Skip to main content

కైలాసనాథుడి చెంతకు ఇకపై రోడ్డు మీదుగా..


హిమాలయాల్లోని మానసరోవరానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన ముందడుగు వేసింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ వద్ద లింక్ రోడ్డు వేయడంతో కైలాస మానసరోవరానికి మరింత సులభంగా వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది. ఈ చర్యతో టూరిస్టులకు ఢిల్లీ నుంచి మానసరోవారం అత్యంత సమీపానికి నేరుగా బస్సులోనే వెళ్లే అవకాశం ఏర్పడింది. ప్రతి సంవత్సరం మానసరోవరానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుమతిస్తారు. ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ లింక్ రోడ్డు ద్వారా టిబెట్ భూభాగంలో ఉన్న మానసరోవరాన్ని నేరుగా సందర్శించవచ్చు. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో హిందువులు పోటీపడుతుంటారు. 



రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పూర్తయిన ఈ రోడ్డు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. లిపులేఖ్ పాస్ నుంచి మానసరోవరం 90 కి.మీ. దూరంలో ఉంటుంది. రోడ్డుమార్గం ప్రారంభంలో రాజ్ నాథ్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మానసరోవరానికి మొదటి జట్టు భక్తుల యాత్రకు రాజ్ నాథ్ జెండా ఊపారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఈ రోడ్డును పూర్తి చేసింది. ఈ పని చేసినందుకు రాజ్ నాథ్ బీఆర్వోను అభినందించారు. 



లిపులేఖ్ పై వివాదం


భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ ద్వారం గుండా టిబెట్ లోకి, చైనాలోకి ప్రవేశించవచ్చు. అయితే లిపులేఖ్ పాస్ నేపాల్ అధీనంలో ఉంది. నేపాల్ ప్రభుత్వానికి అధికారిక సమాచారం లేకుండానే భారత్ ఈ రోడ్డు మార్గం నిర్మించిందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఢిల్లీలోని నేపాల్ ఎంబసీలో గల ఉన్నతాధికారుల ద్వారా నేపాల్ ప్రభుత్వానికి సమాచారం ఉందని, దీనిపై చాలా ఏళ్లుగా చర్చలు నడుస్తున్నాయని భారత్ పేర్కొంది. లిపులేఖ్ నుంచి రోడ్డు మార్గం నిర్మాణానికి 1997లోనే ద్వైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఆ తరువాత 2015లో కూడా ప్రధాని మోడీ హయాంలో ఈ చర్చలు జరిగాయని.. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియ పూర్తయిందని భారత విదేశీ వ్యవహారా నిపుణులు చెబుతున్నారు. అయితే తమకు ఢిల్లీలోని నేపాల్ ఎంబసీ ద్వారా సమాచారం ఉన్నప్పటికీ.. రోడ్డు నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియదని, ఆ నోట్ వచ్చాక అధికారికంగా స్పందిస్తామని నేపాల్ చెబుతోంది. 


 


Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత