Skip to main content

పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షా భేటీ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి రేపుతోంది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు పొక్కకపోయినా.. కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడనే పేరున్న అమిత్ షా.. తన విలువైన సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది. 

బీజేపీ టాప్ లీడర్, టాప్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా.. నోవోటెల్ హోటల్లో ప్రముఖ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ గెలుపు కోసం, దగ్గరి బంధువైన చంద్రబాబు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీతో పాటు చంద్రబాబునాయుడుతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టాకే.. పవన్ కల్యాణ్ తో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్న ఎన్టీఆర్.. అమిత్ షా ను కలవడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. 

ఏపీలో సొంతబలం లేని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి ఓ మంచి శక్తిగా ఎదగాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో చెలిమి చేసినా.. ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాల చేత బాబును తాము నమ్మే పరిస్థితి లేదంటున్నారు పలువురు బీజేపీ నేతలు. మరోవైపు.. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందనేది ఏపీ బీజేపీ నేతల అభిప్రాయం. అందుకు అనుగుణంగానే సోము వీర్రాజు కొంత చొరవ తీసుకొని.. టీడీపీ, జనసేన, బీజేపీ లను కలిపి ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే జనసేనాని ఇటీవల.. తాను గతంలో త్యాగం చేశానని, ఈసారి ఇతరులు కూడా త్యాగనిరతి చూపించుకోవాలని కామెంట్లు చేయడం, అటు చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ అప్పుడే టికెట్లు కేటాయిస్తుండడం వంటి అంశాలతో.. తమ మూడు పార్టీల పొత్తు త్రిశంకు స్వర్గం లాంటిదేనన్న అభిప్రాయానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు వచ్చినట్లు ఆఫ్ ద రికార్డుగా పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఏక కాలంలో పవన్ కల్యాణ్ కు, అటు చంద్రబాబునాయుడుకు చురుకు తగిలేలా ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

అమిత్ షా గానీ, మోడీ గానీ.. తమ సమయాన్ని వృథా చేసుకోరని, రాజకీయాలు కాకుండా వారిద్దరూ వేరే అంశాలు చర్చించడానికి టైమ్ దుర్వినియోగం చేయరని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అంటున్నారు. ఏపీలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విడివిడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. తమకు ఒరిగే నష్టమేమీ ఉండబోదన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలిస్తే.. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ నేతలు 76 సీట్లు గెల్చుకున్నారని గుర్తు చేశారు. రేపు ఏపీలో కూడా అదే రిపీట్ అవుతుందన్న కొడాలి నాని.. చంద్రబాబునాయుడుతో ఒరిగేదేమీ ఉండదన్న ఉద్దేశంతోనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఉంటారన్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ స్టార్ ను సమర్థవంతంగా వాడుకోవడం చంద్రబాబునాయుడుకు చేత కాలేదని, ఆయన పడేసిన పావుతోనే ఇప్పుడు కమలనాథులు గేమ్ షురూ చేశారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. కీలక బాధ్యతలు ఇచ్చి పలు రాష్ట్రాల్లో కూడా ఆయన సేవలు వినియోగించుకునే ప్లాన్ చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి బీజేపీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది.. రేపేం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత