మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి యూత్ కో-కన్వీనర్ అజయ్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా మునిసిపల్ వర్కర్స్ కు, అలాగే ఇతరవర్గాల్లోని పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మల్లంపేట్ 22వ వార్డు కార్పొరేటర్ సంధ్యాహన్మంతరావు, మేడ్చల్ తెలంగాణ జాగృతి యూత్ కన్వీనర్ పడాల మనోజ పాల్గొన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆశయాలను... ఈ విధంగా ముందుకు తీసుకెళ్తునందుకు సంతోషంగా ఉందని సంధ్య, మనోజ అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ముప్పు తొలగిపోయేంతవరకు జాగ్రత్తగా ఉండాలని పిలువునిచ్చారు. ఇప్పుడు రంజాన్ కూడా ఉన్నందున హైదరాబాద్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము
Comments
Post a Comment
Your Comments Please: