Skip to main content

మన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయమిదే

భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు. 


ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం?

శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవకాశాన్ని కూడా లేకుండా చేసేదాన్ని శాస్త్రీయ వైద్యంగా పిలిచేవారి అజ్ఞానానికి జాలిపడాల్సిందేనన్నారు. ఆయుర్వేదంలో అనేక రోగాలకు మందులు ఉన్నాయని, ఎంతో విలువైన ఆ విజ్ఞానాన్ని నాటువైద్యం పేరుతో ప్రజలకు దూరం చేసే కుట్ర దశాబ్దాలుగా దేశంలో విజయవంతంగా అమలైందన్నారు. చదువుకున్నవారు, మీడియా సంస్థల అజ్ఞానం వల్లే ఆయుర్వేద వైద్యులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో డబ్బులు కట్టినా ప్రాణాలు పోతున్న క్రమంలో ఆనందయ్య అందిస్తున్న చికిత్స కరోనా పేషెంట్లకు దివ్యౌషధంగా మారిందని, ఈ ఉదంతం వల్ల ప్రభుత్వాల్లో కాసింతైనా చలనం రావడం సంతోషదాయకమన్నారు. ఒక్క కరోనాకే కాదని, ఆధునిక వైద్య విధానానికి అంతుబట్టని అనేక రోగాలకు ఆయుర్వేదంలో చికిత్స ఉందని గుర్తించాలని కామేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఆనందయ్య లాంటి ఎంతో మంది ఆయుర్వేద వైద్యులు వెలుగులోకి రాకుండా నాటువైద్యులుగా తెరమరుగైపోయారని, ఇప్పుడైనా దేశీయ వైద్యానికి మంచిరోజులు రావాలని ఆకాంక్షించారు. అయితే ప్రజలే ముందుకొచ్చి ఆయుర్వేదాన్ని బతికించుకుంటే ప్రభుత్వాలు చచ్చినట్టు గుర్తిస్తాయని, నెల్లూరు సంఘటన ఇందుకు ఓ తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించే సత్తా ప్రజలకే ఉందని, ఆయుర్వేదానికి మద్దతుగా నిలబడాల్సింది కూడా ప్రజలేనన్నారు. వైద్య వృత్తిలోకి వస్తున్న ఎవరైనా వారికి నిర్దేశించినట్టు ఐదేళ్ల కోర్సు పూర్తి చేసుకొని వృత్తిని చేపడుతున్నారు. అయితే అల్లోపతి డాక్టర్ల చేతిలో ఏదైనా పొరపాటు జరిగితే లేదా అనుకోని సంఘటన జరిగితే ప్రాక్టీసులో భాగంగా, శాస్త్రీయమైన ప్రాక్టీసులో భాగంగా పరిగణిస్తున్న, ప్రచారం చేస్తున్న వ్యవస్థలు లేదా సంస్థలు... ఇతర వైద్య విధానాల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు.. దాన్ని తెలిసీ తెలియని వైద్యంగా, అశాస్త్రీయ వైద్యంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వైద్యులు అయిదేళ్ళు పూర్తిచేసుకుని, పట్టా పుచ్చుకొని, రోగులకు శాయశక్తులా నయం చేస్తామని ప్రమాణం చేశాకే వైద్య వృత్తిని అవలంబిస్తున్నారు. కానీ బుద్ధిజీవులు అందరూ ఈ విషయాలను కావాలనే విస్మరిస్తున్నారని కామేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కామేశ్వరరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తొలితరం ఆయుర్వేద వైద్యుడు. 20 ఏళ్లుగా ఆయన  ఆయుర్వేదం మీదనే అనేక పరిశోధనలు చేసి ఇప్పటికి దాదాపు 70 రకాల మందులు సొంతంగా తయారు చేశారు. సురభి ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో సొంత ప్రయోగశాలను నడుపుతున్నారు. తన ల్యాబ్ లో తయారవుతున్న ఆయుర్వేద మందులు వందశాతం సహజసిద్ధమైనవని, సువాసన కోసం గానీ, కలర్స్ కోసం గానీ ఎలాంటి కృత్రిమ పదార్థాలు కలపడం లేదని, అందువల్లే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తన మందులకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందన్నారు. వికలాంగుడైన డాక్టర్ కామేశ్వరరావు తన పరిస్థితిని లెక్క చేయకుండా వారధి ఫౌండేషన్ పేరుతో పేదలకు క్రమం తప్పకుండా రేషన్ సరుకులు అందిస్తుండడం విశేషం. 

Comments

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                                         

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో