో రెండు నెలల్లో సామాన్యులు వాడే అనేక వస్తువులపై పన్ను భారం ఏ మేరకు పడుతుందో. 

జీఎస్టీ కాంపెన్సేషన్ ను ఐదేళ్ల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పింది. కేంద్రం మీద ఆధారపడకుండా రాష్ట్రాలే ఆదాయ మార్గాలు సమకూర్చుకోవాలని కూడా అప్పుడే సూచించింది. తొలినాళ్లలో 28 శాతం శ్లాబు కింద ఉన్న 228 వస్తువుల జాబితాను క్రమంగా సవరిస్తూ ఇప్పుడు 35గా కుదించింది కేంద్రం. మరి.. రేపు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీ తరువాత ఏ వస్తువుల మీద పన్ను బాదుతారు.. ఏ వస్తువుల మీద కనికరం చూపిస్తారనేది వేచి చూడాల్సిందే. 

Also Read: కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత