Skip to main content

థాంక్స్ టు సోనియమ్మ


తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్ రెడ్డి. పట్టిన పట్టు వదలడు అనే పేరున్న రేవంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా అలాగే మలుచుకున్నారు. రాజకీయ జీవితాన్ని తాము కోరినట్టుగా మలుచుకున్న అతికొద్ది మంది నాయకుల్లో రేవంత్ ఒకరు. చాలా మందికి అదృష్టవశాత్తూ సీఎం కుర్చీ దొరకవచ్చు. కానీ రేవంత్ కు ఆ సీటు అదృష్టవశాత్తూ దొరకలేదు. తన ప్రయాణాన్నే సీఎం కుర్చీ దిశగా టార్గెట్ చేసి పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు. ఆ విషయాల గురించి మరింత డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ముందు.. రేవంత్ తెలంగాణ సీఎం అయిన సందర్భం గురించి చెప్పుకోవాలి. 

నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజానీకం. ఈ కృషిలో రేవంత్ పాత్రను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇతర కాంగ్రెస్ నేతలెవరూ చేయని పనిని రేవంత్ చేసిపెట్టారు. ప్రజల్లో నమ్మకం కలిగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామేం చేస్తారో రేవంత్ చెప్పారు. ఆయన మాటల్ని ప్రజలు నమ్మారు. రాష్ట్ర కాంగ్రెస్ సైన్యాన్ని నడిపించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్.. టీ-పీసీసీ చీఫ్ గా అనుకున్న లక్ష్యం ఛేదించి.. పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఫలితంగా నేతలందరి మొహాల్లోనూ ఆనందం విప్పారింది. ఒక భారీ లక్ష్యాన్ని అందుకోవడానికి రేవంత్ అనే నేత తమకు ఆసరా అయ్యాడన్న ఫీలింగ్ కార్యకర్తలందరిలోనూ కనిపించింది. 

ఇక సీఎల్పీ నేతగా ఎవర్ని ఎన్నుకోవాలి? ముఖ్యమంత్రి ఎవరవుతారు? అనే కీలకమైన అంకానికి చేరుకున్న తరువాత 48 గంటలపాటు జరిగిన చర్చోపచర్చల్లో ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కీలకంగా వ్యవహరించారు. 64 మంది ఎమ్మెల్యేలతో చర్చించారు. అభిప్రాయాలు తీసుకున్నారు. అభ్యంతరాలను మనసులో పెట్టుకున్నారు. సీఎం కుర్చీపై కన్నేసిన సీనియర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి అభ్యంతరాలేంటో కనుకున్నారు. ప్రయారిటీస్ నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో పూర్తి నివేదిక తయారు చేసి ఏఐసీసీ పెద్దలకు సమర్పించారు. దీంతో బంతి ఢిల్లీ పెద్దల కోర్టులో పడింది. రేవంత్ ను సీఎంగా చేయడంలో అభ్యంతరాలు వెలిబుచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క.. అలాగే మధ్యవర్తులు డీకే శివకుమార్, ఠాక్రేలు ఢిల్లీకి చేరుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రయారిటీస్, ఆప్షన్స్ గురించి హైకమాండ్ కు పూసగుచ్చినట్టు వివరించారు. అందరి సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుకొని, వారి అనుమానాలు తీర్చాక.. రేవంత్ ను సీఎల్పీ నేతగా ప్రకటించింది అధిష్టానం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రేవంత్ ను సీఎల్పీ నేతగా ప్రకటించారు. రేవంత్ ను డైనమిక్ లీడర్ గా అభివర్ణించిన వేణుగోపాల్.. తెలంగాణ ప్రజలకు తాము ఇచ్చిన హామీలు పూర్తి చేయడంలో నిమగ్నమవుతామని చెప్పారు. 
రేవంత్ ను సీఎల్పీ నేతగా ప్రకటించడంతో ఆయనకు ఉండే అన్ని అవరోధాలూ తొలగిపోయినట్టయింది. 7వ తేదీన రేవంత్ తన టీమ్ తో కలిసి ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో, పరిపాలనలో మరో అధ్యాయం మొదలవుతోంది. కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వాన్ని చూసిన తెలంగాణ ప్రజలు.. రేవంత్ ప్రభుత్వం ఎలా ఉంటుందన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత