Skip to main content

లీగల్ అండ్ క్రైమ్ రిపోర్టింగ్ పై ముగిసిన 2 రోజుల వర్క్ షాప్

ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకు లీగల్, క్రైమ్ రిపోర్టింగ్ లో మరింత లోతైన అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ కు మంచి రెస్పాన్స్ లభించింది. న్యాయ పంచాయతీలు మొదలుకొని కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కోర్టు హియరింగ్స్ లో వెల్లడయ్యే ఆసక్తికరమైన అంశాలు, క్రైమ్ రిపోర్టింగ్ లో కీలకమైన అంశాలు, వివిధ రాష్ట్రాల పోలీసింగ్ లో ప్రజలకు కనిపించని కోణాలు, వాటిని వెలికి తీయాల్సిన పద్ధతులపై ఇండియా జస్టిస్ రిపోర్ట్స్-101 రిపోర్టర్స్ సంయుక్తంగా శని, ఆదివారాల్లో ఆన్ లైన్ వర్క్ షాప్ నిర్వహించాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పనిచేసిన పలువురు జర్నలిస్టులు, ఎన్జీవో సంస్థల నిర్వాహకులు, మాజీ డీజీపీ స్థాయి అధికారులు, సీబీఐ అధికారులు ఫ్యాకల్టీలుగా పాల్గొని జర్నలిస్టులకు మార్గదర్శనం చేశారు. 

దేశంలో సుమారు 44 మిలియన్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అవి పరిష్కారానికి నోచుకోవాలంటే కోర్టు వ్యవహారాల డిజిటైజేషన్ తో పాటు పెద్దసంఖ్యలో స్టాఫ్ రిక్రూట్ మెంట్ చేసుకోవాల్సి ఉందని రిటైర్డ్ జడ్జి అజయ్ కుమార్ కుహర్ అన్నారు. అలాగే న్యాయమూర్తుల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని, ఇది కేసుల పరిష్కారాన్ని ప్రభావితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గత ఐదారేళ్లుగా న్యాయమూర్తులు చాలా వేగంగా కేసులు క్లోజ్ చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. ప్రభుత్వాల్లో, వ్యవస్థల కార్యకలాపాల్లో వెలుగుచూడని అంశాలు బయటకు రావాలంటే ఆర్టీఐ ని మించిన మరో మార్గం లేదంటూ  దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో సంజయ్ హజారికా వివరించారు. 

ఇక పోలీసు వ్యవస్థలో సెంట్రల్ రిక్రూట్ మెంట్, స్టేట్ రిక్రూట్ మెంట్ నుంచి పోలీసు చట్టాలు ఎక్కడ, ఎప్పుడు మొదలయ్యాయో దేవయాని శ్రీవాత్సవ అద్భుతంగా వివరించారు. దేశంలోనే అత్యద్భుత పనితీరు కనబరుస్తున్న పోలీసు డిపార్టుమెంటుగా కేరళ పోలీసు విభాగం పేరు తెచ్చుకుందని ఆ రాష్ట్ర మాజీ డీజీపీ జాకోబ్ పన్నూస్ వివరించారు. కేరళలో 2006లోనే కమ్యూనిటీ పోలీసింగ్ మొదలైందని, 1979లో పోలీస్ అసోసియేషన్స్ ప్రారంభం అయ్యాయని, ఇక 1959లోనే కేరళలో పోలీసు సంస్కరణల గురించి చర్చ మొదలైతే.. ఇతర రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచిస్తున్నాయని జాకోబ్ అన్నారు. ఇక పోలీసులు, క్రైమ్ రిపోర్టర్లు ఒకరినొకరు అనుమానించడం, విషయ సేకరణ కోసం ప్రశ్నించడం ద్వారానే ప్రజలకు వివరాలు తెలుస్తున్నాయని, రిపోర్టింగ్ చేసే సమయంలో వాస్తవాలకు రంగులద్దకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే జర్నలిస్టులకు పోలీసు అధికారుల్లో మంచి గుర్తింపు ఉంటుందని విపుల్ ముద్గల్ వివరించారు. అలాగే మన పోలీసు వ్యవస్థకు ప్రజల్లో మంచిపేరు రావాలంటే ప్రభుత్వాలు ఎఫీషియెంట్ పోలీసింగ్ కోసం కాకుండా అకౌంటబుల్ పోలీసింగ్ కోసం కృషి చేయాలని ముద్గల్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు చేసే ఏ ప్రజెంటేషన్ అయినా డాటాతోనే ఆకట్టుకుంటుందని, ఆ డాటాను ఎలా సేకరించాలో అవినాష్ సింగ్ వివరించారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్స్ నుంచి మాయాదారువాలా ఈ వర్క్ షాప్ ను పర్యవేక్షించగా, 101 రిపోర్ట్స్ నుంచి ఐశ్వర్యామూర్తి మోడరేటర్ గా వ్యవహరించారు.


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత