రూరల్ డెవలప్మెంట్ అండ్ మీడియా కవరేజి, డాక్యుమెంటేషన్ పై ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్) ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన ఆన్లైన్ శిక్షణా తరగతులు ముగిశాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గల సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ కు సారథ్యం వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకాంక్ష ఏడు రోజుల శిక్షణా తరగతులను విజయవంతంగా నిర్వహించారు. ఇలా దేశ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. రూరల్ రిపోర్టింగ్, అభివృద్ధి కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పై వివిధ విభాగాల్లో నిపుణులైన ప్రొఫెసర్ల చేత క్లాసులు ఇప్పించామని ఆకాంక్ష చెప్పారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రూరల్ డెవలప్మెంట్, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఫ్యాక్ట్ చెకింగ్, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులపై గ్రామీణులకు అవగాహన కల్పించడం, జియో ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్స్ ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడం, మహిళా సాధికారతను ఏ విధంగా త్వరితగతిన సాధించాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ఉపయోగించుకోవడం ఎలా, గ్రామాల్లో మీడియా పోషించాల్సిన పాత్ర, కొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్ జర్నలిజాన్ని గ్రామాల్లో అప్లై చేయడం ఎలా, మొబైల్ జర్నలిజానికి ఉపయోగపడే అధునాతనమైన యాప్స్ ఏమున్నాయి, వాటికి ఉపయోగపడే పరికరాలు ఎక్కడ లభిస్తాయి, వాటిని ఎలా సేకరించుకోవాలి... ఇలా అనేక రంగాల్లో సమగ్రమైన అవగాహన కల్పించేందుకు తాము ప్రయత్నించామని ప్రొఫెసర్ ఆకాంక్ష చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు 450 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో జర్నలిజం బ్యాగ్రౌండ్ ఉన్న, ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్న 179 మందిని తాము ఎంపిక చేశామని అయితే 18 రాష్ట్రాల నుంచి 26 మంది జర్నలిస్టులు ఈ క్లాసులకు హాజరయ్యారని ఆకాంక్ష చెప్పారు. ఈ 26 మంది ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మరింత మందికి శిక్షణ తరగతులు నిర్వహించి గ్రామసీమల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ శిక్షణ తరగతులు ఈ విధంగా విజయవంతం కావడానికి డాక్టర్ నరేంద్ర కుమార్ ఐఏఎస్ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. దీనికి కోఆర్డినేటర్ గా డాక్టర్ వెంకటమల్లు తాడబోయిన వ్యవహరించినట్లు ఆకాంక్ష చెప్పారు. అలాగే ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళడానికి ప్రధాన మీడియా సంస్థల తోడ్పాటు తమకు ఎంతో అవసరం అన్నారు.
కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము
Comments
Post a Comment
Your Comments Please: