Skip to main content

బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో



ప్రాణం విడుస్తూ ఓ యువకుడు తీసిన వీడియో తెలుగు మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న యువకుడికి అకస్మాత్తుగా వెంటిలేటర్ తీసేశారని స్వయంగా బాధితుడే సెల్ఫీ వీడియో తీసుకొని తండ్రిని ఉద్దేశించి చివరిమాటలు మాట్లాడటం రాష్ట్రంలో కరోనా భయంకర రూపం దాలుస్తున్న విషయాన్ని కళ్లకు కట్టింది.



డాడీ.. నాకు ఊపిరాడ్తలేదు డాడీ.. వద్దనంగా వెంటిలేటర్ తీసిండ్రు. మూడు గంటలైతంది డాడీ.. నా గుండె ఆగిపోయింది. కిడ్నీ ఫెయిలైంది. ఊపిరొక్కటే ఆడ్తంది.. ఇప్పుడు అది గూడ అయిపోయింది డాడీ.. బాయ్ డాడీ.. బాయ్. ఇవీ ఆ యువకుడి చివరి మాటలు. 


కరోనా ఉధృతిని, దాని వ్యాప్తిని అత్యంత ముందుచూపున్న నేతలుగా పేరున్నవారు కూడా అంచనా వేయలేకపోయారు అనడానికి ఇది మరో నిదర్శనం. మొన్న 28 ఏళ్ల యువ జర్నలిస్టు మనోజ్ గాంధీలో చికిత్స సరిగా అందక చనిపోవడం మరుపునకు రాకముందే మరో నవయువకుడు కరోనా కోరలకు చూస్తూ చూస్తూ బలైపోవడం ప్రజలకు జీర్ణం కాని విషయం. కరోనా అనేది తెలంగాణకు రమ్మన్నా రాదు.. నీ దండం బెడ్తా రావే అంటె గూడ రాదు.. అన్న మాటల్ని ఓసారి మననం చేసుకుంటే మన నేతలు కరోనా విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికీ ఇది వర్తిస్తుంది. కనీసం ఇప్పుడైనా మన నేతలు కళ్లు తెరుస్తారా.. మెరుగైన నిర్ణయం తీసుకుంటారా.. ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇదే.


ఆలస్యంగా పాజిటివ్ అని తేలడంతో ఆందోళనలో బంధువులు


మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని బి.జే.ఆర్ నగర్ కు చెందిన ఆ యువకుడు మృతి చెందే కొన్ని నిమిషాల ముందు తన ఫోన్ లో తీసుకున్న వీడియో విపరీతమైన వైరల్ అవుతోంది. ఈ దయనీయ పరిస్థితి ఒక ఎత్తైతే మరో పెను ప్రమాదం జవహర్ నగర్ కు పొంచి వుంది. కరోనా లక్షణాలతో చికిత్స తీసుకుంటున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున మరణించిన ఆ యువకుడి మృత దేహాన్ని టెస్టు రిపోర్టులు రాకముందే హుటాహుటిన కుటుంబ సభ్యులకు అప్పజెప్పి చేతులు దులుపుకుంది ఆసుపత్రి యాజమాన్యం.


What KCR Says: మూడు, నాలుగు రోజుల్లో కరోనా వ్యూహం ఖరారు-కేసీఆర్


What Revanth Asks: రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి


దీనిపై సరైన అవగాహన లేని కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో సుమారు 30 మంది పాల్గొన్నారు. అంత్రక్రియలు జరిగిన మరసటి రోజు శనివారం ఉదయం కరోనా పాజిటివ్ అని తెలడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అసలు విషయం తెలియకపోవడం వల్ల అమాయకంగా అంత్యక్రియల్లో పాల్గొన్నవారి విషయంలో జవహర్ నగర్ అధికారులు వెంటనే స్పందించి వారిని క్వారంటైన్ చేసి కరోనా పరీక్షలు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకోవైపు కరోనా సోకిన విషయం తెలియక కుటుంబ సభ్యులు,మృతుడు గత కొన్ని రోజులుగా అనేక మందిని కలిసుంటారు కాబట్టి బి.జే.ఆర్ నగర్ ను కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటిమచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత