Skip to main content

Posts

సేవా పతకానికి వన్నె తెచ్చిన రాజ్ కుమార్

పోలీసు విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా, బాధ్యతగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న ఎస్.రాజ్ కుమార్ ను స్టేట్ పోలీస్ సేవా పతకం వరించింది. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ పోలీస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. జూన్ 2, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా పతకాన్ని, ప్రశంసలను అందుకున్నారు.  రాజ్ కుమార్ రక్షకభటుడిగా చేరినప్పటి నుంచీ వృత్తికే మొదటి ప్రాధాన్యతనిస్తూ పైఅధికారుల ఆదేశాలు పాటిస్తూ.. ప్రజల అవసరాలు గుర్తిస్తూ మెలగుతున్నారు. జమ్మికుంట, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్, ఎల్.ఎం.డి కాలనీ.. ఇలా తాను ఎక్కడ విధులు నిర్వహించినా.. స్థానిక ప్రజల మన్ననలు పొందుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ప్రజాసంబంధాలు పటిష్టంగా కొనసాగిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవా నిరతిని, బాధ్యతల పట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు.. రాజ్ కుమార్  ను సేవా పతకానికి ఎంపిక చేశారు. విధి నిర్వహణలో తన అంకిత భావాన్ని గుర్తించిన అధికారులందరికీ రాజ్ కుమార్ పేరుపేరునా ధ

కవులకు, సామాజికవేత్తలకు ఉగాది పురస్కారాలు

నటనం, నాట్యం... కళారూపం ఏదైనా దానికి ప్రేరణ మాత్రం కవిత్వమే. కవి హృదయం ఆవిష్కరించిన పొందికైన మాటలే కళాకారులు కట్టిన గజ్జెలకు ప్రాణం పోస్తాయి. నాట్యగత్తెలకు ప్రేరణనిస్తాయి. అలాంటి కవిత్వానికి పెద్దపీట వేసే ఉద్దేశంతో, కవులను సన్మానించుకునే సంకల్పంతో చిదంబర నటరాజ కళానిలయం వ్యవస్థాపకురాలు, నృత్యగురువు మంజుల ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవులకు, ప్రముఖులైన కవితాభిమానులకు శాలువాలు కప్పి సన్మానించి తన కవిత్వ సేవను చాటుకున్నారు. చిదంబర నటరాజ కళానిలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు కవులు, సామాజిక కార్యకర్తలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, ప్రముఖ సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ నటుడు  సమీర్, నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ (రిటైర్డ్) డాక్టర్ రామకృష్ణ, బి.కేశవులు, మురహరి,  విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు   చేపూరి లక్ష్మణాచారి, కేశంపేటకు చెందిన ఎం.సతీశ్ హాజరయ్యారు. ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రమ

కొత్తగా తయారవుతున్న మావోయిస్టుల హిట్ లిస్ట్

ఎన్.ఐ.ఎ... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంతర్గత శాంతిభద్రతల కోసం నిరంతరం పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. తీవ్రవాదులు, ఉగ్రవాదుల కదలికలపై పూర్తి నిఘా పెట్టి వారిని మట్టుపెట్టే పకడ్బందీ సంస్థ. దాని వెబ్ సైట్ లో వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్-డేట్ చేస్తూంటారు. అయితే కొందరు కీలకమైన మావోయిస్టు నేతలు చనిపోయి చాలాకాలం అవుతున్నా.. వారి పేర్లను మాత్రం ఇంకా తొలగించలేదు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె... ఆయన మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడిగా పని చేశారు. ఇక యాపనారాయణ అలియాస్ హరిభూషణ్. ఈయన మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అయితే గత సంవత్సరమే వారు చనిపోయారు. అయినా ఎన్.ఐ.ఎ మాత్రం వారి పేర్లను ఇంకా మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే ఉంచింది.  ఆర్కే, హరిభూషణ్ తో పాటు మరికొందరు తెలుగువారు కూడా ఎన్.ఐ.ఎ. హిట్ లిస్టులో ఉన్నారు. ఈ సంవత్సరం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారిపై రివార్డులు పెరుగుతాయని పోలీసు శాఖ చెబుతోంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లవారీగా తాజా లిస్టును ఎన్.ఐ.ఎ. సేకరిస్తోంది. తాజా లిస్టులో ఇంకా ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌.. తెలంగాణలోని మహ

కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణ నూతన సచివాలయం దాదాపుగా పూర్తయింది. వచ్చే దసరా నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దేశంలోనే అత్యంత అధునాతన పరిజ్ఞానంతో వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నిర్మాణ బాధ్యతలను షాపూర్ జీ పల్లోమ్జీకి అప్పగించారు. ఇక ఖర్చు విషయానికొస్తే... మొదట 400 కోట్లతో పూర్తవుతుందనుకున్నారు. కొద్ది రోజుల‌కే ఆ అంచ‌నాల‌ు 619 కోట్లకు పెరిగాయి. ఆరు ఫ్లోర్లు, ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు అవుతుందని తొలుత లెక్క‌లు క‌ట్టారు. అయితే ఆ తరువాత ఒక ఫ్లోర్ పెంచారు.. అంటే మరో లక్ష చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం యాడ్ అయింది. దీంతో అంచనా వ్యయం ఏకంగా 219 కోట్ల రూపాయలు పెరిగింది. ఇక పనులు పూర్త‌య్యే నాటికి వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు అధికారులు.  సచివాలయ నిర్మాణం ప్రారంభం నుంచి కరోనాతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంతో బిహార్, ఒడిశా , ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుండి రెండు వేల మందికి పైగా కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పనులు కొద్ది రోజులు మందకొడిగా జరిగాయ

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

18 రోజుల్లో 5 కేసులు సీబీఐకి అప్పగించిన హైకోర్టు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అక్కడి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని, అందుకనే కేవలం 18 రోజుల్లో 5 కేసులను హైకోర్టు సీబీఐకి అప్పగించిందంటున్నారు నిపుణులు. ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీ పరిపాలనా శైలి వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ అధ్వానంగా తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 18 రోజుల్లో కోల్ కతా హైకోర్టు 5 కేసులను సీబీఐకి అప్పగిస్తూ విచారణకు ఆదేశించడం అరుదైన విషయమని, ఇలాంటి పరిస్థితి గతంలో ఏ రాష్ట్రంలో కూడా తలెత్తిన దాఖలాల్లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు 5 కేసులను కోల్ కతా హైకోర్టులోని వేర్వేరు డివిజన్ బెంచ్ లు సీబీఐకి అప్పగిస్తూ దర్యాప్తుకు ఆదేశించాయి. ఆ 5 కేసుల్లో కొన్ని గతంలో సింగిల్ జడ్జి విచారించిన కేసులు కూడా ఉండండం గమనార్హం. తాజాగా మంగళవారం నదియా జిల్లాలో ఓ మైనర్ పై జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసును హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించడం మమతకు రాజకీయంగా ఇబ్బందికరంగా పరిణమించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 14 ఏళ్ల బాలికపై