Skip to main content

డాక్టర్లపై దాడులు జరుగుతున్నది ఇందుకేనా?


ఈ దేశ సామాన్య ముస్లింలు.. రోగుల ప్రాణాలు నిలబట్టే డాక్టర్లపై దాడులు చేసేంత తెలివిలేనివారా? కరోనా విజృంభణ తమను కూడా చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తుందన్న విషయం కూడా వారికి తెలియదా? ఒక సామాన్య భారతీయుడికి ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే. అయితే వారికి తెలియదనుకోవడం పొరపాటే అయినా.. వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారన్నది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. మన దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లింల కోసం ఆలోచించే నాయకులు, సంఘాలు మాత్రం మరింత బాగా, బాధ్యతగా ఆలోచించాల్సిన తక్షణావసరం ఏర్పడుతోంది. 



మన ముస్లింలు కరోనా డయాగ్నిసిస్ కోసం సహకరించకపోవడానికి మూలం దేశంలో కరోనా కనిపించడానికి ముందే ఏర్పడింది. డిసెంబర్ లో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లుకు రూపకల్పన జరిగి చట్టరూపం దాల్చడానికి ముందు నుంచే అస్సాంలో మొదలైన నిరసనలు అనేక రాష్ట్రాలకు విస్తరించాయి. ఇక సీఏఏ అమల్లోకి వచ్చాక ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో 3 వారాల పాటు ధర్నాలు జరిగాయి. దేశమంతా చలితో వణికిపోతున్న ఆ టైమ్ లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజకీయం వేడెక్కింది. సీఏఏ ను వాపస్ తీసుకునేదాకా విశ్రమించేది లేదన్న అసాధ్యమైన డిమాండ్ తో సామాన్య ప్రజల్ని రంగంలోకి దింపారు. చిన్నపిల్లల్ని సైతం షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొనేలా చేశారు. జ్వరంతో ఉన్న పసిపాప అదే చలిలో ఉండటంతో చనిపోవడం కూడా జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం ఈ దేశ ముస్లింలు అందరికీ వ్యతిరేకమని, అది అమల్లోకి వస్తే ముస్లింలు పౌరులు కాకుండా పోతారన్న అపోహను బలంగా నాటడంలో ఈ దేశ సెక్యులర్ పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏను తాము వ్యతిరేకిస్తున్నామని.. జనాభా లెక్కల కోసం వచ్చే ప్రభుత్వాధికారులకు ఏ విషయమూ వివరించరాదని సీఏఏ వ్యతిరేక నాయకత్వం ముస్లింల చేత  ప్రతిజ్ఞలు చేయించింది. 


Also Read:  Can India limit religious gatherings @CORONA times?


హైదరాబాద్ లో పోటీ ర్యాలీలు
ఈ క్రమంలోనే జనవరి 4న హైదరాబాద్ లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో మిలియన్ మార్చ్ జరిగింది. ఆ మార్చ్ కు అధికార టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, దళిత సంఘాలు, పౌరసంఘాలుగా చెప్పుకునే ఇతర లెఫ్ట్ బ్యాగ్రౌండ్ గల నేతలు.. ఇలా అందరూ సహకరించారు. ఆ సభను ఒకరకంగా యాంటీ సీఏఏ మార్చ్ అనేకన్నా యాంటీ బీజేపీ, యాంటీ మోడీ మార్చ్ గా అభివర్ణించుకోవచ్చు. ఇంకో అంశమేంటంటే.. ఆ ర్యాలీ తరువాత సామూహికంగా నమాజ్ నిర్వహించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంబీటీ గ్రౌండ్ వర్క్ తో జరిగిన ఆ భారీ ర్యాలీ తరువాత జనవరి 25 రాత్రి ఎంఐఎం మరో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు రాత్రి సీఏఏ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించడం ఎంత కుట్రపూరితమైన, వ్యూహాత్మకమైన నిర్ణయమో ఎవరైనా అంచనా వేసుకోవచ్చు. తిరంగా జెండా పట్ల ఎప్పుడూ గౌరవాన్ని ప్రకటించని ఎంఐఎం.. ఆ రాత్రి తిరంగా జెండాలు పట్టుకొని సీఏఏ వ్యతిరేక నిరసనకు పూనుకోవడాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు రాత్రి కవితలు, ముషాయిరాలు, ఉపన్యాసాలతో ఖిల్వత్ గ్రౌండ్ హోరెత్తింది. తిరంగా జెండాల నీడన జరిగిందంతా దేశ వ్యతిరేక ప్రదర్శనలేనని గమనించాలి. 



అలా ఊపందుకున్న సీఏఏ వ్యతిరేక నిదర్శనలు అన్ని జిల్లాల్లో, మారుమూల గ్రామాల్లో (దేశవ్యాప్తంగా) సైతం విస్తరించాయి. ముస్లిం నాయకత్వం తన వర్గం ప్రజలందరికీ పౌరుల వివరాల సేకరణ కోసం వచ్చే ఏ ప్రభుత్వాధికారికైనే సహకరించరాదని స్థానికంగా ఉండే అన్ని స్థాయిల ముస్లిం నాయకత్వం, కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర యాక్టివిస్టులు బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ లోగా కరోనా కలకలం మొదలైంది. అప్పటికే ఇండొనేషియా నుంచి, మలేషియా నుంచి తబ్లిగీ జమాత్ కోసం మతపెద్దలు హాజరయ్యారు. కానీ అది నడుస్తున్న విషయం దేశ ప్రజలకు తెలియదు. అది నడుస్తుందని తెలిసివారు, దానికోసం హాజరయ్యేవారికి తప్ప. ఈ లోగా కరోనా కాస్త చైనాను దాటుకొని ప్రపంచమంతా విస్తరించి, మన గడపలో అడుగుపెట్టి, జమాత్ తబ్లిగీ పూర్తయి, ఇండొనేషియన్లు కరీంనగర్ వచ్చారన్న విషయం బయటపడ్డ సమయం దాకా మనకు దాని ప్రభావమే తెలీదు. తీరా లాక్ డౌన్ ప్రకటించి, జమాత్ కు హాజరైనవారి వల్లే ఇంత విపరీతంగా వ్యాపించిందని బయటకు పొక్కే నాటికి పరిస్థితి అదుపు తప్పింది. ఏప్రిల్ 5 నుంచి 6 నాటికి ఒక్క రోజులోనే 63 కొత్త కేసులు బయటపడ్డాయంటే తబ్లిగీ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జమాత్ కు వెళ్లొచ్చినవారిని గుర్తించేందుకు వెళ్తున్న వైద్యసిబ్బందిపై దాడికి కారణమెవరో చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. 


ఆ పార్టీలు ఇప్పుడేం చెబుతాయి?
సీఏఏ ద్వారా తమమీద దేశ బహిష్కరణ వేటు లాంటిది పడబోతుందన్న అపోహలో ఉన్న ముస్లింలు... తమవద్దకు వచ్చే వైద్యసిబ్బందిని జనాభా లెక్కల కోసం వచ్చే ప్రభుత్వాధికారులుగా పొరపడుతున్నారు. అందుకే వారుండే ఇలాకాల్లో అడుగుపెట్టనివ్వకుండా రాళ్లదాడులకు దిగుతున్నారు. మహిళా సిబ్బందిపై బండబూతులకు దిగుతున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. వివరాలను మాత్రం అవ్వమని, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదాల ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. అక్కడ జమాత్ లో సైతం అసలు మత బోధల కన్నా... సీఏఏ వ్యతిరేక పాఠాలు నేర్పించడం, ప్రజలందరినీ రోడ్ల మీదికి రప్పించాలని రెచ్చగొట్టడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య పరీక్షలకు సహకరించరాదని చెప్పడం.. ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు బాగా సింకవుతున్నాయి. ఈ దేశ సగటు ముస్లింలు కరోనాకు సహకరించకపోవడానికి కారణం వాళ్ల అజ్ఞానం, అమాయకత్వం కన్నా.. వారికి అలా నూరిపోసిన రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలదేనని చెప్పక తప్పదు. మరి.. పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చాక ఆ రాజకీయ పార్టీల్లో ఎంతమంది తమ పాత్రను కరెక్ట్ చేసుకుంటారనేదే బిలియన్ డాలర్ల ప్రశ్న. 



 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.