సిద్ధిపేట, జూలై 03: జిల్లాలో రైతు వేదిక నిర్మాణాలు శరవేగంగా జరపాలని గుత్తేదార్లను జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజమ్మీల్ ఖాన్, డీఏఓ శ్రవణ్ లతో కలిసి ఆయన సమీక్షించారు. క్లస్టర్లవారీగా రైతు వేదిక, ప్రతీ గ్రామంలో డంప్, గ్రేవ్ యార్డు నిర్మాణాలకు ఎంత మేర ఇసుక అవసరమో ప్రతిపాదనలు ఇస్తే త్వరితగతిన పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తామని గుత్తేదార్లకు కలెక్టర్ సూచించారు. డంప్, గ్రేవ్ యార్డులు, రైతు వేదికల నిర్మాణాలపై క్లస్టర్లవారీగా చర్చించారు. అనుకున్న లక్ష్యంలోపు నిర్మాణాలు పూర్తి చేసి జిల్లాను అగ్రభాగాన నిలపాలని కోరారు.
ఆడిట్ అంశంపై కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం
ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిపై ఆడిట్ జరుగుతుందని, ఇందుకోసం నలుగురు రిటైర్డు అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. 4 నెలల పాటు జరగనున్న ఇంటర్నల్ ఆడిట్ కోసం బ్యాంకర్లు, రిటైర్డు అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ కనక రత్నం, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీపీఓ సురేశ్ బాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: