Skip to main content

అంతా బానే ఉంది కానీ..


షబ్-ఎ-బారాత్ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియాలో చేసిన సుదీర్ఘ ప్రసంగం మొత్తమ్మీద బాధ్యతాయుతంగానే కనిపించడం చెప్పుకోదగ్గ విశేషం. ముందుగా రాత్రి 9 గంటలకు ప్రసంగం ఉంటుందని డిక్లేర్ చేసినా ఆ సమయాన్ని రాత్రి పదిన్నరకు వాయిదా వేశారు. దీంతో జనరల్ మీడియాలో దానికి పెద్దగా స్పేస్ దక్కలేదు. కానీ దాదాపు ఒక గంట సేపు జరిగిన సోషల్ ఇంటరాక్షన్ కి ట్విిట్టర్ లో భారీ రెస్పాన్స్ కనిపించింది. ట్విట్టర్ లో ఆయనకు 11 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అందులో నేను కూడా ఒకణ్ని.


వ్యూహాత్మక ప్రసంగంలో మేటిఅసదుద్దీన్ అద్భుతమైన వాక్చాతుర్యం గల వ్యక్తి. ఎలాంటి విషయాన్ని, ఎలాంటి సందర్భాన్నయినా తనకు అనుకూలంగా చక్కగా మలుచుకోవడంలో, బాధ్యతను అవతలి వ్యక్తి మీదికి తోసేయడంలో ఘనాపాటిగా పేరుంది. గురువారం రాత్రి జరిగిన సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో తొలి భాగం ఎంతో బాధ్యతగా మాట్లాడిన అసదుద్దీన్.. రెండో భాగానికి వచ్చేసరికి మళ్లీ పాతపాటే పాడారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ సపోర్టర్స్ అంతా కూడబలుక్కొని విషం చిమ్ముతున్నారని కడిగిపారేశారు. కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమన్న అర్థం వచ్చేలా పాత వీడియోలను సైతం ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నారంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. 


షబ్-ఎ-బారాత్ సందర్భంగా ముస్లింలు ఎలాంటి జీవితం గడపాలో చాలా చక్కగా వివరించారు. తాగుడు మనిషిని నిర్వీర్యం చేస్తుందని, దాని పర్యవసానాలు కుటుంబాన్నే కష్టాల్లోకి నెడతాయంటూ ముస్లిం సమాజానికి ఒక పెద్దన్నలా ఫీలవుతా చెప్పడం విశేషం. అంతేకాదు.. పాన్, గుట్కా వంటివి కూడా నోట్లో వేసుకొని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం మానుకోవాలని, అది కూడా ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని, తెలంగాణ సర్కారు కూడా దాన్ని నిషేధించిందంటూ ఒక ప్రధాన వర్గం ప్రజానీకానికి చెప్పడానికి ఈ సందర్భాన్ని చక్కగా వినియోగించుకున్నారు. 


ముస్లింలే కారణమా?


భారత్ లో కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమా.. స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో కరోనా ప్రబలడానికి ముస్లింలే కారణమా? అంటూ అసదుద్దీన్ ఎంతో ఆవేదన ప్రకటించడం అర్థం చేసుకోదగిన అంశం. జనవరి 1 నుంచి మార్చి 13 వరకు భారత్ లోకి 15 లక్షల మంది విదేశీయులు వచ్చారని, కేవలం లాక్ డౌన్ ప్రకటించిన తరువాత, అది కూడా తబ్లిగీ జమాత్ కార్యక్రమం వల్లనే వైరస్ వ్యాపించిందన్న ప్రచారం సరికాదన్నారు. నిజమే.. డిసెంబర్ లోనే కోవిడ్-19 చైనాలో దుమారం రేపుతున్నా భారత్ దాన్ని ఓ ప్రపంచ విపత్తుగా చూడలేదు. అసలు ఇండియా ఏం ఖర్మ.. ప్రపంచంలోని ఏ దేశం కూడా దాన్ని ప్రపంచ సమస్యగా చూడలేదు. అందుకే విమాన ప్రయాణాలు నిరాటంకంగా సాగాయి. మన దేశంలో జనవరి చివరలో తొలి కేసు నమోదైంది. అయినా మార్చిలో కూడా విదేశీయుల రాకపోకాలు యథేచ్ఛగా సాగాయి. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ పాటించాలంటూ 19వ తేదీన ప్రధాని మోడీ బహిరంగ విజ్ఞప్తి చేసేదాకా అసలైన కట్టడి మన దేశంలో అమలే కాలేదు. మోడీ ప్రకటన తరువాతనే జనతా కర్ఫ్యూ, ఆ తరువాత లాక్ డౌన్ కూడా పక్కాగా అమలవుతోంది. ఒక దేశమంతా పూర్తి లాక్ డౌన్ లో ఉండడం అనేది ప్రపంచంలోనే తొలి ప్రయోగం. అదే ఇప్పుడు మన కేసుల సంఖ్యను కంట్రోల్ చేస్తోంది. 


Also Read: బీ అలర్ట్ - రేపు రాత్రి 9 గంటలకు అసద్ భాయి అంతరంగం


                    రెంట్లు తగ్గాలి.. ఫీజులు ఎత్తేయాలి.. సామాన్యుడి సరికొత్త డిమాండ్లు


కాబట్టి ముస్లింల కారణంగానే వైరస్ మన దేశంలోకి వచ్చిందని ఎవరూ భావించాల్సిన అవసరం లేదు. అలా ఎవరూ భావించడం కూడా లేదు. మనసులో గూడుకట్టుకున్న విపరీతమైన ద్వేషభావాన్ని సోషల్ మీడియాలో ప్రకటించుకునేవారు అన్ని వర్గాల్లో ఉంటారు. దానికి కులం, మతంతో సంబంధం లేదు. ఫేస్ బుక్ లో గానీ, వాట్సాప్ గ్రూపుల్లో గానీ వివిధ కులాలకు సంబంధించిన గ్రూపుల్లో కనిపించేది ఇదే. ప్రతి గ్రూపులో ఇద్దరు, ముగ్గురు రెచ్చిపోయేవారు, రెచ్చగొట్టేవారు.. వారిని కంట్రోల్ చేయడానికి అడ్మిన్ లు ఇబ్బందులు పడుతుండడం చూస్తున్నదే. దాన్ని  యావత్ ప్రజానీకం అభిప్రాయంగా చూడడం చాలా తప్పు. అయితే మర్కజ్ కు వెళ్లొచ్చినవారి వల్లనే వైరస్ వ్యాప్తి విజృంభించిందనేది వాస్తవం. ఇదే విషయం అన్ని దశల్లో కూడా రుజువైంది. అయితే వైరస్ వ్యాప్తికి వారు బాధ్యులే తప్ప దోషులు కారు. ఈ స్పృహ ఈ దేశ సామాన్య ప్రజల్లో ఉంది. ఎటొచ్చీ ఆయా వర్గాలకు కొమ్ముకాసే నాయకులకే లేకపోవడం విషాదం. టెస్టులకు సహకరించకపోవడం, అజ్ఞాతాన్ని వీడకపోవడం, స్థానిక అధికారులకు సమాచారం అందించకపోవడం, ఈ లోగా మరింతమందిని వారు కలవడం.. ఇలాంటివి జరిగిపోయాయి. అప్పటికే కరోనా మీద ఎంత ప్రచారం జరగాలో అంతా జరిగింది. ప్రజలందరూ లాక్ డౌన్ పాటిస్తున్న క్రమంలో ఇళ్లకే పరిమితమై ఉన్న కారణంగా ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో అంతటా కూడా వైరస్ వార్తలే తప్ప మరోటి లేదు. దాని అవగాహన ఈ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మర్కజ్ నుంచి తిరిగొచ్చినవారు.. హైడింగ్ లో ఉండడం సామాన్య జనానికి ఎలాంటి అభిప్రాయాలు కలిగిస్తుంది. ముస్లింలలో కొంతమందైతే పనిగట్టుకొని దాన్ని వ్యాపింపజేస్తాం అన్నట్టుగా వ్యవహరించారు. వారి మాటలు, ఉపన్యాసాలు రెండు వర్గాల మధ్య అంతరాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచేలా ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? ఈ  దేశంలోని ప్రధాన సెక్షన్ లో ముస్లింల పట్ల ఒక దురభిప్రాయం కలగడానికి కారణమైనవారిని అసదుద్దీన్ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అలాంటివారు శిక్షార్హులు కారా? వారిని అరెస్టు చేయాలన్న డిమాండ్ అసదుద్దీన్ ఎందుకు చేయలేదు? ఇండోర్ లో వైద్యసిబ్బందిపై జరిగిన దాడిని ప్రస్తావించి నొచ్చుకున్నారు. అసలు ఇండోర్ దాకా ఎందుకు తెలంగాణలో కూడా అలాగే జరిగింది కదా. బిహార్ లో పోలీసు ఉన్నతాధికారి మీదనే అలాంటి ట్రీట్ మెంట్ జరిగింది కదా. లాక్ డౌన్ అమలు చేస్తున్న తెలంగాణలో కూడా మల్కాజ్ గిరి ఏరియాలో పోలీసుల మీదికే దాడులకు దిగడం మనకు కనిపించింది కదా. పోలీసు దగ్గరి లాఠీ లాక్కుని వారిమీదికే దాడికి ప్రయత్నించడం ఏమిటి? ప్రజలందరికీ వర్తించే రూల్స్ తమకు వర్తించవన్న భావన ఈ దేశ ముస్లింలకు ఎవరైనా ఎక్కిస్తున్నారా? లాక్ డౌన్ పాటించకండి.. పిల్లా, పాపలతో బయటికి రండి అని పిలుపునిచ్చిన కొందరే కదా.. అందరి బుర్రలూ పాడు చేసేది. వారిని కట్టడి చేయాలన్న అంశాన్ని అసద్ ఎందుకు విస్మరించారు?


Also Read: Can India limit religious gatherings?


అంతేకాదు... కరోనా వ్యాప్తి విషయం బయటపడ్డాక నిజాముద్దీన్ లో మత కార్యక్రమం అనుమతి లేకుండానే జరిగిందన్న విషయంపై కేసు నమోదైంది. దానికి బాధ్యుడైన మౌలానా సాద్ ఎందుకు మొహం చాటేశాడు. కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి సహకరించకపోవడం వల్లనే కదా.. మర్కజ్ వెళ్లినవారి వివరాలు తెలుసుకోవడానికి ఇంత టైమ్ పట్టింది? ఇక్కడ బాధ్యతగా వ్యవహరిస్తే ముస్లిం సమాజం ఇంతలా బద్నాం అయ్యేదేనా? తబ్లిగీ జమాత్ ను అనవసరంగా బద్నాం చేస్తున్నారని కూడా అసద్ అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కేసు పెట్టిందా.. ఇలాంటి  కామెంట్లు అసద్ లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తి చేయాల్సినవి కాదు. అందులోనూ ప్రపంచమంతా ఆపదలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మీద, ఒక సంస్థ మీద కేసు పెట్టినప్పుడు దానికి సహకరించాల్సింది పోయి.. దాన్ని వ్యతిరేకించడం దేన్ని సూచిస్తుంది? అసదుద్దీన్ ప్రసంగంలో కీలకమైన ఇలాంటి అంశాలకు చోటే లోకపోవడం విడ్డూరం. ఇక వైరస్ కు మందు ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుందన్న నమ్మకాన్ని కలిగించిన అసదుద్దీన్.. కమ్యూనల్ వైరస్ కు మాత్రం మందు లేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. అయితే ఈ ప్రమాదం నుంచి సమాజం బయటపడ్డాక అప్పుడు రాజకీయాలు చేద్దామని, అప్పటిదాకా దీని వ్యాప్తిని అందరం కలిసి ఎదుర్కొందామని చెప్పడం శుభపరిణామం. సహజంగా అసద్ ఉపన్యాసం అనగానే మోడీ మీద వ్యతిరేకత తప్పకుండా ఉండితీరుతుంది. అయితే ఈసారి మాత్రం మోడీ మీద వ్యతిరేకతకు ప్రాధాన్యతను ఇవ్వలేదనే చెప్పాలి. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత