Skip to main content

లాక్ డౌన్.. ఓ వీక్ పాయింట్


Photo Credit: HansIndia


కరోనా విజృంభణ అనేది లాక్ డౌన్ పొడిగించాలన్న డిమాండ్ ను ముందుకు తీసుకొస్తే... రెక్కాడితే డొక్కాడని కూలీలు, వలస కార్మికుల్లో మాత్రం నైరాశ్యాన్ని పెంచింది. ఇప్పటికే పనుల్లేక, పస్తులు ఉండలేక అన్నమో రామచంద్రా అంటున్న వలస కూలీలకు లాక్ డౌన్ పొడిగింపు అనేది అశనిపాతంలా తాకింది. అందుకే అటు ముంబైలోని బాంద్రాలో వేలాది మంది ఒక్కసారిగా బయటికొచ్చారు. బెంగళూర్, జైసల్మేర్, పుణే.. ఇలా దేశం నలుమూలలా వలస కార్మికులు రోడ్డెక్కారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా వేలాది మంది రోడ్డెక్కారు. సొంతూళ్లకు వెళ్లి ఉన్నదేదో తిని కాలం గడుపుదాం అనుకొని పిల్లాపాపలతో, తట్టాబుట్టలతో బయల్దేరారు. అయితే వారు అలా బయల్దేరడం అనేది కేవలం వలస కూలీల ఫెయిల్యూర్ కాదు. కరోనా అనేది వారి వ్యక్తిగత సమస్య కూడా కాదు. ఇది మనందరి కలెక్టివ్ సమస్య. ఇది సామాజిక సమస్య. ఇది సామూహిక సమస్య. ఇందులో ఏ ఒక్కరు ఫెయిలైనా అందరి ఫెయిల్యూరే. కాబట్టి వలస కూలీలు భరోసా కోల్పోవడం అనేది అందరి ఫెయిల్యూర్. 


Also Read: ఎవరి తలరాతలు మార్చడానికి ఈ గీతలు?


                  అగ్గితోటి కడగడమే అందరికీ క్షేమకరం
ఈ స్పృహ ఎందుకనో మనలో చాలా మంది పెద్దవాళ్లకు, యజమానులకు రావడం లేదు. మన రాజకీయ నాయకులకు కూడా ఆ ఫీలింగ్ ఉన్నట్టు పెద్దగా కనిపించడం లేదు. సాయమైతే చేస్తున్నారు కానీ... మొక్కుబడిగా చేస్తున్నారు. అందువల్లనే కదా.. దూరప్రాంతాల వలస కార్మికులు విసుగెత్తి వెళ్లిపోవడం ప్రారంభించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న టైమ్ లోనే వారికి బతుకు మీద భరోసా కల్పిస్తే వాళ్లు రోడ్లెక్కుతారా... ఎక్కరు కదా. సుదూర రాష్ట్రాల నుంచి భవన నిర్మాణరంగంలో కూలీలుగా వచ్చినవారు.. వారి సొంత ఖాతాల్లో డబ్బు పోగేసుకునేందుకే వచ్చారా... లేదు కదా. వారి శ్రమలో మన రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి ఉంది కదా. మన హైదరాబాద్ షాన్ లో వారి చెమట చుక్కల నిషానా కూడా ఉంది కదా. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బల్లగుద్ది మరీ చెప్పారు కదా. అయినా ఇంప్లిమెంటేషన్ కు వచ్చేసరికి ఫెయిలయ్యాం.


హైదరాబాద్ గురించి, ఇక్కడి సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పే చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ గానీ... పెద్దపెద్ద ఐటీ కంపెనీలు గానీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గానీ... వలస కూలీల గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్న పోలీసులకు చాలా సంస్థలు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పోటీలు పడి పంపిణీ చేశారు. వారికి ఇవ్వకూడదని చెప్పడం లేదు. కానీ ఎవరూ పట్టించుకోని వలస కూలీలను పట్టించుకుంటే వారికి తెలంగాణ మీద, తెలంగాణ సర్కారు మీద భరోసా కుదిరేది కదా. పోలీసులకు, డాక్టర్లకు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. ప్రభుత్వాలు కూడా వారికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాయి. మరి వేలాది మంది వలస కూలీలకు ఎవరున్నారు.. వారిచేత పని చేయించుకున్న యజమానులే కదా. మరి వాళ్లయినా వలస కూలీలను పట్టించుకోకపోతే వారికి దిక్కెవరు... ఆఖరికి ఈ సొసైటీ మీద, డబ్బున్న పెద్దోళ్ల మీద వారికి వ్యతిరేక భావం కలగితే ఆ తప్పెవరిది... ప్రపంచ సమాజం ఉమ్మడిగా ఎదుర్కొంటున్న కరోనా అనే విషమ పరీక్షలో ఉన్నోడు, లేనోడు అందరూ సమానమే కదా. 



వారి కోసం ఎక్కడి యజమానులు అక్కడే, వారి సైట్లలోనే కాస్త దూర దూరంగా షెడ్లు వేసి, భోజనాలు అరేంజ్ చేస్తే పోయిందేముంది.. శక్తి సరిపోకపోతే ప్రభుత్వం కూడా ఉంది కదా... చేయూతనివ్వడానికి. అటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. అన్నీ చేయడానికి ప్రభుత్వ సిబ్బంది ఎలాగూ సరిపోదు. ఇలాంటి పెనువిపత్తులో ఉడతా భక్తిగా పౌరసమాజం అంతా చేతనైనంత చేయాల్సిందే. అందుకోసం కాస్త ముందుగానే మేల్కొని వలంటీర్లను రిక్రూట్ చేస్తే మన కూలీలకు ఇలాంటి దురవస్థ తప్పేది. కానీ ఆ నిర్ణయం తీసుకోవడంలో మన సర్కారు తాత్సారం చేసింది. పక్కనున్న ఆంధ్రా సర్కారు వలంటీర్లను నియమించి పనిలో దూసుకుపోతుంటే.. కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్న తెలంగాణ సర్కారు మాత్రం చాలా ఆలస్యంగా కళ్లు తెరిచింంది. కనీసం ఇప్పుడైనా వలంటీర్ల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అవసరమైనంత మేర చాలా తొందరగా వలంటీర్లను రిక్రూట్ చేసుకొని వలస కార్మికులు, కూలీల సమస్యను తీర్చాలి. వారికి కనసీ వసతులు సమకూర్చాలి. కరోనా విసిరిన సవాలును సామూహికంగా ఎదుర్కోవాలి.


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత