Skip to main content

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదు-ఎర్రోజు భిక్షపతి


ఏ నాయకుడు ఏ పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆగేది లేదని, విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం మడమ తిప్పకుండా పోరాడతానని, ఈ ప్రయాణంలో జాతి రత్నాల్లాంటివారు కూడా అడ్డుకున్నా ప్రజల మద్దతుతో ముందుకెళ్తానని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి కరాఖండిగా తేల్చేశారు. సెప్టెంబర్ 5న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభలో భిక్షపతి తన వైఖరిని ప్రజలందరికీ విడమరచి చెప్పారు. గత పదేళ్లుగా కులసంఘంలో పని చేస్తూ జాతి అభివృద్ధి కోసం పాటు పడుతున్నానని, అన్ని రంగాల్లో వెనుకబడ్డ విశ్వబ్రాహ్మలకు ఏం చేయాలో తనకంటూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయన్నారు. 30 ఏళ్లకు పైగా విశ్వబ్రాహ్మణ కుల సంఘం పేరుతో పనిచేస్తున్న కొందరు పెద్దలు ఇప్పటివరకు ఏం చేశారో ఏ ఒక్కరికీ తెలియదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉనికి చాటుకునేందుకే సంఘాల పేరుతో అమాయకులైన విశ్వబ్రాహ్మలను మోసం చేస్తున్నారని, ఆ మోసాలను ప్రశ్నిస్తున్నందువల్లే తన మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు సాగిస్తున్నాయన్నారు. అయితే కులం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పదేళ్లుగా తాను కుల సంఘాల్లో చురుగ్గా పని చేస్తున్న కారణంగానే ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ ప్రజానీకం తనకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారన్నారు. దశాబ్దాలుగా అసలు చర్చకు రాని సమస్యలను తన ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు పెట్టడమే లక్ష్యంగా పని చేస్తానని, అలా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని, ప్రజల దీవెనలు ఉంటే దూసుకెళ్తానన్నారు. ఈ బహిరంగ సభ విశ్వబ్రాహ్మణ జాతిని మలుపుతిప్పేదిగా అవుతుందని, ఇక నుంచి జాతి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, జాతీయులంతా అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 


ఇక ఈ సభకు ప్రభుత్వ ప్రతినిధిగా బీసీ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. తాను ప్రభుత్వం ఆదేశిస్తే వచ్చానని, విశ్వబ్రాహ్మణులకు ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అందుకు సంబంధించిన కేటాయింపులు తెలిపే ఉత్తర్వుల తాజా ప్రతిని సంఘం అధ్యక్షుడు భిక్షపతికి అప్పగించారు. అన్ని రంగాల సేవల్లో కూడా విశ్వబ్రాహ్మణులే ముందుంటారని, అయితే అభివృద్ధిలో మాత్రం వెనుకబడ్డారని, అయితే పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వబ్రాహ్మల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ఉన్నారని, ఆయన హయాంలోనే మీ జాతి సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రికి బీసీలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సంఘీయులు ఎదుర్కొంటున్న ఇతర అన్ని సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇక ఆత్మగౌరవ భవనం కోసం ఐదెకరాల భూమికి సంబంధించిన కాగితాలు, అందుకయ్యే రూ. 5 కోట్ల నిధుల కేటాయింపుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఎర్రోజుకు అప్పగించడంతో సభికులంతా ఈలలు, కేరింతలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

ఇక భిక్షపతి సభాముఖంగా పలు డిమాండ్లను వినిపించారు. 

1) ప్రభుత్వం ఇతర కులాలకు ఇస్తున్నట్టుగానే 50 ఏళ్లు పైబడ్డ విశ్వబ్రాహ్మణులకు కూడా పింఛన్లు ఇవ్వాలి.
2) వరంగల్ విశ్వబ్రాహ్మణ గర్జన సభలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి పాలకమండలిని నియమించడంతో పాటు ఆ సభలోనే హామీ ఇచ్చినట్టు రూ. 250 కోట్లు తక్షణమే విడుదల చేయాలి.
3) ఫారెస్టు అధికారులు కర్రకోత, దూగోడ మిషన్లను సీజ్ చేసి వడ్రంగులను వేధించి గ్రామాల్లో వారి వృత్తిని తీవ్రంగా అడ్డుకున్నారు. వారి పనిముట్లను, లైసెన్సులను మళ్లీ వారికి అందజేసి వడ్రంగుల వృత్తిని కొనసాగేలా చేయాలి.
4)  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాళిబొట్లు తయారుచేసే హక్కును అక్కడి విశ్వబ్రాహ్మణులకే కట్టబెడుతూ జీవో జారీ చేసిన పద్ధతిలోనే తెలంగాణలో కూడా తాళిబొట్ల తయారీని మా విశ్వబ్రాహ్మణ సోదురులకే కట్టబెట్టి ఆదుకోవాలి.
5) విశ్వబ్రాహ్మణుల్లో అర్చక వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నవారిని, వేదాధ్యయనం చేస్తూ ఉన్నవారిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో తగిన హోదాలో ప్రాధాన్యత కల్పించాలి.
6) విశ్వబ్రాహ్మణులకు మండలానికో కమ్యూనిటీ హాలు కోసం ఎకరం భూమి, రూ. కోటి నిధులు కేటాయించాలి. జిల్లా స్థాయిలో రెండెకరాల భూమి, రెండు కోట్ల నిధులు కేటాయించాలి.
7) మేడ్చల్ -సిద్దిపేట రోడ్డులో 300 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన చేతివృత్తుల పారిశ్రామిక హబ్ ను విశ్వబ్రాహ్మణులకే కేటాయించి నిర్వహణ బాధ్యతలు కూడా విశ్వబ్రాహ్మణులకే అప్పగించాలి.
8) మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి అయిన శంకరమ్మకు ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి. 

ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కళామండలి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యానందాచారి బృందం అభినయించిన స్ఫూర్తిదాయకమైన గీతాలకు సభకు హాజరైన జనమంతా ఎంతో హుషారుతో కోరస్ అందించడం విశేషం. ఈ కార్యక్రమంలో వీవీఐఎస్ ప్రధాన కార్యదర్శులు తల్లోజు చెన్నయ్యాచారి, నౌండ్ల సంతోష్ ఆచారి, నందిపేట రవీంద్రాచారి, కోశాధికారి బిక్షపతిచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల బ్రహ్మచారి, గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనేత చేపూరి లక్ష్మణాచారి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నాగారం కవితారాణి, ప్రధాన కార్యదర్శి సిద్ధాంతం శ్యామల, యువజన విభాగం అధ్యక్షుడు చంద్రశేఖరాచారి, గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అనంతోజు బ్రహ్మచారి, యువజన విభాగం ఉపాధ్యక్షుడు వలబోజు రవికిరణ్ ఆచారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కాతోజు రామాచారి, వివిధ జిల్లాలు, మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ కమిటీ ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 

                                   2) మధుసూధనాచారికి నో ఛాన్స్

బహిరంగ సభను ప్రతిబింబించే చిత్రమాలిక

Comments

  1. అభ్యర్ధించినా కానీ పనులు జరగకపోతే ..పోరాటం చేస్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయి...

    ReplyDelete
  2. Set a cap for how a lot you're OK with shedding with out limiting how a lot 온라인카지노 you'll be able to|you presumably can} win, says Frank Scoblete, writer of Beat Blackjack Now. A very interesting free on-line blackjack trainer can be discovered right here. The promotion introduced on this web page was available at the time of writing. With some Casino promotions altering on day by day foundation, we suggest you to check on the positioning if it nonetheless available. Also, please do not forget to learn the terms and circumstances in full before you settle for a bonus.

    ReplyDelete

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత