Skip to main content

తెలంగాణలో మరాఠీ సినిమా - ఓ శుభారంభం


మూస కథలు, పసలేని కథనాలు, మూడు పాటలు, ఆరు ఫైట్లు అనే ట్రెండు నుంచి తెలుగు ఇండస్ట్రీ కాస్త దారి మళ్లినట్టు కనిపిస్తున్నా.. నూతన పోకడలు, లో-బడ్జెట్ లోనే సృజనాత్మకమైన ప్రయోగాలు అనే కేటగిరీస్ లో మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి. తిమింగలాల వంటి బడాబాబులు ఏలుతున్న తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలతో కూడిన లో-బడ్జెట్ సినిమాలకు ఇంకా సమయం రాలేదన్న నిరాశ అంతటా ఆవరించిన ఉన్న సమయంలో నూతన తరానికి మలయసమీరం లాంటి ఓ శుభవార్త వినిపిస్తోంది. 


తొలితరం తెలంగాణ పోరాటయోధుడు కేశవరావు జాదవ్ మనవడు అయిన సత్యనారాయణరావు జాదవ్ రచయితగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తెలంగాణ గడ్డ మీద మరాఠీ సినిమా పూర్తి చేశారు. పతీమజాకరామతీ (నా మొగుడు చిలిపికృష్ణుడు అని  తెలుగులో సమానార్థం) విడుదలకు సిద్ధమైన క్రమంలోనే లాక్ డౌన్ రావడం వేరే విషయం. అయితే 2, 3 నెలల్లో లాక్ డౌన్ ఎత్తేసి సినిమా హాల్స్ తెరిస్తే దీపావళి కానుకగా పతీమజాకరామతితో పాటు శెగావచరాజా అనే మరో సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు సత్యనారాయణరావు జాదవ్ చెప్పారు. ఒకవేళ లాక్ డౌన్ తెరవడం కుదరకపోతే ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్లాట్  ఫామ్ లో ఉన్న దాదాపు 160 చానల్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జాదవ్ ఎంతో ధీమాగా చెప్పడం విశేషం. తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు, మరాఠీ నటులతో రూపొందించిన మొదటి సినిమా ఇదే అవుతుందని అందువల్ల మరాఠీ ఇండస్ట్రీ నుంచి తనకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని జాదవ్ చెప్పారు. అయితే తమ వంశీకులు ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ లోని మరాఠీ ప్రాంతంవారని అందువల్ల తాతలు, తండ్రులు, కుటుంబ సభ్యులంతా మరాఠీ సంస్కృతిని పాటిస్తారని, తన మాతృభూమి హైదరాబాద్ అవడం వల్ల ఉర్దూ బాగా ఒంటపట్టిందని జాదవ్ చెబుతారు. తాత కేశవరావు జాదవ్ కు తెలంగాణ ఉద్యమంతో విడదీయలేని అనుబంధం ఉందని, తనకు సినిమాల మీద ఉన్న శ్రద్ధ కారణంగా తాను ఈ ఫీల్డ్ ఎంచుకున్నానని జాదవ్ చెబుతారు. 



మరాఠీ సినిమాలో బోనాల పాట


పతీమజాకరామతి సినిమాలో మానవవిలువలు, కుటుంబ విలువలు, సమాజ విలువల గురించి చెప్పామని.. విలువలు అనగానే బోరింగ్ సబ్జెక్టు అనే అభిప్రాయానికి కొందరు త్వరగా వస్తారని.. కానీ తాము మంచి ట్రీట్ మెంట్ తో, కామెడీ టచ్ ఇచ్చి యువతరాన్ని  దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. కుటుంబంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో కాలేజీల్లో గురుశిష్యుల మధ్య కూడా అలాంటి రిలేషన్సే  ఉండాలని చూపించడానికి ఈ సినిమాలో ప్రయత్నించామన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల్లాగా విద్యా నిలయాల్లో గురశిష్యులు ఉంటారని, అందువల్ల విద్యార్థులంతా అక్క-చెల్లెళ్లు, అన్నదమ్ములు, సోదరీసోదరులే అవుతారు తప్ప మరే రకమైన రిలేషన్స్ కు తావు లేదన్న మెస్సేజ్ ఇచ్చామని, ఇది ప్రస్తుత సమాజానికి  చాలా అవసరమైన సబ్జెక్టు అని జాదవ్ అన్నారు. అయితే క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేయడం కోసం ర్యాగింగ్ భూతాన్ని కూడా చూపించామని, దాన్ని నివారించేందుకు ఎలాంటి ఫైట్స్ లేకుండా కేవలం ఒక్కచెంపదెబ్బతోనే విలన్స్ మారిపోయే సీన్ ను అతి రమ్యంగా, సృజనాత్మకంగా తెరకెక్కించామన్నారు. అలాగే ఇందులో 5 పాటలు పెట్టామని, అందులో 2 పాటలు లవ్ సాంగ్స్ అని, బోనాల జాతర నేపథ్యంలో సాగే ఓ ఫోక్ సాంగ్ కూడా పెట్టామని, ఆ విధంగా మరాఠీ సినిమాలో తెలంగాణ బోనాల ప్రాశస్త్యాన్ని చూపించి రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక పరిపుష్టికి పెద్దపీట వేశామన్నారు. ఆ పాటను వరంగల్ లో చిత్రీకరించినట్లు చెప్పారు.అలాగే ఈ సినిమా చూస్తే ప్రేమోన్మాదం గానీ, లవ్ పేరుతో నేరాలు గానీ తగ్గే అవకాశం ఉంటుందని, ప్రేమజంటలు నేరస్తులుగా మారకుండా ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రేమించడం నేరం కాకపోయినా.. పెద్దల్ని ఒప్పించుకొని తమ లవ్ ని అరేంజ్డ్ మ్యారేజ్ గా చేసుకోవాలని సూచించామన్నారు. దీనివల్ల ఎవరూ పారిపోయే అవకాశం ఉండదని, ఆత్మహత్యలకు ఆగిపోతాయని, యువతరం ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయన్నారు. 


 


విడుదలకు ముందే అవార్డులు


పతీమజాకరామతి సినిమా విడుదలకు ముందే మంచి రెస్పాన్స్ సంపాదించిందని జాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి తొలి మరాఠీ మూవీ తమ బ్యానర్ మీద రావడంతో మరాఠీ ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రోత్సాహం లభించిందన్నారు. కథకు, కథనానికి, రెండు రాష్ట్రాల మధ్య భావ వారధిగా నిలిచినందుకు, రేపటిరోజుల్లో ఔత్సాహికులు ఎక్కడినుంచైనా సినిమా తీసుకునేలాగా ఆదర్శంగా నిలిచినందుకు అఖిల భారత చిత్రపట్ మహా మండల్ వారు కళాసమృద్ధి అవార్డుతో సత్కరించారన్నారు. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఈ సినిమా స్క్రిప్టును పంపిస్తే జ్యూరీ సభ్యులు దీనికి 37 నేషనల్ అవార్డ్స్ అందజేశారన్నారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్, కొల్హాపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక ఫెస్టివల్స్ కు ఈ స్క్రిప్టును పంపి పోటీలో పెట్టామని, అలా విడుదలకు ముందే అవార్డులు వరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  


ఈ సినిమాకు తనకు బెస్ట్ డైరెక్టర్ గా, తనతో పాటు సిద్ధేశ్వర్ పవార్ కు కలిపి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా అవార్డు వరించిందన్నారు. అలాగే ఈ సినిమాకు బెస్ట్ మూవీ అవార్డు, సామాజిక హితకరమైన థీమ్ ఎంచుకున్నందుకు తనకు ప్రత్యేకంగా బెస్ట్ థింకర్ అవార్డు వచ్చిందన్నారు. 


వరంగల్ లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటో


విడుదలకు ముందే బుక్కయిన 16 వేల టికెట్లు


సినిమాలో భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేసి గురుశిష్యుల సంబంధం అనే ఇతివృత్తం ద్వారా గొప్ప విలువలను ప్రోత్సహించినందుకు భవసార్ క్షత్రియ సమాజ్ వారు 16 వేల టికెట్లు ముందుగానే బుక్ చేసి ప్రోత్సహించారని ఆనందం వ్యక్తం చేశారు. వారి ప్రోత్సాహం తనను ఎంతో వెన్ను తట్టిందని, ఇంకా ఇలాంటి సినిమాలను తెలంగాణ, ఆంధ్రాల్లో తీసుకువచ్చి ఒక కొత్త ఒరవడిని పరిచయం చేయాలని ఉందని జాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అటు తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు కూడా తమ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. టెంపర్, బలుపు వంటి హిట్ పిక్చర్స్ కి గాత్రదానం చేసిన వినాయక్ సతీశ్... ఈ సినిమాలో కూడా పాటలు పాడారన్నారు జాదవ్. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత