Skip to main content

వదిలేస్తే వల్లకాడే - ఈ లెక్కలే సాక్ష్యం


Photo: Job Vacancy


కేంద్రప్రభుత్వం గానీ, రాష్ట్రాల ప్రభుత్వాలు గానీ కరోనా పేరుతో ప్రకటిస్తున్న రోజువారీ పాజిటివ్ కేసుల లెక్కలు నమ్మకానికి బదులు అపనమ్మకాన్ని పెంచుతున్నాయి. క్వారంటైన్ చేసినా, ఐసోలేషన్లో ఉంచినా, కంటైన్మెంట్ తో కట్టడి చేసినా... కరోనా అనే ఉపద్రవం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప ఆగిన దాఖలాలు ఇప్పటికైతే కనిపించలేదు. ఉదాహరణకు ప్రభుత్వం చెప్పిన లెక్కల్నే పరిశీలిద్దాం. మన దేశంలో మిలియన్ ప్రజలకు (10 లక్షలకు) 268 మందిని పరీక్షిస్తున్నారు. ఆ మేరకు రోజుకు దాదాపు 1000 కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రోజువారీ సగటు పరీక్షలు 375. ఆంధ్రాలో రోజువారీ సగటు పరీక్షలు 539. మరణాల రేటులో కూడా జాతీయ సగటు కన్నా తెలంగాణ సగటు భేషుగ్గా ఉందంటూ, ఆంధ్రా సగటు భేషుగ్గా ఉందని మనకు మనమే సంతృప్తి పడుతున్నాం. అది మన అల్పత్వానికి పరాకాష్ట. అదే మన దేశంలో టెస్ట్ కిట్లు సరిపడినన్ని ఉండి ఇంకా ఎక్కువ పరీక్షలు నిర్వహించినట్టయితే ఎక్కువ కేసులు బయటపడతాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ పరీక్షలకు 311 మంది చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతుంటే మన దేశంలో (20 తేదీ నాటికి) మిలియన్ పరీక్షలకు 13 మంది చొప్పున బయట పడుతున్నాయి. ఆ పరీక్షలను ఇంకా పెంచితే రోజుకు కొన్ని వందల్లో, వేలల్లో బయటికొస్తాయి. లాక్ డౌన్ ని గనక నిర్లక్ష్యం చేస్తే ఆ సంఖ్య కాస్తా లక్షల్లోకి వెళ్లడం ఖాయం. ఇప్పుడు కరోనా మన ఇంటి పక్కనే పొంచి ఉందంటే అతిశయోక్తి కాదు. పదులకొద్దీ నర్సులకు, హోంగార్డులకు, పోలీులకు సోకుతూనే ఉంది. మర్కజ్ నుంచి వచ్చినవారి ఇళ్లలో పదులకొద్దీ మంది ఒక్క రోజులోనే పాజిటివ్ గా బయటపడుతున్నారు. అదే జరిగితే... టెస్ట్ లు చేయడం కాదు.. ఇటలీలో జరిగినట్టు బతకగల సంభావ్యత, అవసరం ఉన్న పాజిటివ్ కేసులను గుర్తించి, వారికి మాత్రమే ట్రీట్ మెంట్ ఇచ్చి, మిగతావారిని గాలికి వదిలేేసే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. 


Breaking News: తండ్రి అంత్యక్రియలకు హాజరు కాకండి


ఎక్కడొస్తుంది చిక్కు?


వాస్తవానికి కరోనా విషయంలో ఓవరాల్ గా చూస్తే మన దేశంలోని అన్ని ప్రభుత్వాలు కూడా పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించే పోలీసుల పాత్ర మరువలేనిది. తిట్లు, అవమానాలు, శాపనార్థాలను అన్నిటినీ దిగమింగుతూ కరోనా మీద పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల్లో, డాక్టర్లలో సహనాన్ని ఎంతకాలం నిలిపి ఉంచగలుగుతాం అన్నది ప్రశ్న. ఎందుకంటే రూల్స్ అతిక్రమిస్తున్నవారితో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించలేకపోతున్నాయి. బాధ్యత లేకుండా రోడ్ల మీదికొస్తున్నవారితో మిగతావారికి పోలీసులు అలుసవుతున్నారు. వైద్యానికి సహకరించకుండా దాడులకు పాల్పడడం ద్వారా డాక్టర్లు అలుసవుతున్నారు. వారిని అటకాయిస్తే పోలీసుల మీదనే దాడులకు పాల్పడుతున్నారు. కరోనాను ఎదుర్కొంటూ.. పాజిటివ్ లుగా మారుతూ ఈ తిట్లు భరించడం పోలీసులకు, డాక్టర్లకు అవసరమా? ఇదే భావన శాంతి-భద్రతల నిర్వాహకుల్లో, ప్రాణదాతల్లో వ్యాపిస్తే ఎలాంటి ఉపద్రవాలకు దారి తీస్తుందో ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. 


ప్రభుత్వాలు మెతకైతే పోలీసులేం చేస్తారు?


పరిపాలన రీత్యా ప్రభుత్వాలు కొన్ని అంశాల పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నాయి. కానీ శాంతిభద్రతలు నిర్వహించే పోలీసులు మెతగ్గా వ్యవహరిస్తే పరిస్థితులు చేయి దాటిపోవడం ఖాయం. ఇదే మొన్న ఢిల్లీలో కూడా రుజువైంది. సీఏఏ నిరసనలకు అవకాశం ఇస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పినప్పుడు కోర్టు మధ్యలో కల్పించుకుంది. న్యాయ నిపుణులతో రాయబారం నడిపింది. వాస్తవానికి అది కోర్టు పరిధిలోని అంశం కాదు. అది ప్రభుత్వాలు మాత్రమే డీల్ చేయాల్సిన వ్యవహారం. ఇక్కడ కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. శాంతిభద్రతల విషయాన్ని పోలీసులకు అప్పగించిన తరువాత ఇక ప్రభుత్వాల జోక్యం, వివిధ వర్గాల సెంటిమెంట్లు, రేపటి రాజకీయ ప్రయోజనాలు అనే అంశాలను పక్కన పెట్టాలి. ఈ విషయంలో రాజీ పడితే అన్ని వర్గాల్లో కూడా అనుమానాలు పెంచి పోషించనవారు అవుతారు. ఆ తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనాలు శూన్యం. 


కరోనా చెబుతున్న వాస్తవాలు రోజురోజుకూ భయంకరంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల మధ్య అనుమాన బీజాలు పిశాచాలై అశాంతికి దారితీసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. అయితే కరోనాకు భయపడి ప్రజలుగానీ, పాలకులు గానీ, కార్యనిర్వాహకులు గానీ వివేకం నశించి వివశులైపోయే ప్రమాదం నుంచి ముందుగా బయటపడాలి. మరోవైపు కరోనాను ఆసరా చేసుకొని విశృంఖలంగా ప్రవర్తించే సమూహాలు దేశమంతటా బయట పడుతున్నాయి. మహారాష్ట్రలోని పాలగఢ్ లో జరిగిన అమానవీయ ఘటన ఇందుకు తాజా ఉదాహరణ. ఇలాంటివి ప్రజల మధ్య అనుమానాలు పెంచి, విద్వేషానికి ఊడలు దింపి, ప్రతీకారమే పరమావధిగా చెలరేగిపోయి అరాచకానికి దారితీస్తుంది. ఆపై దాపురించే దారుణ పరిస్థితులను ఎవరూ నియంత్రించజాలరు. అందుకే ఇలాంటివాటిని ప్రభుత్వాలు మొగ్గలోనే తుంచేయక తప్పదు. సంప్రదాయాలకు అతీతంగా రెచ్చిపోయిన ఎవరైనా సరే అప్పటికప్పుడే నియంత్రణలోకి రావాల్సిందే. ప్రభుత్వాల ఆదేశాలు కూడా ఇందుకు అనుగుణంగా ఉండాలే తప్ప.. శాస్త్రోక్తంగా, చట్టబద్ధంగా కోర్టులే చూసుకుంటాయని కూర్చుంటే పరిస్థితులు చేయి దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత