(Representative photo of Minister Vemula Prashantreddy)
జీతాలు పెరుగుతాయని ఆశపడుతున్న సమయంలో అకస్మాత్తుగా జేబులు కొట్టేసినట్టయింది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. కరోనా ఎడాపెడా ప్రపంచం మొత్తాన్ని కాటేస్తున్న సమయంలో జీతాలు పెరగకపోయినా ఫరవాలేదు.. కనీసం ఉన్న వేతనాలైనా చేతికి రావాలి కదా. అలాగని ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం ఏమని తప్పు పడతాం? కానీ ఒక పరిష్కారం ఉంది. అదేంటో చూడండి.
పిల్లాజెల్లా పెరిగి పెద్దవుతుంటే... ఎదిగిన వాళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న అందరూ సమాయత్తమవుతుంటే... ఈ పిడుగులాంటి వార్తేంట్రా బాబూ అనుకొని గుడ్లు తేలేస్తున్నారు. ఎలాగైనా సరే... సర్కారును కన్విన్స్ చేసి పాత జీతాన్నే కంటిన్యూ చేయాలని కేసీఆర్ కు మొర పెట్టుకుందామని కూడా కొందరు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతకీ కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేస్తుంటే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఎవరడిగారు? అసలు ఎవరూ గ్యారంటీ ఇవ్వలేని కామన్ మ్యాన్ లైఫే డౌట్ ఫుల్ గా మారిపోయిన క్రమంలో ప్రభుత్వ ఉద్యోగల జీతాల ఇష్యూ ఓ పెద్ద ఇష్యూ అవుతుందా? డిసెంబర్ లో చైనాను శివాలెత్తించిన కరోనా.. మార్చినాటికి మన దేశంలో అడుగుపెట్టింది. నిజాముద్దీన్ మర్కజ్ లో తబ్లిగి జమాత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల ద్వారా యావత్ దేశానికి వ్యాపించిందని రూఢిగా తేలింది. ఇప్పుడు దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. దేశమంతా లాక్ డౌన్ విధించిన దేశాల్లో ఇండియానే ఫస్ట్. చైనాలో కూడా ప్రకటించినప్పటికీ కేవలం వుహాన్ వరకే అమలు చేశారు. కానీ భారత్ లో మాత్రం ఊరూరా లాక్ డౌన్ నడుస్తోంది. అంటే ఇండియా మొత్తం ఇంటికే పరిమితమైంది. మొత్తం ప్రొడక్షన్ ఆగిపోయిందన్నమాట. అంటే ప్రజలంతా కూర్చుని తినడమే తప్ప ఎవరూ ఏమీ కొనుగోలు చేయడం లేదు. కనీసం ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసి ఖజానాకు ఎంతోకొంత సాయం చేసే అవకాశం కూడా లేకుండాపోయింది. అటు ఖజానాకు కాసుల గలగల కురిపించే మద్యం దుకాణాలు మూతలు పడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఆగిపోవడంతో ట్రాన్స్ పోర్టేషన్ చతికిలపడింది. ప్రైవేటు కంపెనీలకు తాళంకప్పలు వేళ్లాడుతున్నాయి. ఉద్యోగులంతా గడప దాటడం లేదు. పూటలు ఎలా గడవాలో వారికి దిక్కుతోచడం లేదు. రోజువారీ కూలీలకు పని దొరకడం లేదు. అసలు ప్రైవేటు పనులు చేయించుకునే మనుషులే లేకుండాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలన్నీ క్లోజ్ అయినప్పుడు జీతాల్లో కోత వేయక ఏంచేస్తారు?
ఇప్పటికైతే ప్రభుత్వ ఉద్యోగులకు కోత పడలేదు. మార్చి వేతనాల నుంచి.. అంటే వచ్చే ఏప్రిల్ నుంచి కోతలు పడతాయంటున్నారు. ఆల్రెడీ సింగరేణిలో కోతలు పడిపోయాయి. కార్మికుల వేతనాల్లో 50 శాతం దాకా కోసేసి పే చేస్తారని కన్ఫామ్ అయింది. మరి అధిక వేతనాలు తీసుకుంటున్న అతిపెద్ద సెక్టార్లలో వేతనాలకు కోతలు పడితే.. వారిమీద ఆధారపడే అనేక ఇతర రంగాల ప్రజల పరిస్థితేంటి? అంటే ప్రజల కొనుగోలు శక్తి ఎంతగా పడిపోతుందో దీన్నిబట్టి తెలిసిపోతుంది కదా. అందరూ పని మానేసి ఇంట్లోనే కూర్చుంటే కుటుంబాలు గడిచేదెలా? సమాజం ఎదిగేదెలా? అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్.. వేతనాల్లో కోత పడే అవకాశాలున్నాయని ఒక సంకేతం ఇచ్చేశారు. అది కూడా అమల్లోకి రావడం ఖాయమైపోయింది.
మరిప్పుడేంటి పరిస్థితి? ఏముంది.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత వేసినట్టే... యావత్ పబ్లిక్ కి ఆ ఎఫెక్ట్ పడకుండా చూడాలి. అంటే ఉదాహరణకు.. ఇప్పుడు ప్రజలంతా కేవలం నిత్యావసర వస్తువుల మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నారు కదా... అన్ని రకాల కమర్షియల్స్ ఆగిపోయాయి కదా.. అందువల్ల ఆయా వస్తు సేవల ధరలు కూడా తగ్గించాలి. ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేసే సేవల రేట్లను కూడా ప్రభుత్వ అజమాయిషీలోకి తీసుకురావాలి. ఉదాహరణకు కొన్ని అంశాలవారీగా ఆలోచిస్తే బెటర్ కదా.
1) కిరాణా వర్తకుడు వసూలు చేసే రేట్లు ఒక పరిమితికి మించి వసూలు చేస్తే అందుకు మూల్యం అదే స్థాయిలో చెల్లించుకోవాలి.
2) ఒక బార్బర్ హెయిర్ కట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేస్తే నిబంధనలు వర్తింపజేయాలి.
3) అలాగే సిటీలో ప్రతినెలా 20వ తేదీ దాటితే పవర్ కట్ చేసే విద్యుత్ సిబ్బంది.. మళ్లీ పరిస్థితులు కుదుటపడేదాకా గృహ విద్యుత్ మీటర్ల దిక్కు కన్నెత్తయినా చూడకూడదు.
4) అలాగే ప్రైవేట్ ఆసాములు వసూలు చేసే ఇంటి అద్దెల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తొలిగిపోయేదాకా రెంట్లు అడగరాదని, అది కూడా సగానికి సగం తగ్గించి తీసుకోవాలన్న షరతులు విధించాలి.
5) ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను చాలా తగ్గించి తీసుకునేలా ప్రభుత్వమే ఫీజులు ఫిక్స్ చేయాలి. అది కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న పేరెంట్స్ ని పీక్కు తినకుండా రక్షణలు కల్పించాలి. అంటే ఒకరకంగా సెమీ గవర్నమెంట్ స్కూల్స్ లాగా వాటిని పని చేయించాలి. అందులో పనిచేసే సిబ్బందికి మినిమమ్ వేజెస్ ప్రభుత్వమే ఫిక్స్ చేయాలి. విద్యాసంస్థలు నడవడానికి అయ్యే కనీస ఖర్చులో ఎంత తక్కువ పడుతుందో చూసి, ఆ తగ్గిన మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలి.
6) అన్ని ఆసుపత్రులను కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి. వారికి మినిమమ్ చార్జీల కింద ప్రభుత్వమే భరించాలి. వైద్య సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్స్ కూడా గణనీయంగా తగ్గించాలి. అప్పుడే హాస్పిటల్స్ వాటి సర్వీస్ చార్జీలను తగ్గిస్తాయి. అయినప్పటికీ అవి రన్ అవడానికి ఎంత తక్కువ పడుతుందో అంత మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలి. ఇవన్నీ శాశ్వతంగా కాకపోయినా.. కనీసం లాక్ డౌన్ పీరియడ్ వరకైనా జరగాలి.
7) సినిమాలు, సీరియల్స్ ప్రొడక్షన్స్ అంతా ఆగిపోయినప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయం ఏం ఉంటుంది? కాబట్టి మీడియా రంగాన్ని ప్రభుత్వమే టేకోవర్ చేసుకొని, అర్హత కోసం ఏదో ప్యారామీటర్ పెట్టి అన్ని మీడియా సంస్థల్లో పనిచేసే స్కిల్డ్ పర్సన్స్ చేత ప్రభుత్వమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తే ఎంత మేలు?
ఇలా కామన్ మ్యాన్ కు అవసరమైన అన్ని వస్తు, సేవలు కూడా ప్రభుత్వ నిఘా కిందికి తీసుకురావాలి. ఎవరు, ఏ స్థాయిలో ఆ నిబంధనలు ఉల్లంఘించినా 24 గంటలూ పని చేసేలా ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలి. ఇలా చేసి ప్రజలకు అవసరమైన కనీస సేవలకు గ్యారెంటీ ఇస్తే బతుకు జట్కా బండి సాఫీగా సాగిపోతుంది.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే... బాగా నష్టపోయేది హాస్పిటాలిటీ అండ్ టూరిజం రంగాలు. ప్రజల ప్రాణాలకే గ్యారెంటీ లేని ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హోటళ్లు, టూరిజం స్పాట్లను ఎవరడిగారు? బతికుంటే బలుసాకు తినొచ్చని ప్రజలంతా అనుకుంటున్నప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాలు, షికార్లు, పబ్బుల ప్రసక్తేముంది? ఈ విధంగా పనికొచ్చే అన్ని రంగాల్లో మినిమమ్ వేజెస్ ప్రభుత్వమే ఫిక్స్ చేయాలి. సో ఫ్రెండ్స్... ప్రభుత్వం తన ఉద్యోగుల వేతనాలకు కోతలు వేయడం అనేది ఎంతో ముందుచూపుతో చేసిన చర్య అని అర్థం చేసుకొని అందుకు సహకరిద్దాం. అదే సమయంలో మనకు అందాల్సిన సేవలు అదేరీతిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుదాం. అలా కోరడంలో తప్పు లేదు కదా. ఏమంటారు? సో ప్రజలందరినీ ఈ విధంగా ఆలోచింపజేద్దామా? ఒక మూవ్ మెంట్ మొదలుపెడదామా? ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.
Comments
Post a Comment
Your Comments Please: