Skip to main content

ఉద్ధవ్ ను రాజీనామా చేయొద్దన్న పవార్... అయినా..

మహా రాజకీయం మహా సంక్షోభాన్ని తలపిస్తోంది. ఏక్‎నాథ్ షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండగా.. ఉద్ధవ్ శిబిరం వెలవెలపోతోంది. ఉద్ధవ్ థాక్రే నిన్ననే అధికార నివాసాన్ని ఖాళీ చేయడంతో ఆయన రాజీనామా చేయడం ఇక లాంఛనమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారానికి మేజిక్ ఫిగర్ 144 సంఖ్య సరిపోతుండగా.. ఇండిపెండెంట్లు, స్థానిక పార్టీలు కలుపుకొని.. 169 సంఖ్యతో మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమి సభ్యులు అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అయితే అసంతృప్త నేత ఏక్‎నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేయడంతో.. సంక్షోభానికి తెర లేచింది. 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అసోంలోని గౌహతిలో ఆతిథ్యం పొందుతూ.. క్షణక్షణం అధికార శివసేనలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యే షిండే చాలా కీలకంగా మారిపోయారు. తన దగ్గరున్న సంఖ్యతో బీజేపీతో పాటు శివసేన రెబల్ అభ్యర్థులతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమైపోయింది. ఈ సంక్షోభాన్ని ఆలస్యంగా గుర్తించిన శివసేన, ఎన్సీపీ నేతలు.. నష్టనివారణ చర్యలకు పూనుకున్నా ఆ ప్రక్రియలేవీ సుసాధ్యంగా కనిపించడం లేదు. గౌహతిలోని రాడిసన్ హోటల్లో ఉత్తేజంతో నినాదాలిస్తున్న రెబల్ ఎమ్మెల్యేల నినాదాలే అందుకు రుజువుగా చెబుతున్నారు. 

ఈ ఎపిసోడ్ నుంచి శివసేన పూర్తిగా చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. ఇంతకన్నా ఏం జరుగుతుంది.. అధికారం పోతుంది.. అంతేకదా.. పోయిన అధికారం మళ్లీ వస్తుంది అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అసహనంగా వ్యాఖ్యానించారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు చేసింది చాలా తప్పిదమని, మహా వికాస్ అఘాడీలో ఉండడం ఇష్టం లేకపోతే.. అదే విషయాన్ని తమ ముందుకు వచ్చి చెప్పవచ్చన్నారు. ఇప్పటికీ వారు వెనక్కి రావాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ ఆటలో అసలు ఎవరూ పట్టించుకోని క్యారెక్టర్ ఎవరూ అంటే... అది కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటేల్ తూతూ మంత్రంగా మీటింగ్ పెట్టి ఎన్సీపీని, శివసేనను తిట్టిపోశారు. అక్కసు వెళ్లగక్కారు. 

ఇటు శివసేన అధికారిక నేతగా ఉద్ధవ్ థాక్రే పెట్టిన సమావేశానికి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో శివసేన చేతులెత్తేసినట్లే అయిపోయింది. మరోవైపు ఈ అలయెన్సుకు రూపకల్పన చేసిన శరద్ పవార్.. ముఖ్యమంత్రిగా షిండేకే పగ్గాలు అప్పజెబుతామని బేరసారాలు చేసినా.. ఇక్కడిదాకా వచ్చాక ఇప్పుడెలా వెనక్కి వస్తామంటూ బెట్టు చేస్తున్నారు. వెనక్కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ సంజయ్ రౌత్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. రౌత్ విజ్ఞప్తులను గానీ, ఆయన హెచ్చరికలను గానీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా హాస్యాస్పదంగా కొట్టిపారేస్తున్నారు. ఇదే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ భారీ కటౌట్ ను ఆయన ఇంటిముందు పెట్టి ముఖ్యమంత్రిగా పేర్కొంటూ బీజేపీ కార్యకర్తలు ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు ఏకమొత్తంలో పార్టీ మారినా యాంటీ డిఫెక్షన్ లా వర్తించదని న్యాయ నిపుణులు అంటున్నారు. దీంతో శివసేన చాప్టర్ కూడా క్లోజ్ అయ్యిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కూటమికి రూపకర్త అయిన శరద్ పవార్ ను మించిన చాణక్యుడిగా ఇప్పుడు మహా రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ కనిపిస్తున్నాడంటున్నారు రాజకీయ నిపుణులు.

సంక్షోభం పతాకస్థాయికి చేరింది. అయితే ఫిరాయింపుదార్ల చర్యలతో మహా రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఉద్ధవ్ శిబిరం నుంచి మరో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు.. ఏక్‎నాథ్ షిండేతో చేతులు కలిపారు. వారు గౌహతి బాట పట్టారు. మరోవైపు షిండే క్యాంపు నుంచి ఓ ఎమ్మెల్యే మహారాష్ట్ర పయనమైనట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఎన్సీపీలో ఉత్సాహం కనిపించింది. ఎన్సీపీ ఎమ్మెల్యేల మీటింగ్ తరువాత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడారు. శివసేనకు తమ మద్దతు కొనసాగుతుందని, ఈ సంక్షోభానికి త్వరలోనే తెర పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలు రెబల్స్ ను రెచ్చగొట్టగా.. అజిత్ పవార్ వ్యాఖ్యలు.. తప్పు దిద్దుకునేలాగా కనిపిస్తున్నాయంటున్నారు. ఇక ఆఖరు దశలో శరద్ పవార్ ఎంటరయ్యారు. దీనికంతటికీ కారణం బీజేపీయేనని... శివసేన వెంట తాము కొనసాగుతామన్నారు. రాజీనామాకు సిద్ధపడ్డ ఉద్ధవ్ ను పవార్ వారించినట్లుగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత