Skip to main content

15 నిమిషాలు.. 15 కోట్లు.. ప్రమాదం ముంచుకొస్తోంది

Photo Credit: ANI, Public Radio International, Swarajya

పదిహేను నిమిషాలు టైమిస్తే హిం.... లను ఊచకోత కోసేస్తాం. ఈ దేశంలో ముస్లింలు 15 కోట్ల మంది ఉన్నారు గుర్తుంచుకోండి. వాళ్లంతా రోడ్ల మీదికొస్తే వంద కోట్ల మంది కూడా ఏం చేయలేరు.. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. ఈ రెండు డైలాగులు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) నేతల నుంచి వచ్చాయి. మొదటిది కొన్నేళ్ల క్రితం అక్బరుద్దీన్ నోటి నుంచి వచ్చిందైతే.. రెండో వార్నింగు ఈ మధ్యాహ్నం, కాసేపటి క్రితమే (20--2-2020) కర్నాటకలో జరిగిన ఒక మీటింగ్ లో అసదుద్దీన్ సమక్షంలోనే ఆ పార్టీ మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ నోటి నుంచి వెలువడింది. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని రాజకీయ నేతల గురించి మాట్లాడుకోవడం వృథా. కానీ.. అన్నీ ఉండీ అన్నీ మూసుకునే జర్నలిస్టుల గురించి, వారి మౌనం గురించి మాట్లాడుకోవాల్సిన తరుణం మాత్రం ఇదే. 

15 నిమిషాలు టైమిస్తే ఒకడు కోటానుకోట్ల మందిని ఊచకోత కోసేస్తానని బహిరంగ సమావేశంలోనే అంటాడు. మేం 15 కోట్ల మందిమి ఉన్నాం.. ఏమనుకుంటున్నారో అంటూ ఇంకొకడు హుంకరిస్తాడు. టెక్నికల్ గా వీళ్లంతా ఈ దేశ పౌరులే కానీ.. ఎథికల్ గా వీళ్లు టెర్రరిస్టులకు సైతం పాఠాలు నేర్పే టీచర్లుగా సంబోధించాల్సి వస్తుంది. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పాల్గొన్న సభలోనే వారిస్ పఠాన్ ఈ  కూతలు కూయడం గమనించాలి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే.. ఎంఐఎంలో కాస్తో కూస్తో ప్రో పబ్లిక్ అన్న పేరు అసదుద్దీన్ కు ఉంది. మత ఛాందసులకు ఎంత మద్దతు పలికినా.. కొద్దోగొప్పో మెజారిటీ పీపుల్ పట్ల కూడా సానుభూతిగా ఉంటాడన్న పేరు అసద్ సాబ్ కు ఉంది.

ఆ మధ్య ఎంబీటీ గ్రౌండ్ వర్క్ తోని కనీవినీ ఎరుగని రీతిలో ముస్లింలంతా హైదరాబాద్ లో భారీ ర్యాలీ తీశారు. ముస్లింలకు సంఘీభావంగా దళితులు, క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, కొన్ని బీసీ కులాలు కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నాయి. ఎంబీటీ ఆధ్వర్యంలో జరిగిన ఆ భారీ ర్యాలీతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గతుక్కుమన్నాడని, తన కాళ్ల కింద నేలను ఎవరో కదిలిస్తున్నారని భయపడ్డారని పలువురు విశ్లేషించారు. అందుకే ఆ తరువాత అతి కొద్ది టైమ్ లోనే మరో పోటీ ర్యాలీ నిర్వహించారు అసదుద్దీన్. కోర్టుకు వెళ్లి మరీ ర్యాలీకి పర్మిషన్ తెచ్చుకున్నారు ఒవైసీ. ఇక ఆ రెండు ర్యాలీలు కూడా సీఏఏ కు వ్యతిరేకం కావడాన్ని గమనించాలి. అయితే అది సీఏఏ కు వ్యతిరేకం అనేకన్నా కేంద్రంలోని బీజేపీ కి వ్యతిరేకంగానే ప్రజలంతా గుర్తిస్తున్నారు. అసలు ర్యాలీ సబ్జెక్టు కన్నా.. అసదుద్దీన్ తీసుకున్న స్టాండ్ పైనే ఎక్కువగా చర్చ జరిగిందనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ లేంది అసదుద్దీన్ జాతీయ జెండాను పట్టుకోవడమేంటి అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. పంద్రాగట్సు, ఛబ్బీస్ జనవరి లాంటి జాతీయ పండుగల రోజుల్లోనే ఎంఐఎం నేతలెవరూ సరిగా పాల్గొనరు. వందేమాతరం లాంటి జాతీయ గీతాలకు కూడా వారు వ్యతిరేకం. అల్లాహో అక్బర్ అనేదే వారి నినాదం. అలాంటి అసద్ సాబ్ జాతీయ జెండా ఎత్తుకొని అర్ధరాత్రి దాకా ఉపన్యాసాలు దంచాడు. మిగతా ముస్లిం యూత్ అంతా బైకులకు జెండా పెట్టుకొని ర్యాలీ తీశారు. నిజానికి పాఠశాలల్లో, కార్యాలయాల్లో చాలా మంది ముస్లింలు వ్యక్తిగత స్థాయిలో జాతీయ జెండాకు వందనం చేశారు. జాతీయ పర్వదినాల్లో పాల్గొన్నారు. ఇది మామూలే. కానీ ముస్లింలు ఒక గుంపుగా, ఆ వర్గానికే చెందిన ఒక నాయకుడి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం పట్టుకొని పాల్గొనడం అనేది చాలా ఇంటరెస్టింగ్ పాయింట్. అయితే అంతమాత్రాన మిగతా ప్రధాన స్రవంతి ప్రజలెవరూ చంకలు గుద్దుకోవాల్సిన పన్లేదు. ఎందుకంటే ఆ ర్యాలీలో జాతీయ స్ఫూర్తి అనేది ఎక్కడా కనిపించలేదు. ఆ విషయమే తాజాగా అసదుద్దీన్ సమక్షంలో ఆ పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ రుజువు చేశాడు. 

సీఏఏ, 370 ఆర్టికల్ విషయంలో వెనక్కి వెళ్లేది లేదని, మోడీ మొండిగా తేల్చేసిన క్రమంలో ఎంఐఎం నేతలు ఈ దేశంలోని అధిక సంఖ్యాకులనే తమకు వ్యతిరేకంగా భావిస్తున్నారు. సీఏఏ అనేది తమ వర్గానికి వ్యతిరేకం కాబట్టి.. తాము వ్యతిరేకంగా భావిస్తున్న మరో పెద్ద వర్గాన్ని అయినా తాము టార్గెట్ చేయడానికి వెనుకాడేది లేదని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. నిజానికి చట్టంలో ఇండియన్ ముస్లింల ప్రస్తావనే లేదు. నాన్ ఇండియన్ ముస్లింలు అయినా సరే సెక్యులరిజం పేరుచెప్పి ఈ దేశంలో అక్రమంగా కాదు.. సక్రమంగానే ఉండనివ్వాలని జబర్దస్త్ చేస్తున్నారు. అది వారి జబర్దస్త్ అన్న విషయం మన దేశపు మేధావులకు అర్థం కాదు. అది వేరే విషయం. మరి అర్థమైన మోడీ గానీ, మోడీ సపోర్టర్స్ గానీ.. ఎంఐఎం నేతల జబర్దదస్తీని సహిస్తారా.. ఈ దేశంలోని కామన్ మ్యాన్ సహిస్తాడా..? ఎందుకు సహించాలి...? ఈ దేశ పౌరులు కానివారి గురించి అంత శ్రద్ధ ఎందుకు..? ఎక్కడెక్కడి జనాన్నో ఇక్కడికి రప్పించి లేదా వచ్చినవారిని ఇక్కడే ఉండేలా చేసి ఒక పెద్దగుంపుగా తయారు చేయడంలో ఎంఐఎం నేతల ఉద్దేశాలేంటి..? ఈ దేశంలో ప్రశాంతత లేకుండా చేయడమేనా..? లేక ప్రధాన సెక్షన్ ను లేకుండా చేయాలన్న దూర దృష్టా..? అందుకే విదేశీయుల కోసం ఇంత యాగీ చేస్తున్నారా..?  ఓల్డ్ సిటీలో అధికారికంగా 6 లక్షల మందికి పైగా శరణార్థులున్నారు. అనధికారికంగా వారి సంఖ్య దాదాపు 20 లక్షల దాకా ఉంటుందని, వారి వివరాలేవీ లేవని పోలీసులు సైతం చేతులెత్తేస్తున్నారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీలు పొంది డూప్లికేట్ ఇండియన్లుగా సెటిలైపోయినవారి కోసం ఎంఐఎం నేతలు ఎప్పుడైనా మాట్లాడారా..? అసలు అలాంటి బంగ్లాదేశీయులు, బర్మీయులు, రోహింగ్యాలు, ఆఫ్రికన్ల కోసమే కదా వీరి తాపత్రయం. 

పోటీపడి జాతీయ జెండా పట్టుకోవడం కాదు. అందులో జాతయతా స్ఫూర్తి ఉండాలి. ఎవరో తరుముకొచ్చారు కాబట్టి..  జెండా పట్టుకున్నట్టు కనిపిస్తే అందులోని అసలు నైజం దాగదు కదా. ఇదే జరిగింది ఎంఐఎం నేతల విషయంలో. పాలేవో, నీళ్లేవో తేలిపోవడం లేదూ?

Also Read: కొత్త పన్నులు రాబోతున్నాయి

 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత