Skip to main content

చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్


Photo- GETTY (మానవ సహిత మిషన్ కోసం నాసా సిద్ధమవుతోంది. 2020లో మినీ రోవర్లు పంపాలని నిర్ణయించింది)


ఆస్తులు పోగేసుకోవడానికి, ఆధిపత్యం నిలుపుకోవడానికి సరిహద్దులతో పనేంటి? భూగోళం మీద ఆధిపత్యాన్ని ఎప్పుడో సాధించిన అమెరికా చంద్ర మండలాన్ని కూడా కబ్జా చేసుకోవాలని చూస్తోంది. ప్రపంచమంతా ఇల్లు కదలకుండా కరోనా గురించి కథలుకథలుగా చెప్పుకుంటుంటే... ట్రంప్ ఆలోచన చంద్రమండలాన్ని చుట్టేస్తోంది. చంద్రుడి మీద మైనింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ముహూర్తం కూడా ఖరారైనట్లు ఫోర్బ్స్ వెబ్ సైట్ ఓ కథనాన్ని డొమైన్లో పోస్ట్ చేసింది. 


ఆ కథనం ప్రకారం 2024లో ఆర్టెమిస్ 3 (Artemis 3 mission) చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలుమోపుతుంది. 55 ఏళ్ల క్రితం చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు అడుగుపెట్టినట్టుగానే మళ్లీ 2024లో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఈసారి ఒక మహిళా వ్యోమగామి కూడా తొలిసారిగా అడుగు పెట్టి చరిత్ర సృష్టించబోతోంది. అలాగే ఒక మేల్ ఆస్ట్రొనాట్ కూడా ఈ మిషన్లో భాగం పంచుకోబోతున్నారు. నాసా ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. అయితే ఈసారి చంద్రమండల యాత్రలో అమెరికా కాకుండా మరో దేశం ఏదీ కూడా భాగం పంచుకోవడం లేదు. ఈ యాత్ర పూర్తిగా చంద్రుడి మీద అమెరికా ఆధిపత్యాన్ని ఖాయం చేసుకునే దిశగానే సాగుతోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 


చంద్రుడి మీద నీరు, గాలి, ఇతర ఖనిజాల కోసం అన్వేషణ, అందుకు ప్రయోగాలు కొనసాగుతుండగానే ఆ దిశగా శాస్త్రవేత్తల్ని పంపేందుకు అమెరికా ఆరాటపడటం విమర్శలకు తావిస్తోంది. రోదసిని శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఉపయోగించుకునే 1979 నాటి అంతర్జాతీయ ఒప్పందాన్ని ట్రంప్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్నాయంటున్నారు. అసలు అమెరికా ఏనాడూ ఆ ఒప్పందాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని రోదసి ప్రయోగాల పీస్ కమిటీలో 95 దేశాలకు గాను 17 సభ్య దేశాలు మాత్రమే అమెరికాకు అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా అమెరికా ఏకపక్షంగా రోదసిలో ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా అవకాశం లేకుండా పోయింది. అయితే 2015లో ఆమోదం పొందిన ఓ చట్టం ప్రకారం అమెరికా ఏ దేశం నుంచి అనుమతి గానీ, ఆమోదం గానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చట్టాన్నే అడ్డుపెట్టుకొని ఇప్పుడు ట్రంప్ తాజా ఆదేశాలు జారీ చేయడం విశేషం. 


ఈ అధ్యయనం ద్వారా చంద్రుడి మీద షెల్టర్ వేసుకోవడం, షెల్టర్ వేసుకునేందుకు అనువైన ప్రదేశాలు వెదికి పెట్టడం, అక్కడి ఉపరితలాన్ని, దాని కింద ఉన్న పొరలు, వాటి కింద ఉన్న ఖనిజాలను అన్వేషించడం, వాటిని తవ్వి తీసేందుకు ఏర్పాట్లు చేయడం కోసం వ్యోమగాములు బయల్దేరబోతున్నారు. చంద్రుడిపై మానవ నివాసం, శాస్త్ర-సాంకేతిక అంశాల్లో ప్రయోగాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలకమైన అంశాలపై అక్కడే ప్రయోగాలు నిర్వహించి, ఉత్పత్తి చేయడానికి రంగం సిద్ధం చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. వ్యోమగాములు ఇచ్చే ఇన్ పుట్స్ తరువాత చంద్రుడి మీద ఉండే ఖనిజాల తవ్వకంపై ఓ అవగాహన ఏర్పడి తుది నిర్ణయానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే చంద్రుడి మీద తవ్వకాలు జరిగితే అది భూమ్మీద ఎలాంటి ప్రభావాలు చూపుతుంది, మానవాళి మరో కొత్త ప్రమాదంలో పడుతుందా అనే అంశాలపై అధ్యయనాలు జరగాల్సి ఉంది. మరి వాటిని అమెరికా ఎంతవరకు పట్టించుకుంటుందో చూడాలి. 


News to follow: పట్నంలో అద్దె బాధలు తీర్చిన ఆపద్బాంధవుడు


Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత