Skip to main content

పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షా భేటీ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి రేపుతోంది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు పొక్కకపోయినా.. కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడనే పేరున్న అమిత్ షా.. తన విలువైన సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది. 

బీజేపీ టాప్ లీడర్, టాప్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా.. నోవోటెల్ హోటల్లో ప్రముఖ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ గెలుపు కోసం, దగ్గరి బంధువైన చంద్రబాబు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీతో పాటు చంద్రబాబునాయుడుతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టాకే.. పవన్ కల్యాణ్ తో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్న ఎన్టీఆర్.. అమిత్ షా ను కలవడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. 

ఏపీలో సొంతబలం లేని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి ఓ మంచి శక్తిగా ఎదగాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో చెలిమి చేసినా.. ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాల చేత బాబును తాము నమ్మే పరిస్థితి లేదంటున్నారు పలువురు బీజేపీ నేతలు. మరోవైపు.. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందనేది ఏపీ బీజేపీ నేతల అభిప్రాయం. అందుకు అనుగుణంగానే సోము వీర్రాజు కొంత చొరవ తీసుకొని.. టీడీపీ, జనసేన, బీజేపీ లను కలిపి ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే జనసేనాని ఇటీవల.. తాను గతంలో త్యాగం చేశానని, ఈసారి ఇతరులు కూడా త్యాగనిరతి చూపించుకోవాలని కామెంట్లు చేయడం, అటు చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ అప్పుడే టికెట్లు కేటాయిస్తుండడం వంటి అంశాలతో.. తమ మూడు పార్టీల పొత్తు త్రిశంకు స్వర్గం లాంటిదేనన్న అభిప్రాయానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు వచ్చినట్లు ఆఫ్ ద రికార్డుగా పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఏక కాలంలో పవన్ కల్యాణ్ కు, అటు చంద్రబాబునాయుడుకు చురుకు తగిలేలా ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

అమిత్ షా గానీ, మోడీ గానీ.. తమ సమయాన్ని వృథా చేసుకోరని, రాజకీయాలు కాకుండా వారిద్దరూ వేరే అంశాలు చర్చించడానికి టైమ్ దుర్వినియోగం చేయరని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అంటున్నారు. ఏపీలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విడివిడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. తమకు ఒరిగే నష్టమేమీ ఉండబోదన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలిస్తే.. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ నేతలు 76 సీట్లు గెల్చుకున్నారని గుర్తు చేశారు. రేపు ఏపీలో కూడా అదే రిపీట్ అవుతుందన్న కొడాలి నాని.. చంద్రబాబునాయుడుతో ఒరిగేదేమీ ఉండదన్న ఉద్దేశంతోనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఉంటారన్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ స్టార్ ను సమర్థవంతంగా వాడుకోవడం చంద్రబాబునాయుడుకు చేత కాలేదని, ఆయన పడేసిన పావుతోనే ఇప్పుడు కమలనాథులు గేమ్ షురూ చేశారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. కీలక బాధ్యతలు ఇచ్చి పలు రాష్ట్రాల్లో కూడా ఆయన సేవలు వినియోగించుకునే ప్లాన్ చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి బీజేపీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది.. రేపేం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?