Skip to main content

గత్తర లేపుతున్న కరొనా... గడప ముందుకొచ్చింది


ప్రపంచాన్ని వణికిస్తున్న కరొనా వైరస్ ఇండియాకు రానే వచ్చింది. మొన్ననే కేరళలో ముగ్గురు యువకులకు సోకినట్లు కన్ఫామ్ అయినప్పటికీ ట్రీట్ మెంట్ తరువాత వారిని డిశ్చార్చ్ చేశారు. వారిని యథేచ్ఛగా బయట తిరగరాదని హెచ్చరించి వదిలారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు యథేచ్ఛగా వెళ్లరాదని స్ట్రిక్టుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా మంది విమానయానాలు రద్దు చేసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప.. కరొనా వైరస్ భయానికి ఎవరూ విమాన ప్రయాణాలు చేయడం లేదు. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలం అవుతోంది. అయితే తాజాగా మరో ఇద్దరికి కరొనా వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. మొన్నటిదాకా కరొనా వైరస్ ను లైట్ తీసుకున్న ప్రజలు.... ఇప్పుడు చాలా భయపడుతున్నారు. తరచుగా ఇటలీ వెళ్లే ఒక ఢిల్లీవాసి, తరచుగా దుబాయికి వెళ్లే తెలంగాణ వాసి... ఈ కరొనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరు ఇండియాలో ఐదుగురికి కరొనా వైరస్ సోకినట్టు అధికారికంగా గుర్తించినట్టయింది. మరి ఈ సంఖ్య ఇక్కడితో ఆగిపోతుందా.. అలా జరక్కపోతే ఇండియా పరిస్థితి ఏంటి... చైనాలో మాదిరిగా కొన్ని గంటల్లోనే మనకు ఓ స్టేడియాన్ని హాస్పిటల్ గా మార్చే సామర్థ్యం గానీ, వెసులుబాట్లు గానీ ఉన్నాయా... ఈ విషయంలో మనం చాలా పూర్. మన ఇండియన్ల మనస్తత్వాలు, నిర్లక్ష్యపూరిత వ్యవహారం వంటి అంశాలను బట్టి చూస్తే వైరస్ సోకకుండా నిరోధించుకోవడం తప్ప.. వైరస్ వ్యాపించకుండా అరికట్టడం అంత సులువు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.



చైనా కన్నా మనం ఎంతో నయం


మంచికైనా, చెడుకైనా మన పక్కనున్న చైనాతో పోల్చుకోవడం చాలా కామన్. అదే ప్రకారంగా చూసుకుంటే చైనా కన్నా మన ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక పునాదులు చాలా విభిన్నమైనవి. ఆ లెక్కన చూసుకుంటే మన ఇండియాలో కరొనా వైరస్ వ్యాప్తి చెందడం అంత సులువు కాదన్న పాజిటివ్ సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే వైరస్ సొకినవారు వారికి  తెలిసో తెలియకో, కన్ఫామ్ కాకముందో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తే గనక అది ఉపద్రవంగా మారే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. కానీ.. సాధారణ పరిస్థితుల్లో అయితే మాత్రం వైరస్ సోకినివారిని ఎవరితో కలవనీయకుండా చేస్తే కరొనా వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందడం అసాధ్యమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Photo: Financial Express


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత