Skip to main content

పేరుకు తగినట్టుగానే ఆయన రారాజు-చిరంజీవి

తెలుగు చిత్రసీమలో మరో పాతతరపు ధ్రువతార నింగికేగింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటుడిగా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కృష్ణంరాజు.. అటు రాజకీయాల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలనే తహతహ ఆయనకు ఉన్నా.. అందుకు తగిన సహకారం దొరకలేదనే అసంతృప్తికి లోనైనట్టు చెబుతారు. ఏ పార్టీలో ఉన్నామన్నది కాకుండా.. ఏం చేశామన్నదే ఆయన ఫిలాసఫీగా ఉండేదని.. అయితే రాజకీయాల్లో ఉండే అనేక రకాల ఒత్తిళ్లు, పరిమితుల కారణంగా.. ఏ పార్టీలో కూడా కృష్ణంరాజు పూర్తిగా ఒదిగి ఉండలేకపోయారన్న అభిప్రాయాలున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రేక్షకులకు తన విలక్షణమైన నటనను అపురూపమైన జ్ఞాపకంగా అందించారు కృష్ణంరాజు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు పూర్తి పేరు.. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు ప్రేక్షకులకు ఓ భారీ నట విగ్రహంగా మాత్రమే తెలిసిన కృష్ణంరాజులో బహుముఖీనమైన అభిరుచులు, ఆకాంక్షలు ఉన్నాయి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో అనేక పాత్రలను ఎంతో విజయవంతంగా పోషించినట్టు ఆయన సినీ ప్రస్థానం చెబుతుంది. తెలుగునేలపై స్వేచ్ఛా పోరాటాల సమయంలో తనదైన ముద్రవేసిన ఆంధ్రపత్రికకు కృష్ణంరాజు ఓ సాధారణ రిపోర్టర్ గా పనిచేశారు. డిగ్రీ తరువాత నటజీవితం వైపు ఆకర్షితులయ్యారు. 1966లో చిలకా గోరింక సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు.. 1970, 80వ దశకంలో రారాజుగా వెలుగొందారు. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి మహానటుల హవా కొనసాగుతున్న కాలంలో.. తనదైన గంభీర ముద్రతో, ప్రత్యేకమైన హావభావాలతో, పదాలు పలికించలేని ముఖకవళికలతో తెలుగు ప్రేక్షకులకు వెండితెర మీద కొత్తరుచులు చూపించారు. రెబల్ స్టార్ గా చిరస్థాయిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. 

స్ఫూరద్రూపి అయిన ఈ రెబల్ స్టార్.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఎంతో ప్రయత్నించారు. 1992లో నర్సాపురం లోక్‎సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1998లో కాకినాడ నుంచి బీజేపీ తరఫున గెలిచి ఓ ప్రజానాయకుడిగా రాణించారు. లక్షా 65 వేల ఓట్ల మెజారిటీ సాధించి వాజ్‎పేయి వంటి మహా నేతల దృష్టిని ఆకర్షించారు. అందుకే ఆయనకు విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి మంత్రిత్వ శాఖల్లో సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. అంతేకాదు.. అనేక పార్లమెంటరీ కమిటీల్లోనూ సభ్యత్వం కల్పించి ఆయన ఆలోచనలకు అవకాశం కల్పించారు. ఆనాటి బీజేపీ నేతల వ్యవహార శైలి కారణంగానే కృష్ణంరాజు కమలనాథులవైపు మొగ్గు చూపారంటారు. అయితే ఆ తరువాత ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా ఏపీలో బీజేపీ పర్ఫామెన్స్ పెద్దగా లేనికారణంగా.. బీజేపీలో కొనసాగలేకపోయారు. ఆ కారణంగానే తనకు ఆప్తుడైన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరిపోయారని విశ్లేషకులు భావిస్తారు. అయితే ఆ పార్టీ కూడా ఓ చరిత్రగా మిగిలిపోవడంతో.. చాలాకాలం పాటు రాజకీయాల పట్ల మౌనముద్ర దాల్చారని సన్నిహితులు చెబుతుంటారు. ఆ తరువాత కమలనాథులు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తుండడంతో.. బీజేపీ మీద ఆశలు పెంచుకున్నారంటారు. 

ఏపీలో పార్టీ బలోపేతానికి కమలనాథులు తీసుకునే చర్యల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడం, పలువురు సీనియర్ నటులను కూడా బీజేపీ నేతలు సంప్రదిస్తూం ఉండడం వంటి కారణాలతో కృష్ణంరాజులో ఆశలు మల్లీ చిగురించాయంటారు. ఈ క్రమంలోనే ఈ రెబల్ స్టార్.. గవర్నర్ పదవిని ఆశించారని, తన కోరికను బీజేపీ నేతలు తప్పక తీరుస్తారన్న అభిప్రాయంలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే తెలుగు ప్రజల అభిమాన నటుడు.. అనుకోకుండా అంతిమయాత్రకు సిద్ధమవడంతో ఆవేదన చెందుతున్నారు. 

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనోత్సవాల కోసం హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. అందుకోసం ఆయన 16వ తేదీనే హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి, కేంద్రంలో మంత్రిపదవి అలంకరించిన వ్యక్తిగా కృష్ణంరాజుకు బీజేపీ నేతలు పెద్దఎత్తున నివాళులు అర్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులను అమిత్ షా స్వయంగా కలిసి కృష్ణంరాజుకు నివాళులు అర్పిస్తారని, ఆయన కుటుంబానికి సంఘీభావం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే అమిత్ షా ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన బహుముఖ నటనతో, సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్నారని అమిత్ షా ట్వీట్ చేశారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీరని లోటు మిగిల్చిందన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్ షా కలిసే సమయంలో ఆయన నటవారసుడైన ప్రభాస్ కూడా అక్కడే ఉండేలా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో మరో నటుడు నిఖిల్‎తో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ తో షా భేటీ అయిన రోజునే నిఖిల్ కూడా కలవాల్సి ఉండగా.. అనుకోకుండా అది వాయిదా పడిందని చెబుతున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో 183 సినిమాలు చేసిన సుదీర్ఘమైన నట ప్రస్థానం కలిగిన కృష్ణంరాజు.. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతారు. భారతీయ సంప్రదాయాలన్నా, భారతీయ జీవన విధానమన్నా ఎక్కువగా ఇష్టపడే రెబల్ స్టార్.. రోజూ రెండుసార్లు యోగా చేసేవారని చెబుతారు. రెగ్యులర్ గా యోగా చేసేవారికి శరీరం లొంగిపోతుందని, 8 గంటల నిద్ర అనే బానిసత్వం నుంచి విముక్తి పొందుతుందని ఆయన నమ్మేవారు. నిత్య యోగా వల్ల 2 గంటల నిద్ర కూడా సరిపోతుందనేవారు. నిద్రను నియంత్రించడం ద్వారా ఎక్కువ గంటలు శ్రమించే అవకాశం శరీరానికి దొరుకుతుందని, అదే విజయానికి కారణమవుతుందని కృష్ణంరాజు నమ్మేవారు. సినిమాల్లో సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆయన తెలుగు అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమ ప్రయాణానికి సిద్ధమవడం తెలుగు లోకాన్ని విషాదంలో ముంచేసింది. 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత