Skip to main content

వనపర్తి గెలుపు బాటలో నిరంజన్ రెడ్డి

తెలంగాణలో సుదీర్ఘమైన, చెప్పుకోదగిన చరిత్ర గల పాతకాలపు సంస్థానమే వనపర్తి. ఆత్మాభిమానానికి, పౌరుష పరాక్రమాలకు, కవి గాయక వైతాళికులకు పెట్టింది పేరు.. ఈ వనపర్తి. కాలక్రమంలో అదే ఇప్పుడు నియోజకవర్గంగా మారింది. అలాంటి వనపర్తిలో ఎన్నికల పోరాటం రసవత్తరంగా మారుతోంది. అందుక్కారణం సిట్టింగ్ మినిస్టర్ గా, నీళ్ల నిరంజనుడిగా పేరున్న కేసీఆర్ అనుచరుడు ఒకరైతే.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తెలంగాణ ఆవిర్భవించిన సమయంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి మరొకరు. అయితే ఆయనకు టికెట్ ఇస్తానని ఊరించిన కాంగ్రెస్ అధిష్టానం.. మేఘారెడ్డిని అభ్యర్థిగా మార్చేసింది. ఇలాంటి సమయంలో వనపర్తిలో గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే తెలంగాణకు ముందు.. తెలంగాణకు తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలమూరు రూపురేఖలు మారిపోయాయి. అందులో భాగమైన వనపర్తి జిల్లా పేరుతో ఏర్పడిన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు తీసింది.
ఇప్పుడీ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మేఘారెడ్డి మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది. బీజేపీ నుంచి అనుజ్ఞారెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఎన్నికల రణక్షేత్రంలో పోరు మాత్రం బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే అన్నట్టుగా సాగుతోంది. మారిన పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో నియోజకవర్గంలో ఆ ఊసు ఎత్తేవారే లేకుండా పోయారట. ఇతరుల బలాబలాల గురించి కాసేపు పక్కన పెడితే.. ప్రధాన పోరు కొనసాగుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల గురించే ప్రస్తుత చర్చంతా సాగుతోంది.

నిరంజన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో 2014లో నిరంజన్ రెడ్డి అదే తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకొని బరిలో నిలిచారు. అయితే ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అయినా ఓటమికి వెరువకుండా ఆయన ప్రజాక్షేత్రాన్నే అంటి పెట్టుకొని ఉన్నారు. బీఆర్ఎస్ కేడర్, తెలంగాణ ఉద్యమకారులతోనే కలిసి ఉంటూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఆలోచనలను ప్రజల ముందు పెడుతూ వచ్చారు. నీళ్లు లేక, వ్యవసాయం లేక, పడావు పడ్డ భూములను ఏం చేయాలో అర్థం కాక ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నిలపాలో మేధావులతో, ఉద్యమకారులతో, కవులతో కలిసి అనేక చర్చాగోష్టులు నిర్వహించారు. తనకు ఇష్టమైన రంగమైన వ్యవసాయాన్ని వనపర్తిలో ఏ విధంగా కొత్తపుంతలు తొక్కించాలో నిరంతరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన కృషిని గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టి ప్రభుత్వంలో ఆయన సేవలను అకామొడేట్ చేయడం విశేషం. అటు పార్టీ ఫౌండర్ మెంబర్ గా ఉన్న నిరంజన్ రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. ఈ క్రమంలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి 50 వేలకు పైగా బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత వనపర్తి రూపురేఖలే మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 2018లో బంపర్ మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి.. ఇప్పుడు తాను చేసిన అభివృద్ధిని చూపుతూ ఓట్లు అడుగుతున్నారట. 

మరోవైపు కాంగ్రెస్ నుంచి యువకుడైన మేఘారెడ్డి.. ప్రస్తుత మంత్రి అయిన నిరంజన్ రెడ్డిని ఢీకొంటున్నారు. అయితే మేఘారెడ్డి వాస్తవానికి ఒకప్పుడు నిరంజన్ రెడ్డికి అనుచరుడిగా ఉండేవారట. ఆయన ప్రోత్సాహంతోనే వ్యాపార రంగంలో రాణించారట మేఘారెడ్డి. అయితే రాజకీయాల్లో రాణించాలన్న లక్ష్యంతో మేఘారెడ్డి.. నిరంజన్ రెడ్డికి దూరమై కాంగ్రెస్ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న ఊపే తనను గెలిపిస్తుందని, రేవంత్ రెడ్డి చరిష్మా గట్టెక్కిస్తుందని మేఘారెడ్డి భావిస్తున్నారట. కానీ మేఘారెడ్డికి టికెట్ దక్కడంలో జరిగిన ప్రహసనమే ఆయనకు గుదిబండగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.

వనపర్తి కాంగ్రెస్ టికెట్ మొదట సీనియర్ నేత అయిన చిన్నారెడ్డికే కేటాయించారు. ఆయన పేరునే ప్రకటించారు. దీంతో చిన్నారెడ్డి ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. వనపర్తిలో భారీ ర్యాలీ కూడా తీశారట. ఎప్పుడూ ఖర్చు చేయని చిన్నారెడ్డి.. ఇది తనకు ఆఖరు ఎన్నికగా భావించి.. ఎలాగైనా గెలవాలని చేతికి ఎముక లేకుండా ఖర్చు కూడా చేశారట. అయితే కాంగ్రెస్ లో తెరవెనుక జరిగిన డ్రామాల ఫలితంగా చిన్నారెడ్డికి దక్కిన టికెట్ కాస్తా ఆఖరు నిమిషంలో మేఘారెడ్డి ఎగరేసుకుపోయారు. మరి టికెట్ వేటలో గెలిచిన మేఘారెడ్డి.. ఓట్ల వేటలో కూడా విజయం సాధిస్తారా అన్న చర్చే వనపర్తిలో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారుతోంది. ఆ అంశమే అనుమానాస్పదంగా కూడా మారిందన్న టాక్ బలపడుతోంది.

నిజానికి చిన్నారెడ్డి సోనియా కోటాలోనే టికెట్ దక్కించుకున్నారట. టీ-పీసీసీ చీఫ్, ఇతర స్థానిక లీడర్లతో పని లేకుండా నేరుగా అధిష్టానమే తన పేరు ఖరారు చేసింది. దీంతో కేడర్ అంతా తనకు సపోర్టు చేస్తుందని.. ఇప్పుడున్న హవాలో తాను తప్పకుండా గెలిచి వస్తానని చిన్నారెడ్డి భావించారు. తీరా మేఘారెడ్డిని రీ-కన్ఫామ్ చేయడంతో చిన్నారెడ్డి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఒకవైపు కాంగ్రెస్ కు విధేయుడిగా కనిపిస్తూ.. మరోవైపు తనకు వచ్చిన టికెట్ చేజారిన ఫలితంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయడానికి మనసొప్పడం లేదట. మరోవైపు.. తాను ఈసారి పార్టీకి సహకరించాలంటే.. భవిష్యత్తులో తన కుమారుడైన ఆదిత్యకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకున్నారట చిన్నారెడ్డి. ఈ ఈక్వేషన్ కు హైకమాండ్ ఓకే చెప్పడంతో చిన్నారెడ్డి మేఘారెడ్డికి సహకరిస్తానని కార్యకర్తల సమక్షంలోనే చెప్పారట. అయితే మేఘారెడ్డికి మాత్రం తాను మనస్పూర్తిగా సహకరించడం లేదట. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టుగా ప్రచారంలో అడపాదడపా కనిపించడం మినహా.. మనసు పెట్టి వర్క్ చేయడం లేదట. అటు తన అనుచరులకు మీ ఇష్టం వచ్చినవారికి చేయండి అంటూ తెలివిగా నిశ్శబ్దం పాటిస్తున్నారట. దీంతో అనుచరులు తమ ఇష్టానుసారం కొందరు మేఘారెడ్డికి, మరికొందరు నిరంజన్ రెడ్డి వైపు వెళ్లిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారట.

మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పటికే టీడీపీ మాజీ నేత, మంత్రిగా పని చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పడంలో సఫలీకృతుడై.. గెలుపును ఖాయం చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు బీడు భూముల్లో నీళ్లు పారించిన నిరంజన్ రెడ్డి.. మరోవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు తీయిస్తున్నారన్న పేరు తెచ్చుకున్నారు. అటు కాంగ్రెస్ కేడర్ కూడా కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధిని కాదనలేకపోతోంది. దీంతో మేఘారెడ్డి తొలుత టఫ్ ఫైట్ ఇస్తారన్న అభిప్రాయం కలిగించినా.. మారిన పరిస్థితుల నేపథ్యంలో నిరంజన్ రెడ్డికి గెలుపు అవకాశాలు మరింత మెరుగయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. తనకు గురువైన నిరంజన్ రెండోసారి గెలుపును అడ్డుకోవడం.. శిష్యుడైన మేఘారెడ్డి వల్ల అవుతుందా.. అనే చర్చనే వనపర్తిలో నడుస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి కొత్త వ్యక్తి అయిన అనుజ్ఞారెడ్డిని ఆ పార్టీ అధిష్టానం బరిలో నిలిపింది. ఇక్కడ బీజేపీ గురించి పెద్దగా చర్చలో లేకపోవడం.. నిరంజన్ రెడ్డికి కలిసొస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. రేపు మరేం జరుగుతుందో చూడాలి. 



Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత