Skip to main content

వీళ్లను ఆదుకోవాల్సింది కేసీఆరే-కె.సి.కాళప్ప


కరోనా దెబ్బకు దాదాపు 2 నెలలుగా ఉపాధి కోల్పోయి, కూలీ పని కూడా దొరక్క పేదల కుటుంబాలన్నీ అల్లకల్లోలంగా మారుతున్న క్రమంలో అత్యంత వెనుకబడ్డ వర్గాలను ఆపద్బాంధవుడైన ముఖ్యమంత్రి కేసీఆరే ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.సి.కాళప్ప విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో రెక్కాడినప్పుడే పూర్తిగా డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఎంబీసీలు.. కరోనా దెబ్బకు కనీసం ఆకలి కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటివారి కోసం ప్రత్యేకంగా ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉందని కాళప్ప అభిప్రాయపడ్డారు.


కుప్పకూలిన చేతివృత్తులు


చేతివృత్తులు, మానవసేవలు అందించే బడుగులు, నిరుపేదలంతా మోస్ట్ బ్యాక్ వార్డ్ కులాల్లోనే ఉన్నారని.. వారిని కాపాడుకోవడం యావత్ సమాజ కర్తవ్యమన్న ఆయన.. అలాంటివారిని కాపాడుకోకపోతే వారి సేవలమీదనే ఆధారపడ్డ అనేక కుటుంబాల పరిస్థితి సంకటంలో పడుతుందన్నారు. హైదరాబాద్ లో నిర్మాణరంగానికి అవసరమైన కూలీలుగానీ, హమాలీలు గానీ, పరిశ్రమల్లో పనిచేసే వర్కర్లు గానీ, అడ్డా మీది లేబర్లు గానీ, ఆఫీసులు-కార్యాలయాలకు వెళ్లే ఉన్నత కుటుంబాల ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, ఆయాలు, అనాథాశ్రమాల్లో సేవలందించేవారు.. ఇలా కీలకమైన శ్రామిక, సేవారంగాన్ని నడిపిస్తున్నవారంతా కింది కులాలవారేనని, ఈ కష్టకాలంలో ఆదుకోకపోతే ముందుముందు యావత్ సమాజం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అందుకే రేపటి సమాజం సురక్షితంగా ఉండాలంటే వారికి తక్షణమే ఆపన్నహస్తం అందించాలని తెలంగాణ సర్కారుకు ఆయన విన్నవించారు. 


ఉపాధి కోల్పోయి దెబ్బతిన్న కులాలు ఇవే




షాపులు, మడిగెలు మూతపడడంతో నాయీబ్రాహ్మణులు బజారునపడ్డారు. మంగళి షాపు యజమానులే కాక షాపుల్లో పనిచేసే రోజువారీ కూలీలకు పూట గడవడం కష్టంగా మారింది. అలాగే వాషింగ్ మెషీన్ల రాకతో ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న రజక వృత్తిలో.. ఆ మహిళలు పట్నంలోని పలువురి ఇళ్లలో పనివారుగా కుదురుకున్నారు. ఇప్పుడా పని కూడా లేక ఆయా కుటుంబాలన్నీ పస్తులతో పడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అలాగే చేపలు, రొయ్యలు అమ్ముకొని వాటిమీదనే జీవించే గంగపుత్రులు.. మార్కెట్లన్నీ మూతపడడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయారు. వేర్వేరు ఇళ్లలో పనివాళ్లుగా కుదురుకున్న కొందరు మహిళలకు కూడా ఉపాధి లేకుండాపోయింది. అలాగే తెలంగాణలో చెప్పుకోదగ్గ పెద్దసంఖ్యలో ఉన్న విశ్వబ్రాహ్మణులు అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారని కాళప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చేతివృత్తులు చతికిలపడ్డ క్రమంలో రెడీమేడ్ పనుల కోసం పట్నాలకు వలస పోయిన వేలాది మంది విశ్వబ్రాహ్మలు.. ఇప్పుడు వారి చేతుల్లోనే పనిముట్లకు పనిలేక, అర్ధాకలితో అలమటిస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులకు చికిత్స చేయించుకునే స్తోమత లేక అనారోగ్యాలతో కునారిల్లుతున్నారు. అలాగే పట్టెడన్నం కోసం సంస్కృతిని ప్రదర్శిస్తూ రోజంతా బిచ్చమెత్తుతూ సంచరించే దాసరి, దొమ్మర, కాటిపాపల, మొండిబండ, పిచ్చుగుంట్ల వారేకాక... పాములోళ్లు, వీరముష్టి, బోయ, వడ్డెర వంటి చేతికష్టాన్నే నమ్ముకున్న అనేక వేలాది మంది బడుగులు రోడ్డునపడ్డారని, వారికోసం ప్రత్యేకంగా ఆలోచించకపోతే ఆ వర్గాలు ఉనికిలో లేకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి తక్షణావసరాల కోసం కుటుంబానికి రూ. 5 వేల చొప్పున జమ చేయాలని కేసీఆర్ ను కోరారు. 


ఆనాటి సుదీర్ఘ చర్చాంశాలను అమలు చేయండి



తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో 2017లో అత్యంత వెనుకబడిన కులాల నాయకులతో దాదాపు 7 గంటలపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారని, సమాజంలో గుర్తింపుకు నోచుకోని లక్షలాది మంది కోసం సుదీర్ఘంగా చర్చించడం దేశ చరిత్రలోనే తొలిసారి అని.. ఆ క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుందని గుర్తు  చేశారు. అలా ఎంబీసీల కోసం ప్రత్యేకంగా ఆలోచించి, ఎంబీసీ నాయకత్వం నుంచి సూచనలు, సలహాలు కోరిన కేసీఆర్.. ఇప్పుడు తలెత్తిన కరోనా సంక్షోభాన్ని అధిగించేందుకు అద్భుతమైన రీతిలో ప్రణాళికలు అమలు చేస్తున్నారని... తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అద్భుతంగా కరోనాను ఎదుర్కొంటోందని ప్రశంసించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కారు… తక్షణమే నోరు లేని బడుగుల పక్షాన ఆలోచించి, వారి కోసం తక్షణావసరంగా నిధులు విడుదల చేయాలని కోరారు. కరోనా కష్టకాలంలో ఏ చిన్న సాయం ప్రభుత్వం వైపు నుంచి అందినా.. లక్షలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయని.. వారంతా కేసీఆర్ ను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత