Skip to main content

పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షా భేటీ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి రేపుతోంది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు పొక్కకపోయినా.. కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడనే పేరున్న అమిత్ షా.. తన విలువైన సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది. 

బీజేపీ టాప్ లీడర్, టాప్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా.. నోవోటెల్ హోటల్లో ప్రముఖ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ గెలుపు కోసం, దగ్గరి బంధువైన చంద్రబాబు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీతో పాటు చంద్రబాబునాయుడుతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టాకే.. పవన్ కల్యాణ్ తో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్న ఎన్టీఆర్.. అమిత్ షా ను కలవడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. 

ఏపీలో సొంతబలం లేని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి ఓ మంచి శక్తిగా ఎదగాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో చెలిమి చేసినా.. ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాల చేత బాబును తాము నమ్మే పరిస్థితి లేదంటున్నారు పలువురు బీజేపీ నేతలు. మరోవైపు.. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందనేది ఏపీ బీజేపీ నేతల అభిప్రాయం. అందుకు అనుగుణంగానే సోము వీర్రాజు కొంత చొరవ తీసుకొని.. టీడీపీ, జనసేన, బీజేపీ లను కలిపి ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే జనసేనాని ఇటీవల.. తాను గతంలో త్యాగం చేశానని, ఈసారి ఇతరులు కూడా త్యాగనిరతి చూపించుకోవాలని కామెంట్లు చేయడం, అటు చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ అప్పుడే టికెట్లు కేటాయిస్తుండడం వంటి అంశాలతో.. తమ మూడు పార్టీల పొత్తు త్రిశంకు స్వర్గం లాంటిదేనన్న అభిప్రాయానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు వచ్చినట్లు ఆఫ్ ద రికార్డుగా పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఏక కాలంలో పవన్ కల్యాణ్ కు, అటు చంద్రబాబునాయుడుకు చురుకు తగిలేలా ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

అమిత్ షా గానీ, మోడీ గానీ.. తమ సమయాన్ని వృథా చేసుకోరని, రాజకీయాలు కాకుండా వారిద్దరూ వేరే అంశాలు చర్చించడానికి టైమ్ దుర్వినియోగం చేయరని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అంటున్నారు. ఏపీలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విడివిడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. తమకు ఒరిగే నష్టమేమీ ఉండబోదన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలిస్తే.. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ నేతలు 76 సీట్లు గెల్చుకున్నారని గుర్తు చేశారు. రేపు ఏపీలో కూడా అదే రిపీట్ అవుతుందన్న కొడాలి నాని.. చంద్రబాబునాయుడుతో ఒరిగేదేమీ ఉండదన్న ఉద్దేశంతోనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఉంటారన్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ స్టార్ ను సమర్థవంతంగా వాడుకోవడం చంద్రబాబునాయుడుకు చేత కాలేదని, ఆయన పడేసిన పావుతోనే ఇప్పుడు కమలనాథులు గేమ్ షురూ చేశారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. కీలక బాధ్యతలు ఇచ్చి పలు రాష్ట్రాల్లో కూడా ఆయన సేవలు వినియోగించుకునే ప్లాన్ చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి బీజేపీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది.. రేపేం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. 


Comments

Popular posts from this blog

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థాయిలో అందిస్తున్న తమ సేవలను గుర్తి

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం) అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం.  దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి. 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం.  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరా

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే