Skip to main content

కరోనాకు బ్రేకులో కేరళ సక్సెస్.. కారణం ఇదే


ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింటు. నిజమే కేరళ సర్కారు కరోనాకు బుల్లెట్ దించినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ పాజిటివ్ కేస్ కేరళలోనే నమోదైనా... కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అందరిచేతా శెభాష్ అనిపించుకుంటోంది. సీఎం అంటే అతనేరా బుజ్జీ అనిపించుకుంటున్నాడు పినరాయ్ విజయన్. ఏప్రిల్ ఫస్టున 123 కొత్త కేసులు నమోదవగా అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల్ని గుర్తించి హాస్పిటల్లో చేర్పించినవారి సంఖ్య 622. అదే సంఖ్యను ఏప్రిల్ 17వ తేదీన పరిశీలిస్తే.. 17న నమోదైన కొత్త కేసులు 84 ఉంటే.. పాజిటివ్ అనుమానిత లక్షణాలుండి హాస్పిటల్ కు తరలించినవారి సంఖ్య 526 గా నమోదైంది. అంటే ఈ పక్షం రోజుల్లో కొత్త అనుమానిత కేసుల సంఖ్యను దాదాపుగా వందకు తగ్గించి, పాజిటివ్ గా గుర్తించినవారిని దాదాపు 40 తగ్గించారు. ఇదే చిత్తశుద్ధి ఇంకా ప్రదర్శిస్తే కొత్త పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు అనుమానించి హాస్పిటల్లో చేర్చేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందంటున్నారు. 


ఇక హోమ్ ఐసోలేషన్ లో పెట్టి... నిరంతర పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య ఏప్రిల్ ఫస్టు నాటికి లక్షా 63 వేల 508 ఉంటే... అదే సంఖ్యను 17వ తేదీనాటికి 78,454 కు తగ్గించగలిగారు. ఇక్కడే కేరళ సర్కారు చిత్తశుద్ధి, ప్రభుత్వ యంత్రాంగం అంకితభావాన్ని అర్థం చేసుకోవచ్చు. 


అసలు సంగతి ఇదీ..


హోమ్ ఐసొలేషన్లో ఉండేవారి సంఖ్య తగ్గడం, రోజురోజుకూ కొత్తకేసుల నమోదు తగ్గడం అనేది ఎలా సాధ్యమైంది? చాలా సింపుల్. అక్కడ ప్రజల ఇళ్లకే వంటసరుకులు చేరిపోతున్నాయి. రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేనివారికి కూడా ఉప్పు నుంచి మొదలుకొని మసాలా ప్యాకెట్ల వరకు అన్నీ చేరిపోతున్నాయి. దీంతో వారు ఇళ్లు విడిచి బయటికి రావడం లేదు. ఇక్కడే వారి సక్సెస్ అంతా ఉందని కేరళలో ఉంటున్నవారు, బయట ఉంటున్న వారి బంధువులు, ఇతరులు ఘనంగా చెప్పుకోవడానికి ఇదే కారణం. రేషన్ కార్డు ఉన్నవారికి 35 కిలోల బియ్యం, ధనవంతులకు 15 కిలోల బియ్యం అందుతున్నాయని అక్కడివారే చెప్తున్నారు. ఇవన్నీ ఉచితంగానే అందుతున్నాయని కూడా చెప్తున్నారు. 




ఇలా చేస్తే లాక్ డౌన్ సక్సెస్ కాకుండా చస్తుందా? దీన్ని వదిలేసి మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు... ఎన్ని ప్రకటనలు చేస్తే ఏం లాభం? ఆకలయ్యేవాడికి ఆరోగ్య సూత్రాలు ఏం రుచిస్తాయి? ఉడికిందో, ఉడికీ ఉడకందో కాస్త నోటికందితేనే కదా ఇంట్లో ఉండేది. మరి ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, తెలంగాణ నుంచి, కర్నాటక నుంచి వలస కూలీలు వెళ్తున్నారంటే వెళ్లరా? కనీసం ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలు ఈ సూత్రాన్ని అవలంబిస్తే మంచిది. 


Also Read: 2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే మనుగడ - హార్వర్డ్ యూనివర్సిటీ


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత