Skip to main content

మన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయమిదే

భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు. 


ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం?

శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవకాశాన్ని కూడా లేకుండా చేసేదాన్ని శాస్త్రీయ వైద్యంగా పిలిచేవారి అజ్ఞానానికి జాలిపడాల్సిందేనన్నారు. ఆయుర్వేదంలో అనేక రోగాలకు మందులు ఉన్నాయని, ఎంతో విలువైన ఆ విజ్ఞానాన్ని నాటువైద్యం పేరుతో ప్రజలకు దూరం చేసే కుట్ర దశాబ్దాలుగా దేశంలో విజయవంతంగా అమలైందన్నారు. చదువుకున్నవారు, మీడియా సంస్థల అజ్ఞానం వల్లే ఆయుర్వేద వైద్యులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో డబ్బులు కట్టినా ప్రాణాలు పోతున్న క్రమంలో ఆనందయ్య అందిస్తున్న చికిత్స కరోనా పేషెంట్లకు దివ్యౌషధంగా మారిందని, ఈ ఉదంతం వల్ల ప్రభుత్వాల్లో కాసింతైనా చలనం రావడం సంతోషదాయకమన్నారు. ఒక్క కరోనాకే కాదని, ఆధునిక వైద్య విధానానికి అంతుబట్టని అనేక రోగాలకు ఆయుర్వేదంలో చికిత్స ఉందని గుర్తించాలని కామేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఆనందయ్య లాంటి ఎంతో మంది ఆయుర్వేద వైద్యులు వెలుగులోకి రాకుండా నాటువైద్యులుగా తెరమరుగైపోయారని, ఇప్పుడైనా దేశీయ వైద్యానికి మంచిరోజులు రావాలని ఆకాంక్షించారు. అయితే ప్రజలే ముందుకొచ్చి ఆయుర్వేదాన్ని బతికించుకుంటే ప్రభుత్వాలు చచ్చినట్టు గుర్తిస్తాయని, నెల్లూరు సంఘటన ఇందుకు ఓ తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించే సత్తా ప్రజలకే ఉందని, ఆయుర్వేదానికి మద్దతుగా నిలబడాల్సింది కూడా ప్రజలేనన్నారు. వైద్య వృత్తిలోకి వస్తున్న ఎవరైనా వారికి నిర్దేశించినట్టు ఐదేళ్ల కోర్సు పూర్తి చేసుకొని వృత్తిని చేపడుతున్నారు. అయితే అల్లోపతి డాక్టర్ల చేతిలో ఏదైనా పొరపాటు జరిగితే లేదా అనుకోని సంఘటన జరిగితే ప్రాక్టీసులో భాగంగా, శాస్త్రీయమైన ప్రాక్టీసులో భాగంగా పరిగణిస్తున్న, ప్రచారం చేస్తున్న వ్యవస్థలు లేదా సంస్థలు... ఇతర వైద్య విధానాల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు.. దాన్ని తెలిసీ తెలియని వైద్యంగా, అశాస్త్రీయ వైద్యంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వైద్యులు అయిదేళ్ళు పూర్తిచేసుకుని, పట్టా పుచ్చుకొని, రోగులకు శాయశక్తులా నయం చేస్తామని ప్రమాణం చేశాకే వైద్య వృత్తిని అవలంబిస్తున్నారు. కానీ బుద్ధిజీవులు అందరూ ఈ విషయాలను కావాలనే విస్మరిస్తున్నారని కామేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కామేశ్వరరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తొలితరం ఆయుర్వేద వైద్యుడు. 20 ఏళ్లుగా ఆయన  ఆయుర్వేదం మీదనే అనేక పరిశోధనలు చేసి ఇప్పటికి దాదాపు 70 రకాల మందులు సొంతంగా తయారు చేశారు. సురభి ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో సొంత ప్రయోగశాలను నడుపుతున్నారు. తన ల్యాబ్ లో తయారవుతున్న ఆయుర్వేద మందులు వందశాతం సహజసిద్ధమైనవని, సువాసన కోసం గానీ, కలర్స్ కోసం గానీ ఎలాంటి కృత్రిమ పదార్థాలు కలపడం లేదని, అందువల్లే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తన మందులకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందన్నారు. వికలాంగుడైన డాక్టర్ కామేశ్వరరావు తన పరిస్థితిని లెక్క చేయకుండా వారధి ఫౌండేషన్ పేరుతో పేదలకు క్రమం తప్పకుండా రేషన్ సరుకులు అందిస్తుండడం విశేషం. 

Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత