ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు అనగా గురువారం రాత్రి 9 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకొచ్చి మాట్లాడతానని, దాన్ని అందరూ ఫాలో అవ్వాలని స్వయంగా ట్వీట్ చేశారు. కరోనా కలకలం మన దేశాన్ని ఊపేస్తున్న తరుణంలో అసద్ భాయి ఏం చెబుతారన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది.
తబ్లిగీలను మోటివేట్ చేస్తారా? మోడీ మీద మాటల దాడితో సరిపెడతారా?
నిజాముద్దీన్ లోని మర్కజ్ కు వెళ్లొచ్చిన తబ్లిగీలతో కరోనా వైరస్ అనూహ్యంగా వ్యాపించిందన్న విషయం తేలిపోయిన క్రమంలో తబ్లిగీలను గుర్తించి, క్వారంటైన్ కు తరలించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. స్వచ్ఛందంగా డాక్టర్లను సంప్రదించి పాజిటివ్ అని తేలినట్టయితే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని పౌర ప్రపంచంలోని అన్నివర్గాల ప్రజలూ అభ్యర్థిస్తున్నారు. అయినా ఇప్పటికీ పలువురు తబ్లిగీలు అజ్ఞాతాన్ని వీడడం లేదన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి. అంతేకాదు... గుర్తించి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న తబ్లిగీలు సైతం డాక్టర్లకు సహకరించకపోవడం ఒక్కటే కాదు.. భౌతికదాడులకు దిగుతున్నారు. పరుషంగా, రాయడానికి వీల్లేని భాషలో మాట్లాడుతున్నారు. మహిళా వైద్యసిబ్బందితో దురుసుగా ప్రవర్తించడమే కాక అసభ్యంగా, అనాగరికంగా బిహేవ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు స్వయంగా వైద్యసిబ్బందే చేయడం గమనించాలి. తాజాగా ఢిల్లీలోని ద్వారకాలో గల క్వారంటైన్ సెంటర్లో మూత్రం నింపిన బాటిళ్లను బయటికి విసిరారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఎవరన్నది ఇంకా గుర్తించకపోయినా ఎఫ్ఐఆర్ మాత్రం బుక్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తి కోసమే ఇలా చేశారని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇక నరేలా క్వారంటైన్ సెంటర్లో పలువురు తబ్లిగీలు ఆస్పత్రి పరిసరాల్లో, వరండాల్లో బహిరంగ మలవిసర్జన చేసి వాతావరణం అంతా పాడు చేస్తున్నారని, చికిత్సకు సహకరించడం లేదని, క్వారంటైన్ సెంటర్లోకి ఎవరినీ రాకుండా చేస్తున్నారన్న ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మహిళా సిబ్బందిని చూసి వెకిలిగా ప్రవర్తించడం, కొందరైతే బట్టలు విప్పుకొని మరీ జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులొస్తున్నాయి.
Readable links: తబ్లిగీకి హాజరైన హిందూ యువకులు
డాక్టర్లపై దాడులు జరుగుతున్నది ఇందుకేనా?
గాంధీలో కూడా జరిగింది ఇదే
ఒక్క ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కూడా తబ్లిగీల ప్రవర్తన ఇలాగే కనిపించడం గమనించాల్సిన అంశం. అటు నిజమాబాద్ లో వైద్య సిబ్బందికి ఎలాంటి ట్రీట్ మెంట్ జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభుత్వాధికారుల మీద రాళ్ల దాడి సరేసరి. కొందరి వల్ల యావత్ ముస్లిం సమాజానకే చెడ్డపేరు వస్తోందని చాలా మథనపడుతున్న ముస్లింల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. వారికి సద్బుద్ధి కలగాలని అల్లాను ప్రార్థిస్తూ తలనీలాలు సమర్పించుకున్న (తలనీలాలు సమర్పుంచుకోవడం హిందువుల్లో మాత్రమే కాదు.. ముస్లింలలో కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు) జర్నలిస్టుల ఉదంతాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో గురువారం షబ్-ఎ-బరాత్ ను పురస్కరించుకొని రాత్రి 9 గంటలకు అసదుద్దీన్ ఏం మాట్లాడతారన్నది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. తెలిసో, తెలియకో కరోనా బారినపడ్డ సోదర ముస్లింలను చికిత్సకు సహకరించాలని, రోగాన్ని అంటించుకోవడం కన్నా ఇతరులకు అంటించడం మహా పాపమని, ఖురాన్ లో ఆ విధంగా ఎక్కడా లేదని, అలాంటి చర్యలను అల్లా సహించడని కన్విన్స్ చేసి కళ్లు తెరిపిస్తారా? లేక.. తమ సోదర వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని, దీన్ని మానుకోవాలని, ఎందరో ముస్లింలు ఈ దేశం కోసం పాటుపడ్డారంటూ పాతపాటలే పాడతారా అన్నది ఆసక్తి గొలుపుతోంది. బాధ్యతగా మాట్లాడతారా.. తమ బాధ్యతను ఇంకొకరి చేతగానితనంగా చూపిస్తారా వేచి చూడాలి.
Comments
Post a Comment
Your Comments Please: