Skip to main content

చంద్రబాబు ప్రయత్నాలు ఢిల్లీలో ఫలించలేదా?

చంద్రబాబుకు అక్కడ ఢిల్లీలో ద్వారాలు మూసుకుపోయాయా? ఆయన ఎంత ప్రయత్నించినా అమిత్ షా మనసు కరగలేదా? తన కష్టాలు తీరాలన్నా, పార్టీ మీద నీలినీడలు తేలిపోవాలన్నా బలమైన జాతీయ పార్టీ అండ కావాలని కోరుకున్న బాబుకు.. కమలనాథుల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదట. ఆ విషయం కన్ఫామ్ అయ్యాకనే ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ వైపు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడం ఖాయంగా మారిందట. మరి ఆ విశేషాలేంటి?

మొక్క ఎదగాలంటే పందిరి కావాలి. పందిరి లేకపోతే ఎంత మంచి మొక్క అయినా కూడా ఎదగడం ఆగిపోతుంది. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అచ్చం మొక్కలాగే మారిపోయిందట. మరి మొక్కలాంటి పార్టీకి ఎవరో ఒకరు నీరు పోయాల్సిందే. ఎవరో ఒకరి చెయ్యి అందించాల్సిందే. బాబు అందుకోసమే కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ప్రాంతీయ పార్టీగా తెలంగాణలోనే కాదు.. అటు ఆంధ్రాలోనూ ఇప్పుడు టీడీపీ తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణలో అయితే దాదాపుగా అదృశ్యమయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణ టీడీపీలో అసలు కీలక నేతలెవరూ లేకుండా పోయారంటే అతిశయోక్తి కాదు. పట్టణాల్లో, గ్రామాల్లో అక్కడక్కడా సానుభూతిపరులు, పాత కేడర్ ఉన్నా.. బాబు చేస్తున్న నిర్వాకం వల్ల వారు మనసు మార్చుకొని ఇతర పార్టీల్లో సెటిలైపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయనేది ఆరా తీస్తే.. ఔరా అంత చరిత్ర ఉన్న పార్టీకి ఇంతటి దుర్దశ పట్టిందా.. అంటూ మనసు వికలమైపోతుందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. బీజేపీ మీద ఆశలు పూర్తిగా వదిలేసుకున్నారట. మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరే విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారనే అభిప్రాయాలు, వ్యాఖ్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ అండ తనకు అవసరమని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైతే కమలం పార్టీ ఆయన్ని నిరాకరిస్తోందని.. ఇదే వైఖరిని కొనసాగిస్తే కాంగ్రెస్‌ పంచన చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాను కాంగ్రెస్ వైపు వెళ్లడానికి వెనుకాడేది లేదని చెప్పడానికే.. ఇక్కడ తెలంగాణలో పోటీ నుంచి విరమించుకున్నారని.. బాబు పొలిటికల్ డెసిషన్లో అది శ్యాంపిల్ మాత్రమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షాలతో ఉమ్మడి కూటమి ఏర్పాటులో ఆయనే క్రియాశీల పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రతిపక్ష పార్టీల సభల్లోనూ పాల్గొన్నారు. బీజేపీ కేంద్రంలో ఓడిపోతుందనే ధీమాతోనే ఆయన అలా చేశారంటారు. ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కేంద్రంలో ప్రతిపక్షాలు ఘోర ఓటమి చవిచూశాక... ప్రధాని మోడీ కరుణా కటాక్షం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. తాను తీవ్రంగా నిందించిన మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. ఒకవేళ అప్పటినుంచే బీజేపీతో సరైన మైత్రిని కొనసాగిస్తూ ఉన్నట్టయితే బాబుకు ఈ పరిస్థితి ఎదురై ఉండేది కాదన్న అభిప్రాయాలు కూడా కొందరి నుంచి వినిపిస్తున్నాయి. అయితే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడాలనే ఆపత్కాల అవస్థలో పడిపోయారట చంద్రబాబు.

మరోవైపు ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా బ్లాక్‌గా ఏర్పడ్డాయి. అవేవీ టీడీపీని పట్టించుకోవడం మానేశాయి. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు బీజేపీకి దగ్గరవడం వల్లే కీలకమైన ప్రతిపక్షాలన్నీ బాబును ప్రతిపక్ష నేతగా గుర్తించడం మానేశాయట. ఈ నేపథ్యంలో బాబు ప్లాన్‌ బీ ని రెడీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌కు దగ్గర కావడం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచారట. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లోపాయికారీగా మద్దతిచ్చేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్‌కు పడితే, ఆ పార్టీ గెలుపు ఈజీ అవుతుంది. కీలకమైన తెలంగాణపై పట్టు సాధిస్తే, 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... కేంద్రస్థాయిలో మళ్లీ చక్రం తిప్పే అవకాశం తనకు లభిస్తుందనేది చంద్రబాబు ప్లాన్ బి లోని సూత్రమట. జగన్‌ తనపై వరుసగా కేసులు పెడుతుండటంతో బాబుకు ఇప్పుడు కేంద్రం అండ అవసరం అవుతోంది. తాను ఎంత చేరువ అవుతున్నా బీజేపీ నుంచి రక్షణ అందడం లేదు. అందుకే ఆయన హస్తానికి స్నేహ హస్తం అందించేందుకు రెడీ అయిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ఆంద్రాలో కూడా ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు.

అయితే చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉంటాయని ఆ పార్టీలోని పలువురు సీనియర్లే చెబుతున్నారు. మరి చంద్రబాబు ఈసారి కాంగ్రెస్ వైపు వెళ్తే.. ఆ పథకం కూడా ఉల్టాపల్టా అయిపోతే.. బాబు మళ్లీ ఏం చేస్తారన్న ఆందోళన సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. చంద్రబాబు మాత్రం.. బయటికొచ్చినా.. జైల్లో ఉన్నా.. ప్లాన్ బిలు, ప్లాన్ సిలు రచిస్తూనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?