Skip to main content

గ్రామ దేవతల కొలుపుతో పరవశిస్తున్న కమాన్‎పూర్


పెద్దపల్లి జిల్లా కమాన్‎పూర్ మండల కేంద్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎవర్ని పలకరించినా గ్రామ దేవతల ఆరాధనా పారవశ్యంతో తడిసిముద్దయిన ఆనందమే తాండవిస్తోంది. కమాన్‎పూర్‎లో దాదాపు వారం రోజులపాటు జరిగే బొడ్రాయి ప్రతిష్టాపనా మహోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్లను గ్రామ ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో, సామూహిక వేడుకగా జరుపుకుంటున్నారు. 

బొడ్రాయి ప్రతిష్టాపనా కార్యక్రమం అనేది దాదాపుగా తరానికి ఒకసారి జరుపుకుంటారని పెద్దల ఉవాచ. ఒకసారి అలాంటి వేడుక జరిగిన తరువాత మళ్లీ 3, 4 దశాబ్దాల తరువాత గానీ జరుపుకోవడం కుదిరే పని కాదంటారు అనుభవజ్ఞులు. దేశమైనా, గ్రామమైనా ఒక మనిషితో సమానమేనని భారతీయుల తాత్విక చింతన చెబుతుంది. మానవ ఆకారానికి నాభి ఎలాగైతే నవ నాడులకూ ఒక కేంద్ర బిందువుగా ఉంటుందో.. అలాంటిదే గ్రామానికి బొడ్రాయి కూడా. గ్రామం మధ్యలోనే ఈ శిలలను ఏర్పాటు చేస్తారు. అమ్మవార్ల అదే రూపాలను చెక్కబొమ్మలుగా తీర్చిదిద్ది ఉత్సవ విగ్రహాలుగా ఊరేగించడం ఆనవాయితీ. అమ్మవార్ల శుభాశీస్సులు, కరుణా కటాక్షాలు ప్రజలందరి మీదా సమానంగా ప్రసరించాలని వేడుకుంటారు. ఆ తరువాత ఊరంతా సామూహికంగా పండుగ చేసుకొని ఆనందాలు పంచుకుంటారు. ఇళ్లలో జరిగే శుభ కార్యక్రమాల్లో బంధువులంతా కలిసి పాల్గొని బరువు బాధ్యతలు ఎలాగైతే పంచుకుంటారో.. బొడ్రాయి పండుగను కూడా ఊరంతా ఒక మహోత్సవంగా జరుపుకోవడం భారతీయుల తత్వ చింతనలోని ఒక విశేషంగా చెప్పుకుంటారు. 


ఇలాంటి గ్రామ వేడుకల వల్ల ఆ గ్రామ ప్రజల మధ్య ప్రేమానురాగాలు, పరస్పర విశ్వాసాలు బలపడతాయి. ఒకరి గురించి మరొకరికి అవగాహన పెరుగుతుంది. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వెంటనే స్పందించి ఆపన్న హస్తం అందించే ఐక్యతా గుణం ఏర్పడుతుంది. ఇలాంటి వేడుకలు జరుపుకోవడం వల్ల గ్రామంలో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, ఊరి సంప్రదాయాల పట్ల ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. జన్మభూమి పట్ల మరింత బాధ్యతను, మరింత అనురాగాన్ని పెంపొందించే బొడ్రాయి వేడుక కోసం అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, దూరపు బంధువులు సైతం కలుసుకోవడం ఒక సంప్రదాయం. 

కమాన్‎పూర్ లో ఇలాంటి అరుదైన వేడుకను బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోందని, ప్రజల క్షేమం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఊళ్లోని వలంటీర్లు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు ఎంతగానో సహకరిస్తున్నారని సర్పంచ్ నీలం సరిత, శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ ఇదే ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?