ప్రణవి ఫౌండేషన్ మరోసారి నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో BME, H&S విభాగంలో పని చేస్తున్న ఫోర్త్ క్లాస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జైన్ కుమార్ ఆచార్య చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలోచాలీచాలని జీతాలతో పనిచేస్తున్నవారికి ప్రణవి ఫౌండేషన్ ద్వారా సహాయం చేశామని, ఇదే తరహాలో తమ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని జైన్ చెప్పారు. పి.రేశ్మారెడ్డి, కె.రామలింగం, జి.వెంకటేశ్వర్లు, కె.వెంకటరమణ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి. శ్రీకాంత్, శ్రీధర్, ఆర్.కృష్ణ, జగన్, అజయ్, కెనడా నుంచి భారత్ అండ్ భారతి తదితరుల సహకారంతో సరుకుల పంపిణీ చేసినట్లు జైన్ చెప్పారు. ఇందుకు సహకరించినవారికి జైన్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment
Your Comments Please: