Skip to main content

ఓ కోతిని కొట్టి చంపి, మరో కోతిని ఉరేసి.. వైరల్ వీడియో


 


ప్రకృతి మీదనే ఆధారపడి బతుకుతున్న మనిషి.. ఆ ప్రకృతి వైవిధ్యాన్ని మాత్రం కాపాడటం లేదు. పైగా మూగజీవాల పాలిట రాక్షసుడిగా మారుతున్నాడు. కరోనా వంటి మహమ్మారి మానవాళిని శాసిస్తున్నా కూడా ఇతర ప్రాణుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. మానవత్వం మరచి అడవి జంతువుల  కన్నా హీనంగా వ్యవహరిస్తున్నాడు. 


ఖమ్మం జిల్లా జిల్లా వేంసూర్ మండలంలో మానవ సమాజం అసహ్యించుకునేలా ఓ కోతిని ఉరేసి చంపారు కొందరు ప్రబుద్ధులు. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యం చక్కర్లు కొడుతున్నా కూడా సంబందిత అటవీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.పైగా ఇదేంటని ప్రశ్నించినవారికి దురుసుగా సమాధానం ఇస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


సాధు వెంకటేశ్వరావు, పాస్టర్ జోసెఫ్ రాజ్ ఇళ్ళ సమీపంలో ఓ నీటి తొట్టిలో వానరం పడిపోయి కొట్టుమిట్టాడుతోంది. మానవతా దృక్పథంతో కోతిని కాపాడాల్సిన వారిద్దరూ వానారాన్ని కర్రలతో కొట్టి చంపి బయట పడేశారు. చనిపోయిన వానరం వద్దకు మరికొన్ని కోతులు రావటంతో జోసెఫ్ రాజ్, వేంకటేశ్వరావు మరో కోతిని పట్టుకుని సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసి కుక్కలతో కరిపిస్తు హతమార్చారు.అటుగా వెళ్తున్న కొందరు ఇదేంటని ప్రశ్నించినా.. వినకుండా దురుసుగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 



ఈ ఘటనపై కొందరు ఫారెస్ట్ ఉన్నతాధికారికి ఫోన్ లో సమాచారం ఇచ్చినా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. అతి క్రూరంగా రెండు కోతులకు చంపిన వ్యక్తులపై అటవీ జంతువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలే కరోనా కాలంలో ఆహారం కోసం బయటికి వస్తున్న మూగజీవాల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరి కాదని, కుదిరితే ఆహారం అందించాలే తప్ప ఈ విధంగా కర్కశంగా ప్రవర్తించకూడదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కేరళలో ఓ ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన ఘటన వెలుగుచూసింది. ఇది అంతకన్నా దారుణమని పలువురు ఆవేదన చెందుతున్నారు. 


ఇక కోతులను చంపిన  ప్రబుద్ధులు ఏమంటున్నారో వినండి.



 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత