Skip to main content

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా? 

మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి. 

మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం 14 శాతం ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదిలీ చేస్తోంది. ఈ విధానం ఐదేళ్లకు తీరిపోతుంది. అంటే ఈ సంవత్సరం జూన్ వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ వల్ల కలిగే నష్టాలను బ్యాలెన్స్ చేసే వాటా లభిస్తుంది. జులై నుంచి ఆ 14 శాతం బదిలీ ఇక జరగదన్నమాట. లెక్క ప్రకారం రాష్ట్రాలకు అందాల్సిన వాటా మాత్రమే అందుతుంది. కేంద్రం నుంచి అదనంగా వచ్చే 14 శాతం అందదు. ఇదే అదునుగా రాష్ట్రాలు జీఎస్టీ సవరణకు పట్టుబడుతున్నాయి. ఇప్పుడు జీఎస్టీలో 4 శ్లాబులు ఉన్నాయి. మార్కెట్లో ఉన్న వస్తువుల కేటగిరీని బట్టి ఆయా వస్తువులపై 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆగిపోనున్న 14 శాతం ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాలు 5 శాతం శ్లాబు రేటును ఎత్తేసి దాని స్థానంలో 8 లేదా 9 శాతం పన్ను వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నాయి. 5 శాతం జీఎస్టీ శ్లాబు కింద ఉన్న కొన్ని వస్తువులతో పాటు పన్ను పరిధిలో లేని అన్-ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ తో 3 శాతం జీఎస్టీ శ్లాబును సృష్టించాలని సూచిస్తున్నాయి.

5 శాతం శ్లాబులో 1 శాతం పెరిగితే అది ఏడాదికి 50 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే 3 శాతం పెరిగితే.. లక్షా 50 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందన్నమాట. ఈ ఆదాయం మీద కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వాలు.. 5 శాతం జీఎస్టీ శ్లాబును 8 లేదా 9 శాతానికి పెంచాలని పట్టుబడుతున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... మరో రెండు నెలల్లో సామాన్యులు వాడే అనేక వస్తువులపై పన్ను భారం ఏ మేరకు పడుతుందో. 

జీఎస్టీ కాంపెన్సేషన్ ను ఐదేళ్ల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పింది. కేంద్రం మీద ఆధారపడకుండా రాష్ట్రాలే ఆదాయ మార్గాలు సమకూర్చుకోవాలని కూడా అప్పుడే సూచించింది. తొలినాళ్లలో 28 శాతం శ్లాబు కింద ఉన్న 228 వస్తువుల జాబితాను క్రమంగా సవరిస్తూ ఇప్పుడు 35గా కుదించింది కేంద్రం. మరి.. రేపు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీ తరువాత ఏ వస్తువుల మీద పన్ను బాదుతారు.. ఏ వస్తువుల మీద కనికరం చూపిస్తారనేది వేచి చూడాల్సిందే. 

Also Read: కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?