Skip to main content

అద్భుతమైన సినిమా - చెత్త మెసేజ్

శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది. 

కథ విషయానికి వస్తే, హీరో సినిమా డైరెక్టర్. 2020 లోమొదటి సినిమా తీసి హిట్ సాధిస్తాడు. అతను పేరు సాధిస్తాడు. అనుకోకుండా అతను ఒక కేసులో  ఇరుక్కుని పోతాడు. ఆ కేసు నుండి బయట పడడానికి అతన్ని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే, ఆమె అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకొంటుంది.

సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. అతను ప్రజల కోసం పోరాడే ఒక సామాజిక కార్యకర్త, కవి.

అనుకోకుండా దసరా నవరాత్రి ఉత్సవాల్లో గుడిలో డాన్స్ చేస్తున్న హీరోయిన్ను చూస్తాడు. ఎప్పుడూ గుడికి వెళ్ళని హీరో... ప్రతిరోజూ ఉత్సవాలకు వెళ్తూ, హీరోయిన్ ను ప్రేమిస్తాడు.

హీరోయిన్ ఒక దేవదాసి (దేవుడికి ఇస్తామని చెప్పి బాలికలను దేవుడి బార్య పేరుతో గుడులలో ఉంచుతారు. జీవితం మొత్తం వారిని పూజారులు వాడుకుంటూ ఉంటారు). రోజు రాత్రి గుడి మహంత (పెద్ద పూజారి) ఒక అమ్మాయితో గడుపుతాడు. సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంటుంది. హీరో ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుని కలకత్తా తీసుకెళ్ళి అక్కడ తన రచనలను కొనసాగిస్తాడు. ఈ సినిమాలో  హీరో 1970 లలో హత్య కావించబడటాడు..హీరోయిన్ 80 సంవత్సరాల వయస్సులో,అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

*****

హీరో: "నేను ప్రపంచం గురించి రాస్తూ ఉంటాను"

హీరోయిన్: "మరి నాగురించి ఎప్పుడు రాస్తావు?"


"నేను వెళ్తాను

నేను రాస్తాను"

లాంటి డైలాగ్ లు బాగున్నాయి.


నీ విలువ నీకు తెలియదు, నాతో రా! అని హీరో అంటే, "అర్ద మూట బియ్యం కోసం మా అమ్మ నన్ను  చిన్నప్పుడే అమ్మేసింది. అది నా విలువ" అంటుంది.


"మా మీద హక్కు ఆ దేవుడికి కూడా లేదు",

"ఆ నీరు దళితులు తాగితే అంటారానిడైతే, మరి వారు పీల్చిన గాలి మీరెందుకు పీలుస్తున్నారు",

"నీ వల్ల మా పరువంతా పోయింది, నిన్ను చంపితే కాస్తయినా మా పరువూ నిలబడుతుంది"

అమ్మాయి తలను, కళ్ళను,పెదవులను, జుట్టును వర్ణిస్తూ కవిత్వం చెప్పే సీన్ బాగుంటుంది.


"మైత్రేయి! ఇన్ని ముళ్ళ మద్య కూడా నువ్వు  వికసిస్తున్నావు, నీ పేరు ఇప్పటి నుండి రోసీ(Rosy)"

లాంటి డైలాగ్ లు బాగున్నాయి. "అమావాస్య రోజు, నీ ఒడిలో నేను చచ్చిపోతే నాకు గౌరవం" అని వయస్సులో అన్న హీరోయిన్    పునర్జన్మ ఎత్తిన ప్రీయున్ని  తన వృద్దాప్యంలో  అతని వొడిలో చనిపోవడం తో కథ ముగుస్తుంది.

చాలా అద్భుతమైన సినిమా....

ఫోటోగ్రఫీ ,డైలాగ్ లు సూపర్...

కానీ పునర్జన్మ అనే కాన్సెప్ట్ బాగాలేదు. సందేశం బాగా లేదు, హీరోయిన్ తన హావభావాలను పలికించడానికి కూడా నాట్యాన్ని చూపారు. కవిగా,సంస్కర్త గా, సోషల్ ఆక్టివిస్ట్ గా హీరో నాని అద్భుతంగా నటించాడు. డైరెక్షన్ బాగుంది. పునర్జన్మ కాన్సెప్ట్ తప్ప, మిగిలిన సినిమా మొత్తం సూపర్. శ్యామ్ సింఘారాయ్ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా చూసాను అనే ఫీలింగ్ కలిగింది.

- చీపాటి రాజేశ్వరరావు

Also Read: శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత