ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు జగిత్యాల జిల్లా నుంచి పలువురు హిందూ యువకులు సైతం వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ముస్లిం యూత్ ను కోఆర్డినేట్ చేసిన యువకుడే హిందూ యువకులను కూడా ఫ్రెండ్ షిప్ టూర్ లాగా మోటివేట్ చేసి తీసుకెళ్లాడని తెలుస్తోంది.
Photo: Business Line
ఇప్పటికీ హైడింగ్ లోనే మర్కజ్ మహానుభావులు?
ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ నుంచి తిరిగొచ్చిన పలువురు ఇప్పటికీ ట్రేస్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. మరి వారంతా ఎక్కడున్నారు? ఇప్పటికే ఎవరికైనా, ఎంతమందికైనా కరోనా వైరస్ ను అంటించారా? వారున్న ప్రదేశాలు ఎక్కడ? ఈ ప్రశ్నలకు జవాబులు వెదికే పనిలో ఇప్పటికే పోలీసులు ఉన్నారు. కానీ కొందరి ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియకపోవడానికి కారణం వారు అజ్ఞాతంగా ఉండిపోవడమే.
తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో తబ్లిగీలు రహస్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్గిమల్ల, గుల్లకోట, చిల్వకోడూరు, గొల్లపల్లి, చందోలి తదితర గ్రామాల నుంచి పలువురు ముస్లిం యువకులు (10-15 మంది వరకు) ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. వారు వెళ్లొచ్చిన విషయం ఆయా గ్రామాల ప్రజలకు కూడా తెలుసని, సర్పంచ్ లకు సైతం ఆ విషయం తెలుసని, అయితే ఆ విషయాన్ని బయట పెట్టినట్టయితే తమ పేరు ఎక్కడ తబ్లిగీలకు తెలుస్తోందనని భయపడుతున్నట్టు సమాచారం. పట్టణాల్లో పరిస్థితులకు, ఊళ్లల్లో పరిస్థితులకు స్పష్టమైన తేడా ఉండడమే కారణంగా చెబుతున్నారు. గ్రామాల్లో ఏ చిన్న విషయమైనా దాగదు. ఎవరిద్వారా ఎవరికి చేరింది? ఎలా చేరిందన్న విషయం చాలా సింపుల్ గా బయటపడిపోతుంది. తబ్లిగీల సమాచారాన్ని పోలీసులకు ఎవరందించారో తెలియరాదని ఆయా గ్రామాల సర్పంచ్ లు సైతం భయపడుతున్నారంటే.. తబ్లిగీలు ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
తబ్లిగీకి హాజరైన హిందూ యువకులు
ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు జగిత్యాల జిల్లా నుంచి పలువురు హిందూ యువకులు సైతం వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ముస్లిం యూత్ ను కోఆర్డినేట్ చేసిన యువకుడే హిందూ యువకులను కూడా ఫ్రెండ్ షిప్ టూర్ లాగా మోటివేట్ చేసి తీసుకెళ్లాడని తెలుస్తోంది. పైన పేర్కొన్న గ్రామాలకు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన వ్యక్తి ఇద్దరు హిందూ యువకుల్ని సైతం తీసుకెళ్లాడని ఆయా గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. వారు కూడా హైడింగ్ లోనే ఉండడం విశేషం.
ఎంతమందికి అంటించారో?
ఢిల్లీకి వెళ్లొచ్చిన తబ్లిగీలు కరోనా బయటపడకముందు ఎంతమందితో కలిశారు? అలా కలిసినవారు మళ్లీ ఎంతమందిని కలిశారు? వారిలో ఎంతమంది కరోనా బారిన పడ్డారు అనే విషయంపై ఆయా గ్రామాల సర్పంచ్ లు, సామాన్య జనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అటు ఢిల్లీ వెళ్లొచ్చిన హిందూ యువకులు సైతం ఇంటి నుంచి బయటికి రాకుండా ఉంటున్నట్టు తెలుస్తోంది. వారి గురించి పోలీసులకు చెప్పినా, వారి ద్వారా తబ్లిగీల ఆచూకీ తెలుస్తుందని, అలా తమకు భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని సర్పంచ్ లే ఆందోళన చెందుతున్నారు. ఈ లోగా ఒకవేళ వారికి కరోనా సోకితే.. అది ఇంకా ఎంతమందికి సోకి ఉంటుందో.. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఈ గ్రామాల్లో వ్యక్తమవుతోంది. కరుడుగట్టిన ఉగ్రవాది ఆజంఘోరీ జగిత్యాలలోనే ఎన్ కౌంటర్ లో చనిపోవడం గుర్తించాల్సిన అంశం.
Comments
Post a Comment
Your Comments Please: