Skip to main content

ఈటల ప్లేస్ లో భర్తీ అయ్యేది ఇతనేనా?


ఈటల రాజేందర్ సొంత  నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ హుజురాబాద్‌లో ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ స్థానిక‌ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వారం క్రిత‌మే పెద్దిరెడ్డి కేసీఆర్‌ను క‌లిసిన‌ట్టుగా స‌మాచారం. దీన్ని బ‌ట్టి ఈటల‌ను బయటకు పంపించాలని కేసీఆర్ ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది.ఈటలను వెళ్లిన వెంటనే పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు. ఈటలను బయటకు పంపించి పెద్దిరెడ్డికి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ బాధ్యతలు  అప్పజెప్పాలనే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఉన్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో పెద్దిరెడ్డి.. మంత్రిగానే కాకుండా టీడీపీ ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత దేవేంద‌ర్ గౌడ్‌తో క‌లిసి న‌వ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ త‌ర్వాత ఆ పార్టీని ప్ర‌జారాజ్యంలో విలీనం చేశారు. కొన్నాళ్లు మ‌ళ్లీ టీడీపీలోకి తిరిగివ‌చ్చారు. తెలంగాణ వ‌చ్చాక టీడీపీ బ‌లం త‌గ్గిపోవ‌డంతో.. ఇటీవ‌లే ఆయ‌న బీజేపీలో చేరారు.

నిజానికి ఈట‌ల రాజేంద‌ర్ ను చాలా రోజులుగానే దూరం పెడుతున్నారు కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఏర్పాటు చేసిన కేబినెట్ లో ఈటలకు మొదట చోటు దక్కలేదు. ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో ఈటలకు అవకాశం కల్పించారు కేసీఆర్. ఈటలకు మంత్రి పదవి ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని, ఉద్యమకారులను దూరం పెట్టారనే ఆరోపణలు ఎక్కువ కావడంతో బలవంతంగానే ఆయన్ను తీసుకున్నారని చెబుతున్నారు. మంత్రిపదవి ఇచ్చినా ఈటలతో కేసీఆర్ గ్యాప్ కొనసాగిందని తెలుస్తోంది. చాలాకాలం పాటు ఈటలకు కేసీఆర్ .. అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అసెంబ్లీ జరిగిన సమయంలో ప్రగతి భవన్‌కు వెళ్లి రెండు గంటలు వెయిట్ చేసినా.. ఈట‌ల‌కు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేద‌ని తెలుస్తోంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈటలకు హుజురాబాద్ అసెంబ్లీ టికెట్ రాదనే ప్రచారం జరిగింది. తన భార్యకు అసెంబ్లీ టికెట్ ఇచ్చి... తాను కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని ఈటల అడిగినా కేసీఆర్ పట్టించుకోలేదంటారు. అయితే చివరి నిమిషంలో ఈటలకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికలో కొందరు టీఆర్ఎస్ నేతలు ఈటలకు వ్యతిరేకంగా పని చేశారని చెబుతారు. పార్టీ పెద్దల ఆశిస్సులు ఉన్న నేతలే ఇలా చేశారని ఈటల బహిరంగానే చెప్పారు. ఆ కోపంతోనే పలు సార్లు రాజేందర్.. టీఆర్ఎస్ , కేసీఆర్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లమని ఏడాది క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడే ఈటలను సాగనంపాలని కేసీఆర్ డిసైడయ్యారని, సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. కొవిడ్ కల్లోలం లేకుంటే ఏడాది క్రితమే ఈటలను సాగనంపే వారంటున్నారు.


Comments

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                                         

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో