Skip to main content

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ మాజీ భార్య కామెంట్లు

ఏపీ రాజకీయాల్లో "కీ రోల్" పోషించాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ కు.. టైగర్ నాగేశ్వరరావు ఇబ్బందికరంగా మారాడట. అదేంటి? టైగర్ నాగేశ్వరరావుతో పవన కళ్యాణ్ కు వచ్చిన ఇబ్బందేంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. పవన్ రెండో భార్య రేణూ దేశాయ్.. అందులో "కీ రోల్" పోషించడం.. ఆ సినిమా ఫంక్షన్ లో రేణూ మాట్లాడిన మాటలు పవన్ ను పరోక్షంగా టచ్ చేయడం వంటి కారణాలతో ఆయన ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయట. ఇంతకీ రేణూ ఏమంది? ఆమె మాటలు పవన్ కెరీర్ కు ఎలా ఎఫెక్ట్ అవుతాయి? 

Read this also: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరై.. తన వ్యక్తిగత విషయాలతో పాటు తన గత విషయాల గురించి కూడా చెప్పుకున్నారు రేణూ దేశాయ్. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించాలని.. అదృష్టం కలిసొస్తే సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లో రేణూదేశాయి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ కు సంబంధించి ఎదురైన ప్రశ్నలకు పెద్దగా రెస్పాండ్ కాని రేణూ.. అతను సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా..? అనే ప్రశ్నకు సైతం ఒకింత కటువుగానే స్పందించారంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్. ఒక పొలిటీషియన్‌గా అతను ఈ సొసైటీకి అవసరమని మాత్రమే గతంలో ఓ వీడియో ద్వారా చెప్పానని.. అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. ఇక సీఎం అవుతారా లేదా అనేది మాత్రం తాను కోరుకోనని చెప్పడం.. పవన్ ఫ్యాన్స్ లోనే గాక.. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఆసక్తి రేపుతోంది. అక్కడితో ఆగకుండా.. దేవుడు ఉన్నాడని.. ఏ విషయమైనా ఆయనే డిసైడ్‌ చేస్తాడని.. కనీసం ఒక కామన్‌ వ్యక్తిగా కూడా ఆయన వైపు స్టాండ్‌ తీసుకోనని రేణూ తేల్చి చెప్పడం దుమారం రేపుతోంది. 

పవన్ కళ్యాణ్  తన పిల్లలికి తండ్రిగా ఉంటారు... అంతే తప్ప ఆయన రాజకీయ జీవితం గురించి తాను మాట్లాడబోనని ఖండితంగా చెప్పారు రేణు. ఫలానా వ్యక్తిని సపోర్ట్‌ చేయండి అంటూ తనకు ఎన్నికల ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పవన్‌ గురించి తాను ప్రతిసారీ నిజాలే చెప్పానని.. విడాకుల సమయంలో చెప్పినవి కూడా అన్నీ నిజాలేనని.. కొద్దిరోజుల క్రితం పవన్‌ గురించి చెప్పిన మాటల్లో కూడా నిజమే ఉందని... కావాలంటే లై డిటెక్టర్‌ పెట్టి చెక్‌ చేసుకోవచ్చునని రేణు చెప్పడం పవన్ ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది. 

ఒక మంచి పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ సొసైటీకి ఎంతో అవసరం అని తాను గత వీడియోలలో తెలియజేశానని... అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు రేణూ. ఆయన సీఎం అవ్వాలని తాను కోరుకోవడం లేదని.. తనలో గూడు కట్టుకున్న గాఢమైన అభిప్రాయాన్ని అంతే గాఢంగా రేణూ చెప్పారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక కామన్ మ్యాన్ గా కూడా తాను పవన్ కళ్యాణ్ పట్ల స్టాండ్ తీసుకోను అంటూ.. రేణు పవన్ పొలిటికల్ జర్నీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని.. టీడీపీ పొత్తును ఆసరా చేసుకొని వీలైనన్ని ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని జనసేన అధినేత చురుగ్గా పావులు కదుపుతున్నారు. అవకాశం వస్తే తప్పకుండా సీఎం పదవి అధిరోహిస్తానని పదేపదే చెప్తున్నారు. ఈ క్రమంలో పవన్ మాజీ సతీమణి రేణు చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ పై ప్రభావం చూపిస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. పవన్ కు లోకల్ భార్య ఒకరు.. నేషనల్ భార్య ఒకరు.. ఇంటర్నేషనల్ భార్య ఒకరు అంటూ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ వైవాహిక జీవితాన్ని రాజకీయంగా వాడుకోజూస్తున్న వైసీపీకి.. ఇప్పుడు రేణూ చేసిన వ్యాఖ్యలు ఉపయుక్తంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి.. దీనికి పవన్ మళ్లీ ఎలా రెస్పాండ్ అవుతారోనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?