Skip to main content

కాంగ్రెస్ ను తలెత్తుకునేలా చేసిన టఫ్ మ్యాన్

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. బీఆర్ఎస్ కార్డు సైడ్ అయిపొయ్యి.. కాంగ్రెస్ కార్డు ముందుకొచ్చింది. దీనికంతటికీ కారణం ఒకే ఒక్కడు. ఆయనే టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగిల్ హ్యాండెడ్ గా పార్టీని, సీనియర్లను, శ్రేణులను, కేడర్ ను నడిపించి ఉన్నతాసనాన్ని ఖరారు చేసుకున్నారు రేవంత్. మరి.. ఈ ఉన్నతమైన స్థానం ఆయనకు ఊరికే లభించిందా? ఆయన కృషి ఎలాంటిది? 

తెలంగాణ ప్రభుత్వ మార్పిడిలో కీలకమైన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారూ ఉంటే అది రేవంత్ రెడ్డి. టీ-పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం వెనుక.. కాంగ్రెస్ కు కాకతాళీయమైన అవసరమేం లేదంటారు నిపుణులు. రేవంత్ ను టీ-పీసీసీ చీఫ్ గా తీసుకోవడం వెనుక ఉభయుల ప్రయోజనాలూ ఉన్నాయట. అందుకే కాంగ్రెస్ ను తనకు అప్పగిస్తే.. కొన్ని కీలకమైన నిర్ణయాలు తనకు కట్టబెడితే.. పార్టీని నడిపిస్తానని.. హైకమాండ్ నిశ్చింతగా ఉండొచ్చని.. కచ్చితంగా రిజల్ట్ రాబడతానని ఎంతో నమ్మకంగా చెప్పారట రేవంత్. ఆయన మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చూసే.. సోనియా, రాహుల్ టీ-పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించేందుకు ముందుకొచ్చారు. దానిపై టీ-కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు, ఎన్ని అసంతృప్తులు వచ్చినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్లింది అధిష్టానం. రేవంత్ కు బాధ్యతలు అప్పగిస్తూ వారు తీసుకున్న నిర్ణయం తప్పు కాదని తాజాగా రుజువైంది. తెలంగాణలో పదేళ్లుగా అధికారం కోసం ఆవురావురంటూ ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు రూపంలో అపురూపమైన బహుమానాన్ని అందించారు రేవంత్. 

మామూలుగా అయితే ముక్కూ మొహం తెలియని అపరిచితుడికి ఎవరైనా ఇంటి తాళాలు అప్పగిస్తారా? కొన్ని లక్షల విలువ చేసే ఇంటి తాళాలే ఇవ్వడం సాధ్యం కానప్పుడు ఒక దేశాన్ని పాలించిన పార్టీగా.. ఏఐసీసీ నేతలు.. టీ-పీసీసీ బాధ్యతలు అప్పగించడం అంత ఆశామాషీనా? ఇది నిజంగా అసాధ్యమే. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలే అయినా.. ఎవ్వరికీ పార్టీ మీద పెద్ద పట్టింపు లేదు. పార్టీ ప్రయోజనాల విషయంలో ఎవరూ కమిటెడ్ కాదు. పార్టీ పేరు చెప్పుకొని నాయకులుగా రాణిస్తూ ప్రయోజనాలు అనుభవించాలన్నదే వారి పాలసీ. ముఖ్యనేతలంతా మరి ఆ విధమైన వైఖరితో ఉన్నప్పుడు పార్టీ ఎలా బాగుపడుతుంది? తెలంగాణ ఇచ్చినా కనీసం పేరు ప్రతిష్టలు కూడా లేకపోతే ఇక భవిష్యత్తును ఎలా ఊహించవచ్చు? అందుకే ఏఐసీసీ నేతలు బయటి నుంచి వచ్చే ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. అందుకు నేనున్నానంటూ రేవంత్ రాయబారం నడపడం.. వారికి రేవంత్ పట్టుదల మీద, బీఆర్ఎస్ నేతల లోగుట్లపై ఆయనకున్న విషయ పరిజ్ఞానం మీద నమ్మకం కుదిరిందట. దీంతో ఎవరేమన్నా తగ్గేదే లేదంటూ.. ఆయనకు పీసీసీ పగ్గాలు కట్టబెట్టి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది అధిష్టానం. 2021 జులై 7న ఆనాటి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నుంచి నవంబర్ 30న ఎన్నికలు జరిగేదాకా అన్నీ తానై పార్టీని చక్కబెట్టారు. సరిగ్గా రెండేళ్ల 4 నెలలు గడిచేసరికి రిజల్ట్ చూపించారు రేవంత్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల‌ నుంచి పోటీ చేశారు. కొడంగల్ నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి.. రాష్ట్రంలో కీలకమైన అత్యున్నత పదవిని అలంకరిస్తున్నారు. ఈ ఒక్కటి చాలదా... రేవంత్ లోని టఫ్ మ్యాన్ కెపాసిటీ ఎలాంటిదో?

రేవంత్ లో వేర్వేరు షేడ్స్ ఉన్నాయి. అన్ని పార్టీల జెండాలు కప్పుకున్న అనుభవమూ ఉంది. టీడీపీ రక్తం ప్రవహిస్తున్నా, బీజేపీ కండువాను ప్రేమించే హృదయం ఉంది. అటు గతంలో బీఆర్ఎస్ జెండా మోసిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో కీలకమైన నేతగా ఎదిగి.. నాయకులందరినీ ఒక్కతాటిపై నడిపించిన ఓ సేనాని సామర్థ్యం కూడా రేవంత్ లో ఉందని రుజువైంది. 

రేవంత్ స్వగ్రామం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కొండారెడ్డిప‌ల్లిలోని వంగూరు. 1969లో జన్మించారు. వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం. తండ్రి పేరు దివంగ‌త అనుముల న‌ర్సింహారెడ్డి. త‌ల్లి రామ‌చంద్ర‌మ్మ‌. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్న‌నాటి నుంచే రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రిచేవారు. గ్రాడ్యుయేష‌న్ చ‌ద‌వుతున్న స‌మ‌యంలో ఏబీవీపీ నాయ‌కుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఏ.వీ.కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన త‌ర్వాత ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు అయిన గీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లి ప్రపోజల్ ను గీత అమ్మానాన్న ఒప్పుకోకపోవడంతో జైపాల్ రెడ్డి చేత రాయబారం నడిపించారట రేవంత్. జైపాల్ చెప్పడంతో రేవంత్ కు గీతను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించారట.. వాళ్ల అమ్మానాన్న. రేవంత్ ను చూడగానే.. ఆయనకుండే క్లారిటీని అర్థం చేసుకున్న గీత పేరెంట్స్.. పెళ్లి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అత్యున్నత పదవి అలంకరిస్తున్న సందర్భంలో వారు ఆనాడు తీసుకున్న నిర్ణయం ఎంత నికార్సయిందో బహుశా ఇప్పుడు అర్థమై ఉంటుందంటున్నారు. మొత్తానికి రేవంత్.. కి ఈ అత్యున్నతమైన స్థానం అనేది జాక్ పాట్ కాదు. కష్టే ఫలి అన్నట్టు.. తాను పూర్తి క్లారిటీతో కష్టపడి సాధించుకున్నదే కావడం గమనార్హం. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత