Skip to main content

బీ అలర్ట్ - రేపు రాత్రి 9 గంటలకు అసద్ భాయి అంతరంగం


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు అనగా గురువారం రాత్రి 9 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకొచ్చి మాట్లాడతానని, దాన్ని అందరూ ఫాలో అవ్వాలని స్వయంగా ట్వీట్ చేశారు. కరోనా కలకలం మన దేశాన్ని ఊపేస్తున్న తరుణంలో అసద్ భాయి ఏం చెబుతారన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. 


తబ్లిగీలను మోటివేట్ చేస్తారా? మోడీ మీద మాటల దాడితో సరిపెడతారా?
నిజాముద్దీన్ లోని మర్కజ్ కు వెళ్లొచ్చిన తబ్లిగీలతో కరోనా వైరస్ అనూహ్యంగా వ్యాపించిందన్న విషయం తేలిపోయిన క్రమంలో తబ్లిగీలను గుర్తించి, క్వారంటైన్ కు తరలించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. స్వచ్ఛందంగా డాక్టర్లను సంప్రదించి పాజిటివ్ అని తేలినట్టయితే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని పౌర ప్రపంచంలోని అన్నివర్గాల ప్రజలూ అభ్యర్థిస్తున్నారు. అయినా ఇప్పటికీ పలువురు తబ్లిగీలు అజ్ఞాతాన్ని వీడడం లేదన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి. అంతేకాదు... గుర్తించి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న తబ్లిగీలు సైతం డాక్టర్లకు సహకరించకపోవడం ఒక్కటే కాదు.. భౌతికదాడులకు దిగుతున్నారు. పరుషంగా, రాయడానికి వీల్లేని భాషలో మాట్లాడుతున్నారు. మహిళా వైద్యసిబ్బందితో దురుసుగా ప్రవర్తించడమే కాక అసభ్యంగా, అనాగరికంగా బిహేవ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు స్వయంగా వైద్యసిబ్బందే చేయడం గమనించాలి. తాజాగా ఢిల్లీలోని ద్వారకాలో గల క్వారంటైన్ సెంటర్లో మూత్రం నింపిన బాటిళ్లను బయటికి విసిరారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఎవరన్నది ఇంకా గుర్తించకపోయినా ఎఫ్ఐఆర్ మాత్రం బుక్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తి కోసమే ఇలా చేశారని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇక నరేలా క్వారంటైన్ సెంటర్లో పలువురు తబ్లిగీలు ఆస్పత్రి పరిసరాల్లో, వరండాల్లో బహిరంగ మలవిసర్జన చేసి వాతావరణం అంతా పాడు చేస్తున్నారని, చికిత్సకు సహకరించడం లేదని, క్వారంటైన్ సెంటర్లోకి ఎవరినీ రాకుండా చేస్తున్నారన్న ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మహిళా సిబ్బందిని చూసి వెకిలిగా ప్రవర్తించడం, కొందరైతే బట్టలు విప్పుకొని మరీ జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులొస్తున్నాయి. 


Readable links:  తబ్లిగీకి హాజరైన హిందూ యువకులు 


                      డాక్టర్లపై దాడులు జరుగుతున్నది ఇందుకేనా?


గాంధీలో కూడా జరిగింది ఇదే
ఒక్క ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కూడా తబ్లిగీల ప్రవర్తన ఇలాగే కనిపించడం గమనించాల్సిన అంశం. అటు నిజమాబాద్ లో వైద్య సిబ్బందికి ఎలాంటి ట్రీట్ మెంట్ జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభుత్వాధికారుల మీద రాళ్ల దాడి సరేసరి. కొందరి వల్ల యావత్ ముస్లిం సమాజానకే చెడ్డపేరు వస్తోందని చాలా మథనపడుతున్న ముస్లింల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. వారికి సద్బుద్ధి కలగాలని అల్లాను ప్రార్థిస్తూ తలనీలాలు సమర్పించుకున్న (తలనీలాలు సమర్పుంచుకోవడం హిందువుల్లో మాత్రమే కాదు.. ముస్లింలలో కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు) జర్నలిస్టుల ఉదంతాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఈ క్రమంలో గురువారం షబ్-ఎ-బరాత్ ను పురస్కరించుకొని రాత్రి 9 గంటలకు అసదుద్దీన్ ఏం మాట్లాడతారన్నది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. తెలిసో, తెలియకో కరోనా బారినపడ్డ సోదర ముస్లింలను చికిత్సకు సహకరించాలని, రోగాన్ని అంటించుకోవడం కన్నా ఇతరులకు అంటించడం మహా పాపమని, ఖురాన్ లో ఆ విధంగా ఎక్కడా లేదని, అలాంటి చర్యలను అల్లా సహించడని కన్విన్స్ చేసి కళ్లు తెరిపిస్తారా? లేక.. తమ సోదర వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని, దీన్ని మానుకోవాలని, ఎందరో ముస్లింలు ఈ దేశం కోసం పాటుపడ్డారంటూ పాతపాటలే పాడతారా అన్నది ఆసక్తి గొలుపుతోంది. బాధ్యతగా మాట్లాడతారా.. తమ బాధ్యతను ఇంకొకరి చేతగానితనంగా చూపిస్తారా వేచి చూడాలి. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత