Skip to main content

Posts

మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

కంచే చేనే మేస్తే.. ఆ కాపు ఏం చేయాలి? రక్షణగా నిలవాల్సిన వ్యవస్థే పక్షపాతం చూపి తప్పుకుంటే ఎవర్ని ఆశ్రయించాలి? ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు తెగబడి.. బెదిరింపులకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? కరీంనగర్ లోని ఓ బాధిత రైతు.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెర లేపిన భూ కబ్జా భాగోతంతో బెంబేలెత్తిపోతున్నాడు. కరీంనగర్ లో ఉండలేక, ఉంటే బతుకుతానన్న గ్యారెంటీ లేక హైదరాబాద్ పారిపోయి వచ్చానంటున్నాడు. తన గోడును ఎవరికి చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదంటూ.. హైదరాబాద్ లో మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే భూములకు రక్షణ దొరుకుతుందనుకున్న సామాన్య ప్రజలకు.. అలాంటి భరోసా ఏమీ కనిపించడం లేదన్న విమర్శలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. అందుక్కారణం పార్టీ పేరు చెప్పుకునో లేదా ఏదో ఒక అధికారి పేరు చెప్పుకునో మాఫియారాయుళ్లు భూములు కబ్జా చేయడం లేదిప్పుడు... ఏకంగా మంత్రులే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రంగంలోకి దిగుతున్నారట. రాష్ట్ర మంత్రి వర్గంలో చాలా కీలకమైన పోర్టుఫోలియో కలిగి ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ మీదనే ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగుల పేరు త

ఐదు కీలకాంశాలపై ఆస్ట్రాలజీ నిపుణుల పత్ర సమర్పణ

భాగ్యనగర్ పోస్ట్, హైదరాబాద్, 08: జ్యోతిష్య శాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మానవ జీవన ప్రయాణాన్ని సులభంగా, సుఖంగా కొనసాగించవచ్చని.. అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్టుగా అందుకునే అద్భుతమైన భారతీయ విజ్ఞానమే జ్యోతిష్యం అని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా అన్నారు. భారతీయ రుషి పరంపర నుంచి వచ్చిన ఆ విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందించేందుకే తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. ప్రజల జీవితాలు సుఖమయం చేయడానికి మించిన సేవ మరోటి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఔత్సాహికుల కోసం ఉచిత జ్యోతిష్య తరగతులు బోధిస్తున్నామని.. దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా అందించలేని స్థాయిలో ఔత్సాహికులకు లోతైన అవగాహన కల్పిస్తున్నామన్నారు.  ఈ సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి కళాసాగరంలో పలు ముఖ్యమైన అంశాలపై ఐదుగురు నిపుణులు సమర్పించిన థీసిస్ పై ప్రజెంటేషన్ నిర్వహించారు. ఫెర్టిలిటీలోని సమస్యలు, సంతానోత్పత్తిలో కలిగే అవరోధాలకు ఆస్ట్రాలజీలో ఉండే పరిష్కారాలపై సీసీఎంబీ-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తు

పొగ తాగడానికి పొగ పెడుతున్న రుషి సునాక్

ఈ ప్రపంచం కరోనా అనే ఓ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంది. కానీ అంతకుమించిన మరో మహమ్మారి ప్రతి దేశాన్నీ పీడిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆ మహమ్మారిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  ఆ మహమ్మారిని తరిమేయడానికి, ఇంగ్లాండ్ నుంచి తరిమేయడానికి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కంకణం కట్టుకున్నారు. త్వరలో ఓ చట్టం కూడా తేబోతున్నారు. మరి రిషి తేబోతున్న చట్టానికి.. ఏపీలో మన జగన్ తీసుకొచ్చి వెనక్కి వెళ్లిన చట్టానికి తేడా ఏంటి?  Read this also: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం పొగ తాగుడు కారణంగా ప్రపంచంలో యేటా 80 లక్షల మంది చనిపోతున్నట్టు డబ్ల్యు.హెచ్.ఒ లెక్కలు కట్టింది. అందులో డైరెక్టుగా పొగాకు వినియోగం కారణంగా సంభవిస్తున్న మరణాలు ఏటా 70 లక్షలట. అంటే సిగరెట్ తాగని, పొగాకు బారిన పడనివారు కూడా దాని పరోక్ష ప్రభావం చేత ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారన్నమాట. అంటే ఈ 70 లక్షల మంది స్మోకర్ల కారణంగా వారు వదిలే పొగ పీల్చి.. పాపం అమాయకులైన నాన్ స్మోకర్లు మరో 13 లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రపంచం తీవ్రంగా భయపడాల్సిన అతిపెద్ద పాండమిక్ ఇదే అయిందంటున్నారు ప్రపంచ క్యాన్సర్ నిపుణులు. కోవిడ

నిరంజన్‎రెడ్డి బర్త్ డే వేడుకల సందర్భంగా ప్రత్యేక సంచిక

తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న, ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 64వ బర్త్ డే వేడుకలు ఆత్మీయుల మధ్య ఎంతో హుందాగా, సాదాసీదాగా జరిగాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఉదయం నుంచీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నిరంజన్ రెడ్డి అభిమానులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యాక జిల్లా రూపురేఖలు మారిపోయాయని.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని భాగ్యనగర్ పోస్ట్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. మేగజైన్ మేనేజింగ్ ఎడిటర్ రాఘవరెడ్డి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే ఎన్నికల్లోనూ నిరంజన్ రెడ్డి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన బర్త్ డే వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో అభిమానులు వనపర్తికి తరలి రావడంతో పట్టణమంతా సందడి వాతావరణం నెలకొంది.  Also Read: నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ స్కెచ్ Also Read: మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

భారతీయ నారీ శక్తిని బయటపెట్టిన తాజా రిపోర్ట్

ఆడపిల్లలు అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు... తాము ఎందులోనూ, ఎవరితోనూ తీసిపోమని. అయినా పురుషాధిక్య సమాజం.. మహిళల మీద ఆంక్షలు విధించింది. మహిళల మేలు కోసమేనని ఒకసారి.. మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తే గనక మగాళ్ల పని ఖతం.. అనే పేరుతో ఇంకోసారి.. ఇలా అనేక కోణాల్లో మహిళల్ని అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే మాత్రం.. మహిళల్లో దాగున్న పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ రిపోర్టు ఏం చెబుతోంది? దాన్నుంచి మనవాళ్లు నేర్చుకోవాల్సిన అంశాలేంటి?  ఆడవాళ్లకు చెప్పించే చదువు దగ్గర నుంచి, వారికి సొంతంగా ఏదైనా బాధ్యతలు అప్పగించేదాకా.. ప్రతిచోటా వారికి ద్వితీయ ప్రాధాన్యమే దక్కుతోంది. అయితే ఈ మధ్య ఇలాంటి అభిప్రాయాల్లో మార్పులు జరిగినా.. ఆ మార్పులు రావాల్సిన స్థాయిలో మాత్రం రాలేదు. అందువల్ల ఆకాశంలో సగం అని గౌరవించుకునే మనమే.. వారి అవకాశాలకు గండి కొట్టేశాం. ఫలితంగా దేశ ఆర్థిక ఎదుగుదలలో వారి పాత్ర తగ్గిపోయింది. దాని ప్రభావం కొన్ని తరాల దాకా పాకిందంటే అతిశయోక్తి కాదు. అయితే మహిళలను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. వారికి ఇవ్వాల్సిన ప్రాధ

రజాకార్ మూవీలో ఏముంది?

ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన సమయంలో జరిగిన పోరాటాలు... ఆ తరువాత భారత్‌పై జరిగిన దాడులను భావి తరాలకు తెలియజేసేలా కొందరు నిర్మాతలు, దర్శకులు సినిమాలను రూపొందించడం ట్రెండ్‌గా వస్తోంది. అలాంటి సినిమాలలో కొన్ని ప్రశంసలు అందుకుంటే... మరికొన్ని విమర్శలపాలవుతున్నాయి. ఆ కోవకు చెందినవే ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు. ఇప్పుడిక ఆ జాబితాలో రజాకార్ మూవీ చేరిపోయింది. భారత స్వతంత్రం అనంతరం తెలంగాణలో రజాకార్ల అరచకాలను తెలిపేలా ఈ మూవీ రూపొందుతుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మాత్రం దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 17... తెలంగాణ విమోచన దినోత్సవం రోజున రిలీజ్ అయిన రజాకార్ మూవీ టీజర్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ మూవీతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. 1.42 నిమిషాల నిడివి గల ఈ టీజర్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. రాష్ట్ర ప్రజలను రెండు వర్గాలుగా విడదీసేందుకే ఈ మూవీని తీస్తున్నారని కొందరు ఆరోపిస్తుండగా... లేదు లేదు... ఇదో పీరియాడి

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో