Skip to main content

ముంబైలో మొదలైంది.. హైదరాబాద్ వైపు కదిలింది


దేశంలో అగ్రగామి వాణిజ్యవేత్తగా, ప్రపంచంలోని వంద ప్రభావశీలుర జాబితాలో ఒకడిగా వెలుగొందుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యాపారంలో వైరి వర్గాలను ఊచకోత కోస్తున్నారు. ముఖేశ్ మొదలుపెట్టిన ఊచకోత మరింత తీవ్రరూపం దాలుస్తోంది. భారతీయ మార్కెట్లో ఓ నూతన శకాన్ని కూడా ఆరంభించడం ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.



టెలికాం రంగంలో ఓ మోస్తరు కంపెనీలను సైతం జియో బిస్తరు సర్దుకునేలా  చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీ డాటా ఆఫర్ తో ఇండియా ప్రజానీకాన్ని అంతర్జాల ప్రియులుగా మార్చేసిన జియో… అది ఇస్తున్న పోటీకి భారతీ ఎయిర్ టెల్, ఐడియా-వొడాఫోన్ వంటి పెద్ద కంపెనీలను బేజారెత్తిస్తోంది. బకాయిలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న ఆ రెండు కంపెనీలు కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ రంగంలో జియో అప్రతిహతంగా దూసుకెళ్లడానికి ఆటంకాలేవీ లేవనే చెప్పాలి. 


టెలికాం రంగంలో బీభత్సం సృష్టిస్తున్న రిలయన్స్.. ఈ-కామర్స్ లోనూ అడుగు పెట్టేందుకు కొన్నేళ్ల క్రితమే పెద్దఎత్తున కసరత్తు చేసింది. ఆ విషయం మార్కెట్ కు ఇంకా బయటకు పొక్కకముందే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి టాప్ ఈ-కామర్స్ సంస్థలు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టి మధ్యతరగతి వినియోగదారులకు చేరవయ్యాయి. ఆన్ లైన్ మార్కెట్ ను శాసిస్తూ తమ వాటాను పటిష్టం చేసుకున్నాయి. అయితే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మార్కెట్  వ్యూహాలు తనకే విధంగానూ పోటీ కాదని అంబానీ ధీమాగా ఉన్నారో ఏమో కానీ.. విస్తృతంగా వ్యాపించి ఆ కంపెనీల వాటా గురింంచి పెద్దగా బాధపడలేదు. తనదగ్గరున్న సీక్రెట్ అలాంటిదేమో మరి. 
గతేడాది చివరినాటికే అంబానీ అమ్ములపొదిలో ఉన్న మార్కెట్ సీక్రెట్ కాస్తా బట్టబయలైంది. ఈ-కామర్స్, ఆన్ లైన్ మార్కెట్ లోకి టిఫనీ అనే సంస్థతో కలిసి అడుగు పెట్టింది రిలయన్స్. ఇప్పటికే ముంబై శివార్లలో మాల్స్ నెలకొల్పవడం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ లో అమెజాన్, ఫ్లిప్  కార్ట్ లకు దీటుగా.. మరిన్ని కొత్త ఐడియాలతో భారత గృహాల్లోకి దూసుకెళ్తోంది. యాప్ బేస్డ్ బిజినెస్ ద్వారా డోర్ డెలివరీ చేస్తుండడం రిటైల్ మార్కెట్లో అంబానీ కొత్తసూత్రంగా తెలుస్తోంది. గృహస్తులకు అవసరమైన అన్ని వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డరిస్తే.. జస్ట్ టిఫిన్, లంచ్ ఇంటికి వచ్చినట్టుగా.. కావాల్సిన వస్తువులన్నీ ఇంటికే వచ్చేస్తాయన్నమాట. ముంబైలో ప్రయోగాత్మకంగా మొదలైన జియో మార్ట్ ఆపరేషన్.. అతి త్వరలోనే హైదరాబాద్ కు వస్తోంది. ఇప్పటికే ముఖేశ్ ప్రతినిధుల బృందం పలుచోట్ల స్థలాల కోసం సర్వే కూడా జరిపినట్లు సమాచారం.  


పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, సూపర్  మార్కెట్ ల ఆవిర్భావం సగటు కిరాణాదారుడి వ్యాపారం గణనీయంగా దెబ్బతింది. ఇప్పుడు ఆన్ లైన్ మార్కెట్ అండ్ డోర్ డెలివరీతో వీధి చివర్న ఉండే సామాన్య  వ్యాపారవేత్తల పరిస్థితి ఏమవుతుందో చూడాలి. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత