Skip to main content

భైంసా ఘటన చెబుతున్నదేంటి?


Photo Credit: vskbharat.com


భైంసాలో సంక్రాంతికి ముందు జరిగిన అమానవీయమైన, అతి జుగుప్సాకరమైన కృత్యాన్ని ఓ సాధారణ ఘటనగా చూడాలా? లేక పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ఓ వర్గపు పైశాచిక చర్యగా భావించాలా? అంతేకాదు.. ఈ చర్య  నుంచి ప్రభుత్వాలు గానీ, ఫోర్త్ ఎస్టేట్ లో కీలకమైన స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా గానీ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది  ఏమైనా ఉందా?


ముందుగా ప్రభుత్వ స్పందనను స్థూలంగా విశ్లేషిద్దాం. భైంసా ఘటనను బయటికి రాకుండా చూడడానికి తెలంగాణ సర్కారు విఫలయత్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యాన ఆలస్యంగా అయినా అక్కడేం జరిగిందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఏ అంశం ప్రపంచానికి తెలియరాదని ప్రభుత్వం కోరుకుందో.. అదే అంశాన్ని ప్రపంచం మొత్తానికి చేరవేసిన సిద్ధు అనే జర్నలిస్టు ఇప్పుడో సాహసిగా ప్రజల ముందు నిలబడ్డాడు. నిజానిజాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన ప్రభుత్వపెద్దల పక్షపాత నైజం గంపగుత్తగా బయటపడింది. అంతా తెలిసిపోయాక, దాచడానికి ఏమీ మిగలని సందర్భంలో, నిందితులను, దుండగులను ఇప్పటికైనా గుర్తించిన దాఖలాలు లేని క్రమంలో ప్రభుత్వానిది, పోలీసులది నూటికి నూరు శాతం వైఫల్యంగానే ప్రజల ముందు తేలిపోయింది. ఈ వైఫల్యం నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుంది? బాధితులకు ఎలాంటి ఊరటనిస్తుంది? బాధితులతో సహానుభూతి చెందుతున్న లక్షలాది మంది ప్రజలకు ఏమని జవాబు చెబుతుంది? భైంసా ఘటనలో ఇదొక పార్శ్వం అయితే.. నిజమే చెబుతామని, నిజం కోసమే జీవిస్తున్నామని చెప్పుకునే మీడియా వర్గాలది అసలైన మరో పార్శ్వం. 


జనరల్ మీడియా కళ్లు మూసుకుంది - సోషల్ మీడియా కళ్లు తెరిపించింది:


భైంసా ఎపిసోడ్ లో మొత్తంగా యాక్టివ్ పాత్ర వహించింది సోషల్ మీడియానే. సోషల్ మీడియా వల్లనే ప్రపంచమంతటికీ అక్కడేం జరిగిందో తెలిసింది. భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ కొత్త కాదు. కానీ ఈసారి జరిగింది మాత్రం చాలా కొత్త తరహాలో జరిగింది. స్థానికంగా ఉండేవాళ్లు కాక బయటి నుంచి వచ్చిన దుండగులు ముసుగులు వేసుకొని భయానక వాతావరణం సృష్టించారు. బతికి బట్ట కట్టాలంటే తక్షణమే అక్కణ్నుంచి వెళ్లిపోవాలని హుంకరించారు. సంక్రాంతి కోసం చేసుకున్న పిండివంటల మీద ప్రతాపం చూపించారు. వాతావరణం సద్దుమణిగిన తరువాత కూడా కనీసం పండుగ సైతం జరుపుకోలేని రీతిలో క్రూరంగా వ్యవహరించారు. సంక్రాంతికి 2, 3 రోజుల ముందే సకినాలు, అరిసెలు, కారప్పూస వంటి పిండివంటలు చేసుకోవడం తెలంగాణలో ఆనవాయితీ. అలా అప్పుడే చేసుకున్న పిండివంటల్లో ఉమ్మేసి వాటినెవరూ ముట్టకుండా చేశారు ఆ దుండగులు. అంతేకాదు.. ఆ పిండివంటల్లో కొందరు దుండగులు ఉచ్చలు కూడా పోశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాలు కాల్చేశారు. వంటసామాగ్రి బయటపడేశారు. ఇళ్లను తగులబెట్టారు. పుస్తకాలు, సర్టిఫికెట్లు కాలిపోయాయి. పలువురు విద్యార్థుల భవితవ్యం మసకబారింది. చాలామంది పారిపోయారు. బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటికీ భైంసాలో సొంత ఇళ్లకు రావడానికి వణికిపోతున్నారు. బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారింది. తమ సంస్కృతిని ఆచరిస్తూ అక్కడ బతగ్గలమా అన్న అనుమానాలు ముసురుకున్నాయి. వెనక్కి వచ్చేందుకు ధైర్యం చాలటం లేదు. ఇదంతా ఎక్కడో జమ్మూ-కాశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దురాగతం కాదు. రేపో మాపో బంగారుగా మారుతుందన్న ఆశలు కల్పించిన మన తెలంగాణలోనే కావడం విశేషం. మనమంతా గంగా-జమునా తెహజీబ్ అని మాటిమాటికీ తెగ మురిసిపోయే తెలంగాణలోనే జరిగింది. హిందూ-ముస్లిం భాయీ భాయీ అని ఊరికే చంకలు గుద్దుకునే అల్ప సంతోషులైన జర్నలిస్టులు,  ఇతర మేధావులున్న తెలంగాణలోనే జరిగింది. తెలంగాణలో రజాకార్ల దురాగతాల గురించి కథలుకథలుగా ఇప్పటికీ వింటూ ఉంటాం. రజాకార్లు ప్రజల మాన, ప్రాణలతో చెలగాటమాడిన విషయం ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. అయితే అంతకన్నా దారుణమైనవాళ్లు, అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించే మరో జాతి ఉండేదన్న విషయం ఈ కాలం ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ పాతతరం వృద్ధుల్ని అడిగినప్పుడు వారి చర్యలు ఎంత అసహ్యకరంగా ఉండేదో చెబుతారు. గుంపులు గుంపులుగా ఊళ్ల మీద పడి కనిపించినవారి మీద దాడి చేయడం, అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే ఇళ్లల్లో చొరబడి బీభత్సం సృష్టించడం ఆ మూకలు చేసే పని. అనేక మంది ఇళ్లలో మానవ విసర్జితాలైన మల, మూత్రాలను కూడా ఇళ్లలో ఎగజిమ్మేవారని పాతతరం ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మానవ మలాన్ని నీళ్లలో కలిపి కళ్లాపి లాగా చల్లిన సందర్భాలను ఇప్పటికీ నెమరు  వేసుకునే కొందరు ముసలివాళ్లున్నారు. వారిని పిండారీలు అంటారని, వాళ్లు ఊళ్లల్లోకి అడుగుపెడుతుంటే ఊరపిచ్చుకలు సైతం భయంతో నిశ్శబ్దంగా గూళ్లలో చేరి బిక్కుబిక్కుమనేవని చెబుతారు.  అంత అనాగరికమైన సంస్కృతికి అధిపతులైనవారు పాలకుల తాబేదార్లుగా వ్యవహరించిన దారుణమైన సందర్భాలను కూడా తెలంగాణ చూసింది. మళ్లీ ఇప్పుడు అలాంటి రోజుల్ని గుర్తు చేసే క్రూరమైన ఘటనలు భైంసాలో చోటు చేసుకోవడం విషాదం. 


అయితే ఇది కాకతాళీయమా? ఓ సమావేశం కోసం వచ్చిన గుంపంతా ఒక్కటై, తమ సంస్కృతికి చెందని అవతలివర్గం వారిపై ఇంత జుగుప్సను ప్రదర్శించడం ఏంటి? ఎవరో ఉపన్యాసం ఇస్తే విని ఆ క్షణికావేశంలో ఏదో చేసేయాలన్న కసితో చేసిన పనా ఇది? కానేకాదు. ఇది కేవలం కోపంతోనో, కసితోనో చేసిన పని కాదు. ఇదంతా పగతో చేసిన పని. భైంసాలో తమను చాలెంజ్ చేస్తున్న అవతలివర్గం వారిని ఎలాగైనా అక్కడి నుంచి తరిమేయాలన్న దూరదృష్టి. అలా తరిమేస్తే ఇంక ఎక్కడా కూడా తమ దురాగతాలను ప్రశ్నించే సాహసం చేసేవారు ఉండరన్న పక్కా స్కెచ్. పండుగ కోసం చేసుకున్న పండివంటల మీద ఉచ్చలు పోయడమేంటి? దాన్నెవరూ ముట్టకుండా ఉమ్మేయడమేంటి? పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే రెండు శత్రువర్గాలు కూడా తినే తిండి మీద ఇంత జుగుప్సాకరంగా  వ్యవహరించవు కదా. ఇదేం సంస్కృతి? అవతలివర్గం సంస్కృతిని అవమానించడం, పండుగ సంబురాలకు ఆ ప్రజల్ని దూరం చేయడం, అసలు ఆ వర్గాన్నే ద్వేషించే ఓ విష సంస్కృతిగానే దీన్ని చూడాలి. 


మరి మీడియా ఏం చేసింది?
భైంసా విషయంలో మీడియా ఏంచేసింది అనే కన్నా.. అసలేమీ చేయలేదని చెప్పడం కరెక్ట్. రాజకీయ కక్ష సాధింపుల కోసం, పార్టీల మధ్య పంతాల కోసం ఉన్నదాన్ని లేనట్టు... లేనిది ఉన్నట్టూ ఊదరగొట్టే మెయిన్ మీడియా అంతా కూడా ఈ విషయంలో దోషులే. ప్రధాన స్రవంతి మీడియాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు సైతం సోషల్ మీడియా ద్వారానే తమ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించుకోగలిగారు తప్ప ప్రధాన మీడియాలో కాసింత స్పేస్ కూడా సంపాదించుకోలేకపోయారు. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అసలు విషయాలను, రానున్న రోజుల్లో ఏర్పడబోయే భయానక వాతావరణ హెచ్చరికలు చేయగలిగారు. ప్రజలకు  కాస్తో, కూస్తే అసలు విషయాన్ని విడమరచి  చెప్పగలిగారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వక మౌనాన్ని, అందులోని మర్మాన్ని ఎండగట్టగలిగారు. అంటే మీడియా సంస్థలు చేయలేని పనిని వ్యక్తులుగా కొందరు జర్నలిస్టులు చేశారు. కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలంటే అది సరిపోదు. నిందితులు  ఫలానా వర్గానికి చెందినవారు  కాబట్టి, వారిని పల్లెత్తు మాటంటే ఎక్కడ అసద్ కు, అక్బర్ కు కోపం వస్తుందోనని భయపడే పక్షపాతం వహించి ఉండవచ్చు. కానీ జనసామాన్యం దృష్టిలో తెలంగాణ ప్రభుత్వ ఒంటెత్తు పోకడ ఎలాంటిదో బాగా రిజిస్టరైపోయింది. దాని ప్రభావం ఏదో సమయంలో తప్పకుండా పడుతుంది. మరి నిందితుల్ని నిందితులుగా కాక ఓ వర్గం ప్రజలుగా ప్రభుత్వం ఎందుకు చూస్తుందన్నదే అర్థం కాని ప్రశ్న. నిందితులు ఎవరైనా, ఏ వర్గం వారైనా కోర్టు ముందుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేస్తే ఆ మంచిపేరు ప్రభుత్వానికే వస్తుంది కదా. దానివల్ల గుంపు మనస్తత్వం కలిగిన ఇతరుల్లో ఓ భయం అనేది ఉంటుంది కదా. ఇకపై అలాంటి దురాగతాలకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న సంకేతం వెళ్తుంది కదా. కనీసం ఆ పనైనా ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు. 40, 50 మందిని అరెస్టు చేశారన్న వార్తలొస్తున్నాయి గానీ... కేసు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చింది, అసలు నిందితులు ఎవరు అన్న ప్రాథమిక సమాచారమేదీ బయటకు రాలేదు. అలాంటివాళ్ల పేర్లు రాకుండా ఉంటే రేపు మళ్లీ ఇలాంటి ఘటనలే పునరావృతం కావన్న గ్యారెంటీ ఏంటి? అవతలివర్గం కూడా దానికి రివెంజ్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తే దాన్ని ఆపేవారు ఎవరు? పాలకుల ఇలాంటి నిష్క్రియాపరత్వమే కదా.. గోద్రా లాంటి ప్రతీకార ఘటనలకు దారితీస్తుంది. ఈ చిన్న లాజిక్ మిస్సయితే ఎలాంటి పెద్ద ప్రమాదం భవిష్యత్తులో ఎదురవుతుందో గుర్తించాల్సింది పాలకులే కదా. మరి అలాంటి గుర్తింపు మన పాలకులకు ఎప్పుడొస్తుందో. 


- BNPost, Adilabad


 


Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత