Skip to main content

కరోనా కాటేస్తుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారు?


Photo Credit: Sakshi Post


ఖైదీలు ఏం చేస్తున్నారు? హాయిగా ముప్పూటలా తిని పడుకుంటున్నారా? అలాగే అసలు క్రైమ్ రేట్ 50 శాతానికన్నా తగ్గిపోయి కొత్త ఖైదీలెవరూ రాని పరిస్థితుల్లో జైళ్ల అధికారులు ఏం చేస్తున్నారు? గోళ్లు గిల్లుకుంటున్నారా? లేక అక్కరకొచ్చే పనేదైనా చేస్తున్నారా? ఖైదీలను ఖాళీగా ఉంచకుండా జైలు సిబ్బంది చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా సృష్టించిన కరువును పూడ్చేందుకు జైలుసిబ్బంది బయటి ప్రపంచానికి తెలియని అపురూపమైన సేవలు అందిస్తున్నారు. జైలు సిబ్బందిని గైడ్ చేస్తూ, ఖైదీల టాలెంట్ ను సరైనరీతిలో వాడుకునే పక్కా ప్రణాళికలు రచిస్తున్నది ఇప్పుడు ఆయా జైళ్ల అధికారులే. 



కరోనా మహమ్మారిని నివారించడంలో జైలు అధికారుల సహకారం అంతా ఇంతా కాదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వేసే బెడ్ నుంచి పరిచే దుప్పటి, పేషంట్స్ డ్రెస్ లు, మూతికి కట్టుకునే మాస్కులు, శానిటైజర్లు, యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాలు తయారయ్యేది జైలు అధికారుల పర్యవేక్షణలోనే. రోజూ వచ్చే నిందితులను ఏ విధమైన నిబంధనలతో లోనికి అనుమతిస్తారో తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. కరోనా నేపథ్యంలో లోపలికి వచ్చేవారిని 14 రోజులు విడిగా వుంచి అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించిన తరువాతే వారిని ఇతర ఖైదీలతో కలపడం జరుగుతుంది. 


వారికి రోజూ రెండు గంటలకు ఒకసారి చేతులు కిడిగిస్తూ.. ఏ విధంగా ఈ వ్యాధి రాకుండా ఉండాలి అనే అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అది కూడా ఒక జైల్ వార్డర్.. వారి చేతి మీద శానిటైజర్ వేస్తూ వెళుతుంటాడు. ఇలా జైల్ అధికారుల బాధ్యత  చాలా క్రియాశీలం. ఒక వ్యక్తి జైల్ కి రావాలంటే 1) పోలీస్,) 2) జ్యుడీషియరీ 3) జైల్.. ఈ ముగ్గురు బాధ్యతలు నిర్వహిస్తే తప్ప ఒక నేరస్తుడు జైలుకి వచ్చే ప్రక్రియ పూర్తి కాదు. ఖైదీల విషయంలో అటు పోలీసులకు గానీ ఇటు జ్యూడిషియరీకి గానీ సుప్రీం కోర్టు నుండి, అలాగే హైకోర్టు నుండి ఇప్పటివరకు ఎలాంటి సూచనలు, సలహాలు అందలేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకితే పరిస్థితేంటి? ఈమధ్య అమెరికాలోని చికాగోలో 120 మందికి కరోనా సోకినట్టు సమాచారం. మరి అలాంటిది ఒక్క చర్లపల్లి జైల్లోనే 2 వేల మంది ఖైదీలు ఉన్నారు. ఈ విధంగా జిల్లా జైళ్లు, సబ్ జైళ్లు అన్నీ కలిపితే ఎంత మంది వుంటారో ఊహించుకోవచ్చు. అయితే మన జైల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇప్పటివరకు మనకు ఎలాంటి నష్టం జరగలేదు. కారణం.. జైళ్ల అధికారులు పక్కాగా కరోనా నిబంధనలు అమలు చేయడమేనని గుర్తించాలి. సమస్య వచ్చిన తరువాత కాకుండా రాకముందే మేల్కొని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న జైలు అధికారులను అభినందించాల్సిందే. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత