కరోనా ఆపత్కాలంలో భయంకరమైన వైరస్ కి భయపడకుండా పేదలు, అన్నార్తుల ఆకలి కేకలు విని స్పందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను మోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. వారు చేసిన సేవలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతో హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ ప్లానిటోరియంలోని ఆడిటోరియంలో అర్హులైనవారికి గోల్డెన్ లీడర్స్ ఎక్సలెన్సీ అవార్డ్స్ అందజేశారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారి హాజరయ్యారు. సమాజ సేవలో ముందుండి పోరాడిన యోధులను సన్మానించుకోవడం మంచిదన్నారు. దీనివల్ల ఇలాంటి సేవాతత్పరులు ఇంకా ముందుకొచ్చి మేలైన సమాజానికి తోడ్పాటునందించే అవకాశం లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగాగురు రాందేవ్ బాబా శిష్యుడైన రామకృష్ణదేవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్స్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రముఖ నటుడు, సోషల్ వర్కర్ టార్జాన్ లక్ష్మినారాయణ, నిర్మాత, దర్శకుడు రామసత్యనారాయణ, నటుడు మాణిక్ రావు, డాక్టర్ ఎ.శ్రీనివాస్, డాక్టర్ ప్రశాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి, భారత్ టుడే చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ టి.రమేశ్, యాంకర్ గీతిక, సంజనా, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కొడిచెర్ల రమేశ్, శ్రీకాంత్, దుర్గాప్రసాద్, పవన్, లలిత, లోకేశ్ రాజ్, నాగేశ్వర్ తదితరులు హాజరయ్యారు.
Comments
Post a Comment
Your Comments Please: