Skip to main content

బీ అలర్ట్.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు

ప్రపంచ మానవాళిని కరోనా ఓ కుదుపు కుదిపింది. దాని ప్రభావం 2022 వరకు ఉంటుందని, కేవలం ఐదారు నెలలకే ఈ సమస్య సమసిపోయేది కాదని అప్పట్లోనే కొందరు నిపుణులు అన్నారు. అదే నిజమవుతోందిప్పుడు. అయితే థర్డ్ వేవ్ గా చెప్పుకునే ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి గురించి ఆరోగ్య నిపుణులు కాసింత పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రముఖ విద్యావేద్ద, మెడికల్ ఆంత్రోపాలజీ నిపుణుడు వాసిరెడ్డి అమర్నాథ్ ఏమంటున్నారో చూడండి. 


ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది. తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది. ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు కొన్ని రెట్లు పెరుగుతూ జనవరి చివరి కల్లా లక్షల్లోకి చేరవచ్చు. ఒమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది. 

ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే..  
1. ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు . మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి . ఇది సూపర్ మైల్డ్. 
2. ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు . తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ లు ఓమిక్రాన్ రోగులకు కేవలం విటమిన్ మాత్రలు అంటే బి , సి , డి విటమిన్  మాత్రలు మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు .
౩. జలుబు , గొంతులో గరగర , కొద్ది పాటి ఒంటి నలత దీని లక్షణాలు . కొంత మందికి ఒకటి రెండు రోజులు జ్వరం ఉండవచ్చు . రెండు మూడు రోజుల పాటు వేడి నీళ్లు తాగడం , గొంతు లో గరగర ఆంటే సోర్ త్రోట్  తగ్గించడం కోసం వేడి నీళ్లలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని తల పైకెత్తి గార్గిల్ చేయడం , వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగడం , లేదా అల్లం పసుపు కొద్ది పాటి సుగంధ ద్రవ్యాల తో చేసిన కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు  సార్లు టీ లాగా తాగడం చెయ్యాలి . సాధారణంగా లక్షణాలు  రెండు రోజుల్లో తగ్గిపోతాయి . జ్వరం ఉంటే డోలో 650 ఒకటి రెండు రోజులు వాడొచ్చు .  తగ్గని పక్షం లో డాక్టర్ ను సంప్రదించవచ్చు . ఆసుపత్రి లో చేరాల్సిన అవసరం ఉండదు . ఆక్సిజన్ అవసరం ఏర్పడదు . రుచి వాసన పోదు .

ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది జలుబు లాంటిది . ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి . ఒకటి రెండు రోజులు విశ్రాంతి చాలు . దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం ఓమిక్రాన్ సోకినవారు ఇంట్లోనే ఉండాలి అనే రూల్ తీసేసింది . సోకినా బయటకు వెళ్లొచ్చు . అందరికీ టెస్ట్ లు చేయడం,  ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే అతని కుటుంబ సబ్యులకు కూడా టెస్ట్ లు చేయడం లాంటివి అవసరం లేదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది . ఇక్కడ మన ప్రభుత్వాలు ఎలాంటి నియమాలను తెస్తాయో చూడాలి . భాద్యత కలిగిన పౌరులుగా ప్రభుత్వ నియమాలను పాటిద్దాము . ఇలాంటివి మార్చ్ తరువాత ఇక ఉండవు.

కేసులైతే రోజుకు లక్షల్లో ఉంటాయి . కానీ ఆసుపత్రి కి వెళ్ళడాలు, అంబులెన్సు లు ఇలాంటి వి కనబడవు . టెస్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు . చేసుకోకపోయినా నష్టం లేదు . రెండు మూడు   రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయి. ఓమిక్రాన్ వేవ్ చాలా ఉదృతంగా ఉంటుంది . అంటే కేసుల సంఖ్య  బట్టి ఉదృతం . అంతే కానీ డేంజర్ కాదు . ఓమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం ఉండదు . కేసులు పెరుగుతున్నప్పుడు భయపెట్టే ప్రచారానికి దూరంగా ఉండాలి . భయం పెరిగితే స్ట్రెస్ వస్తుంది . అది గుండెపోటుకు దారి తీయొచ్చు .

ఓమిక్రాన్ కరోనా యొక్క శాంత స్వరూపం . ఓమిక్రాన్ దేవుడు లేదా ప్రకృతి ఇచ్చిన అద్భుత వాక్సిన్ . ప్రాణాలు తీయదు. పైగా ఆంటీ బాడీ లు,  టి సెల్స్ రక్షణ నిస్తుంది . ఆంటే కరోనా వేవ్ కు ఇది చివరి దశ . ఫిబ్రవరి కల్లా ఓమిక్రాన్ వేవ్ ముగుస్తుంది . మార్చ్ నుండి ఇక మన జీవితం లో లాక్ డౌన్ లు,  కట్టడి లాంటివి ఏమీ వుండవు . 2020 లో ప్రారంభం అయిన { చైనా లో 2019 లోనే } కోవిద్ 19 ముగింపు దశ లో మనం ఉన్నాము. ఆంటే ఇది కరోనా పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు మారే సందర్భం . పండెమిక్ ఆంటే వ్యాధి వేగంగావిస్తరిస్తూ    ప్రాణహాని కలిగించే దశ . ఎండెమిక్ ఆంటే ప్రాణాలు హరించదు. మన చుట్టూరా ఎప్పటికీ ఉంటుంది .

మొదటి ప్రపంచ యుద్ధ ముగింపు కాలం లో,  ఆంటే 1918 లో స్పానిష్ ఫ్లూ మొదలయ్యింది . ఆ పాండెమిక్ లో అనేక మంది చనిపోయారు . కానీ రెండేళ్లకు అది ఎండెమిక్ గా మారిపోయింది . ఆ వైరస్ పోలేదు . H1N1 ఇన్ఫ్లుఎంజా- A  వైరస్ ఇంకా మన చుట్టూరా వుంది . అది  జలుబు కలుగ చేస్తుంది . మనం ఇన్నాళ్లు,  ఆంటే కరోనా రాక ముందు జలుబుకు భయపడ్డామా ? లేదు కదా . ఇప్పుడు కరోనా కూడా అలాగే అయిపొయింది . ఓమిక్రాన్ ఇక ఎప్పటికీ పోదు . మనకు సోకుతూనే ఉంటుంది . సోకినా భయపడాల్సింది ఏమీ లేదు .

జనవరి ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు రావొచ్చు . ఆ నంబర్స్ చూసి భయపడొద్దు.

లక్షలాది ఓమిక్రాన్ కేసులు ఉన్నా అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో పాఠశాలలు కళాశాలలు నడుస్తూనే  వున్నాయి . కానీ మన దేశం లో పరిస్థితి వేరు . ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు మూసెయ్యాలని ఆదేశం జారీ  చేసింది . దీని దారిలో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నడవొచ్చు . ఏదైనా ప్రభుత్వం ధైర్యంగా విద్య సంస్థలను నడపాలి అని భావిస్తే వాటి పై ఒత్తిడి పెరుగుతుంది . పాఠశాలలు , కళాశాలలు క్లోజ్ చేసే  దాక ఊరుకోరు . ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి .

సంక్రాంతి సెలవుల తరువాత కొన్ని రోజులు కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం  ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ లో సంక్రాంతి తరువాత కొద్ది రోజులపాటు విద్యాసంస్థలు మూసేస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఆ ప్రభుత్వం విద్య సంస్థలను నడపాలి అని పట్టుదలతో వ్యవహరించడం వల్ల మొదటి రెండు వేవ్ ల మధ్య సుమారుగా నాలుగు నెలలు ఆంధ్రప్రదేశ్ లో విద్య సంస్థలు నడిచాయి . మన దేశం లో ఇలా బోల్డ్ గా వ్యవహరించిన ఏకైక రాష్ట్రం ఏపీ. దాని వల్లే ఆంధ్ర ప్రదేశ్ పిల్లల పై కోవిద్ ప్రభావం తక్కువ . ఢిల్లీ లాంటి రాష్ట్రాలు సుమారుగా రెండుళ్లుగా బడులని మూసేసాయి . దీని వల్ల  పిల్లలకు అపార నష్టం జరిగింది  .

ఏది ఏమైనా మార్చ్ కి తిరిగి బడులు తెరుచుకొంటాయి . పరీక్షలు రద్దు  అయిపోతాయి అనే మూడ్ లో పిలల్లు వున్నారు . ఈ సారి పదవ తరగతి , ఇంటర్ లాంటి పరీక్షలు తప్పక జరుగుతాయి. పిలల్లకు చెప్పండి . చదువు గాడి తప్పితే తీవ్ర నష్టం. మిగతా క్లాసుల కు కూడా పరీక్షలు జరుగుతాయి . ఓమిక్రాన్ వేవ్ ఎంత వేగంగా వస్తుందో ఆంటే వేగం గా పోతుంది . మార్చ్ తరువాత ఇక పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. 2022  అందరి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది. కేసులు, కట్టడి లాంటి మాటలు మార్చ్ తరువాత మనకు వినబడవు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత