Skip to main content

Posts

ఒవైసీ బ్రదర్స్ తో స్నేహం కేసీఆర్ కు సవాలేనా?

రాజకీయాల్లో ఒకరి నిర్లక్ష్యమే ఇంకొకరికి అవకాశంగా మారుతుంది. అవతలి వ్యక్తి అతి విశ్వాసమే ఇవతలి వ్యక్తికి ఆయుధం అవుతుంది. సంఖ్యాబలంతోనే సర్వత్రా నెగ్గుకొస్తానంటే కుదరదు. ప్రజల్లో పాదుకున్న సెంటిమెంట్లేంటో అర్థం చేసుకొని అడుగేయాలి. అలా కాకపోతే విపక్షం చేతిలోనే పరాభవం చవి చూడక తప్పదు. తెలంగాణలో వికసించేందుకు బీజేపీ శక్తినంతా ప్రయోగిస్తున్న సమయంలో... కేసీఆర్ విస్మరిస్తున్న కీలకమైన అంశాలేంటో చెప్పడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.  తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ....స్వయంగా కేసీఆరే ఛాన్స్‌ ఇస్తున్నారా? కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే స్కెచ్ రెడీ చేసిందా? మిత్రపక్షమైన ఎంఐఎం ఏం మాట్లాడినా కేసీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? తెలంగాణలో మతసామరస్యానికి ముప్పు వాటిల్లిందా? అక్బరుద్దీన్ హేట్ స్పీచ్‌పై టీఆర్ఎస్‌ వైఖరేంటి? మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బర్ చేసిన కామెంట్స్ ను కేసీఆర్ ఉపేక్షిస్తే...జరిగే పరిణామాలేంటి?  తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్...కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా చెప్పే మాట ఇది. నిజానికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే...తెలంగాణలో మతసామరస్యం చాలా ఎక్కువ. ఇది చాల

"జమిలి".. ప్రజాస్వామ్య ప్రస్థానానికి ఓ మజిలీ

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. మరి దేశమంతా అన్ని రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ కు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మనకు ఎంతవరకు శ్రేయస్కరం? కేవలం ఖర్చు తగ్గించుకోవడం కోసమే జమిలికి వెళ్లాలా? లేక పరిపాలనా సౌలభ్యం అంతకంటే ముఖ్యమా? మొన్ననే ఎన్నికలు జరుపుకున్న తెలంగాణ గానీ, ఆంధ్రా గానీ.. పూర్తి కాలం ముగియకుండానే మరోసారి ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం వల్ల కలిసొచ్చేది ఎవరికి? కష్టకాలం దాపురించేది ఎవరికి? ఇలా అన్ని వర్గాల దేశ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న జమిలితో మిగిలేదేమిటి? మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవభారత ఎజెండాకు రూపమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  మోదీ 2022లో జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న సంకేతాలు  బలంగా వినిపిస్తున్నాయి.  లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది నవభారత ఎజెండాలో తొలి ప్రాధాన్య అంశం. దీన్ని  దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని వర్గాల ప్రజల మనసులూ గెలుచుకునేందుకు మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. అంతేకాకుండా ద్రవ్య క్రమశిక్షణ పాటిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ప్రబల ఆర్థికశక్తిగా మార్చాల

సంధ్యావందనమ్

.. శ్లో! యస్స్మరే ద్విశ్వకర్మాణం సానగాది యుతంవిభుం 'సృష్టిస్థిత్య స్తక ర్తారం -సబాహ్యాభ్యన్తరశ్శుచిః ఓం కేశ వాయస్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయస్వాహా ఓం"గోవిందాయనమః విష్ణ వేనమః మధు సూదనాయనమః త్రివిక్రమాయననుః వామనాయనమః శ్రీధ రాయనమః హృషీకేశాయనమః పద్మనాభాయనమః దామో దరాయనమః సఙ్కర్షణాయనమః వాసుదేవాయనమ్మ ప్రదక్షి మ్నా యనమః అనిరుద్దాయనమః పురుషోత్తమాయనమః అధో ఈ బాయనమః నారసింహాయనమః అచ్యుతాయనమః ఉపేన్గా యనమః హరయేనమః ఓం శ్రీకృష్ణాయనమః స్మృత్యాచమనం కృత్వా:  స్మృత్యాచమనం కృత్వా: ఉ తిష్ఠన్తు భూతపిశాచా ఏతే భూమిభారకా ప్ర తేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమార భౌ# తా!! భూతపిశాచములు ఇష్టం పొవ్ను వ నీ 3 భూతా! పిశిత మళ్నం తి పిశాచాః !! అనగా ధర్మమున గట్టువడక స్వేచ్ఛగా,

పాలమూరుకు ప్రథమ ప్రాధాన్యతాంశంగా

తొమ్మిది నెలల ముందుగానే తెలంగాణ సర్కారును రద్దు చేయాలన్న నిర్ణయం కేసీఆర్ ఎందుకు తీసుకున్నారు? తప్పకుండా మళ్లీ గెలుస్తానన్న ధైర్యం ఆయనకు ఎలా వచ్చింది? తాను చేసిన ఏ పనులు మళ్లీ గెలిపిస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు? మళ్లీ గెలిస్తే ఏ పనులు చేపట్టే అవకాశాలున్నాయి? కుడిభుజం లాంటి వారి సహకారం లేకపోతే కేసీఆర్ అంత పెద్ద నిర్ణయం తీసుకునేవారేనా? కేసీఆర్ కు కుడిభుజం లాంటి వ్యక్తి అయిన ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... టి.రమేశ్ బాబుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు యథాతథంగా...   1 ప్రశ్న- వనపర్తిలో మీరు తొలిసారి ఓటమి చవి చూశారు. మిమ్మల్ని మరోసారి ఓడించడానికి ప్రత్యర్థులు ఒక్కటై మీ మీద పోటీకి దిగితే మీరెలా ఎదుర్కొంటారు?   వనపర్తి ప్రజలంతా నిరంజన్ రెడ్డి వైపు.. వాళ్లిద్దరూ (చిన్నారెడ్డి-కాంగ్రెస్, రావుల చంద్రశేఖర్ రెడ్డి-టీడీపీ) ఒకవైపు. ఆ మంత్రగాళ్ల మంత్రం పాటి తప్పింది. పాటి తప్పిన మంత్రం పని చేయదు. నేను చేసిన పనే నన్ను గెలిపిస్తుంది. అదే అన్నిటికీ సమాధానం చెప్తుంది.   [caption id="attachment_362" align="alignnone" width="964"] 2014లో ఓడించిన ప