Skip to main content

తెలంగాణలో మరాఠీ సినిమా - ఓ శుభారంభం


మూస కథలు, పసలేని కథనాలు, మూడు పాటలు, ఆరు ఫైట్లు అనే ట్రెండు నుంచి తెలుగు ఇండస్ట్రీ కాస్త దారి మళ్లినట్టు కనిపిస్తున్నా.. నూతన పోకడలు, లో-బడ్జెట్ లోనే సృజనాత్మకమైన ప్రయోగాలు అనే కేటగిరీస్ లో మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి. తిమింగలాల వంటి బడాబాబులు ఏలుతున్న తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలతో కూడిన లో-బడ్జెట్ సినిమాలకు ఇంకా సమయం రాలేదన్న నిరాశ అంతటా ఆవరించిన ఉన్న సమయంలో నూతన తరానికి మలయసమీరం లాంటి ఓ శుభవార్త వినిపిస్తోంది. 


తొలితరం తెలంగాణ పోరాటయోధుడు కేశవరావు జాదవ్ మనవడు అయిన సత్యనారాయణరావు జాదవ్ రచయితగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తెలంగాణ గడ్డ మీద మరాఠీ సినిమా పూర్తి చేశారు. పతీమజాకరామతీ (నా మొగుడు చిలిపికృష్ణుడు అని  తెలుగులో సమానార్థం) విడుదలకు సిద్ధమైన క్రమంలోనే లాక్ డౌన్ రావడం వేరే విషయం. అయితే 2, 3 నెలల్లో లాక్ డౌన్ ఎత్తేసి సినిమా హాల్స్ తెరిస్తే దీపావళి కానుకగా పతీమజాకరామతితో పాటు శెగావచరాజా అనే మరో సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు సత్యనారాయణరావు జాదవ్ చెప్పారు. ఒకవేళ లాక్ డౌన్ తెరవడం కుదరకపోతే ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్లాట్  ఫామ్ లో ఉన్న దాదాపు 160 చానల్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జాదవ్ ఎంతో ధీమాగా చెప్పడం విశేషం. తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు, మరాఠీ నటులతో రూపొందించిన మొదటి సినిమా ఇదే అవుతుందని అందువల్ల మరాఠీ ఇండస్ట్రీ నుంచి తనకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని జాదవ్ చెప్పారు. అయితే తమ వంశీకులు ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ లోని మరాఠీ ప్రాంతంవారని అందువల్ల తాతలు, తండ్రులు, కుటుంబ సభ్యులంతా మరాఠీ సంస్కృతిని పాటిస్తారని, తన మాతృభూమి హైదరాబాద్ అవడం వల్ల ఉర్దూ బాగా ఒంటపట్టిందని జాదవ్ చెబుతారు. తాత కేశవరావు జాదవ్ కు తెలంగాణ ఉద్యమంతో విడదీయలేని అనుబంధం ఉందని, తనకు సినిమాల మీద ఉన్న శ్రద్ధ కారణంగా తాను ఈ ఫీల్డ్ ఎంచుకున్నానని జాదవ్ చెబుతారు. 



మరాఠీ సినిమాలో బోనాల పాట


పతీమజాకరామతి సినిమాలో మానవవిలువలు, కుటుంబ విలువలు, సమాజ విలువల గురించి చెప్పామని.. విలువలు అనగానే బోరింగ్ సబ్జెక్టు అనే అభిప్రాయానికి కొందరు త్వరగా వస్తారని.. కానీ తాము మంచి ట్రీట్ మెంట్ తో, కామెడీ టచ్ ఇచ్చి యువతరాన్ని  దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. కుటుంబంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో కాలేజీల్లో గురుశిష్యుల మధ్య కూడా అలాంటి రిలేషన్సే  ఉండాలని చూపించడానికి ఈ సినిమాలో ప్రయత్నించామన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల్లాగా విద్యా నిలయాల్లో గురశిష్యులు ఉంటారని, అందువల్ల విద్యార్థులంతా అక్క-చెల్లెళ్లు, అన్నదమ్ములు, సోదరీసోదరులే అవుతారు తప్ప మరే రకమైన రిలేషన్స్ కు తావు లేదన్న మెస్సేజ్ ఇచ్చామని, ఇది ప్రస్తుత సమాజానికి  చాలా అవసరమైన సబ్జెక్టు అని జాదవ్ అన్నారు. అయితే క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేయడం కోసం ర్యాగింగ్ భూతాన్ని కూడా చూపించామని, దాన్ని నివారించేందుకు ఎలాంటి ఫైట్స్ లేకుండా కేవలం ఒక్కచెంపదెబ్బతోనే విలన్స్ మారిపోయే సీన్ ను అతి రమ్యంగా, సృజనాత్మకంగా తెరకెక్కించామన్నారు. అలాగే ఇందులో 5 పాటలు పెట్టామని, అందులో 2 పాటలు లవ్ సాంగ్స్ అని, బోనాల జాతర నేపథ్యంలో సాగే ఓ ఫోక్ సాంగ్ కూడా పెట్టామని, ఆ విధంగా మరాఠీ సినిమాలో తెలంగాణ బోనాల ప్రాశస్త్యాన్ని చూపించి రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక పరిపుష్టికి పెద్దపీట వేశామన్నారు. ఆ పాటను వరంగల్ లో చిత్రీకరించినట్లు చెప్పారు.అలాగే ఈ సినిమా చూస్తే ప్రేమోన్మాదం గానీ, లవ్ పేరుతో నేరాలు గానీ తగ్గే అవకాశం ఉంటుందని, ప్రేమజంటలు నేరస్తులుగా మారకుండా ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రేమించడం నేరం కాకపోయినా.. పెద్దల్ని ఒప్పించుకొని తమ లవ్ ని అరేంజ్డ్ మ్యారేజ్ గా చేసుకోవాలని సూచించామన్నారు. దీనివల్ల ఎవరూ పారిపోయే అవకాశం ఉండదని, ఆత్మహత్యలకు ఆగిపోతాయని, యువతరం ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయన్నారు. 


 


విడుదలకు ముందే అవార్డులు


పతీమజాకరామతి సినిమా విడుదలకు ముందే మంచి రెస్పాన్స్ సంపాదించిందని జాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి తొలి మరాఠీ మూవీ తమ బ్యానర్ మీద రావడంతో మరాఠీ ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రోత్సాహం లభించిందన్నారు. కథకు, కథనానికి, రెండు రాష్ట్రాల మధ్య భావ వారధిగా నిలిచినందుకు, రేపటిరోజుల్లో ఔత్సాహికులు ఎక్కడినుంచైనా సినిమా తీసుకునేలాగా ఆదర్శంగా నిలిచినందుకు అఖిల భారత చిత్రపట్ మహా మండల్ వారు కళాసమృద్ధి అవార్డుతో సత్కరించారన్నారు. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఈ సినిమా స్క్రిప్టును పంపిస్తే జ్యూరీ సభ్యులు దీనికి 37 నేషనల్ అవార్డ్స్ అందజేశారన్నారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్, కొల్హాపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక ఫెస్టివల్స్ కు ఈ స్క్రిప్టును పంపి పోటీలో పెట్టామని, అలా విడుదలకు ముందే అవార్డులు వరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  


ఈ సినిమాకు తనకు బెస్ట్ డైరెక్టర్ గా, తనతో పాటు సిద్ధేశ్వర్ పవార్ కు కలిపి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా అవార్డు వరించిందన్నారు. అలాగే ఈ సినిమాకు బెస్ట్ మూవీ అవార్డు, సామాజిక హితకరమైన థీమ్ ఎంచుకున్నందుకు తనకు ప్రత్యేకంగా బెస్ట్ థింకర్ అవార్డు వచ్చిందన్నారు. 


వరంగల్ లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటో


విడుదలకు ముందే బుక్కయిన 16 వేల టికెట్లు


సినిమాలో భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేసి గురుశిష్యుల సంబంధం అనే ఇతివృత్తం ద్వారా గొప్ప విలువలను ప్రోత్సహించినందుకు భవసార్ క్షత్రియ సమాజ్ వారు 16 వేల టికెట్లు ముందుగానే బుక్ చేసి ప్రోత్సహించారని ఆనందం వ్యక్తం చేశారు. వారి ప్రోత్సాహం తనను ఎంతో వెన్ను తట్టిందని, ఇంకా ఇలాంటి సినిమాలను తెలంగాణ, ఆంధ్రాల్లో తీసుకువచ్చి ఒక కొత్త ఒరవడిని పరిచయం చేయాలని ఉందని జాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అటు తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు కూడా తమ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. టెంపర్, బలుపు వంటి హిట్ పిక్చర్స్ కి గాత్రదానం చేసిన వినాయక్ సతీశ్... ఈ సినిమాలో కూడా పాటలు పాడారన్నారు జాదవ్. 


 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?