Skip to main content

ఇది దేశ వ్యతిరేక చర్యా?  సీఏఏ వ్యతిరేక చర్యా?


- అల్లర్లలో అసువులు బాసిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, తుపాకీతో కాల్పులు జరుపుతున్న ఆందోళనకారుడు


 


సీఏఏ వ్యతిరేక ఆందోళనలు శ్రుతి మించుతున్నాయి. నిరసన మాటున అసహనం హద్దు మీరుతోంది. సీఏఏ ను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ పంతం పట్టిన ఆందోళనకారులు ఢిల్లీని రణరంగంగా మార్చేశారు. మూడు రోజులుగా షాహీన్ బాగ్ లో నిరసనకారులను ప్రజాస్వామ్య పద్ధతిలో దారికి తెచ్చుకునేందుకు నేరుగా సుప్రీంకోర్టే రంగంలోకి దిగింది. నిరసన అనేది ప్రజాజీవితానికి భంగం కలిగించరాదన్న సుప్రీంకోర్టు కండిషన్ తో అది క్లియర్ అయిన సమయంలోనే.. ట్రంప్ భారత్ లో పర్యటించడం.. దాన్నే అదనుగా తీసుకున్న ఆందోళనకారులు జఫ్రాబాద్, మౌజ్ పూర్-బాబర్ పూర్ మెట్రో స్టేషన్లలో హడలెత్తించారు. సీఏఏకు, దేశానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ దుకాణాలపై రాళ్లు విసరడం, రాకపోకలకు అంతరాయం కలిగించారు. నిరసనకారులు పలు దుకాణాలను, మాల్స్ ను తగులబెట్టారు. మంటల్లో చిక్కుకొని పలు షాపులు దగ్ధమయ్యాయి. అటు ఫైర్ సిబ్బందిని కూడా సహాయ చర్యలు చేపట్టకుండా అడ్డుకోవడం ఆందోళన రేపుతోంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకురావడం పోలీసుల తరం కాలేకపోయింది. 



గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జీ, గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనలో రతన్ లాల్ అనే కానిస్టేబుల్ చనిపోగా ఓ డీసీపీ కి గాయాలయ్యాయి. మరోవైపు సీఏఏ ఆందోళనలకు వ్యతిరేకంగా సీఏఏ ను సమర్థిస్తూ బీజేపీ మద్దతుదారులు కూడా ప్రదర్శనలకు పూనుకుంటున్నారు. అగ్ర రాజ్యాధినేత ట్రంప్ సకుటుంబ సపరివారంతో భారత్ లో పర్యటిస్తున్న దృష్ట్యా ప్రపంచంలో దేశ పరువుకు భంగం కలగరాదన్న లక్ష్యంతో బీజేపీ కార్యకర్తలు పోటీ ప్రదర్శనలకు దిగారు. దీంతో ఢిల్లీ ఓ రణరంగాన్ని తలపించింది. 



అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపు చేయాలంటూ హోంమంత్రి అమిత్ షాను కోరారు. అమిత్ షా సూచనలతో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పోలీసులను తక్షణమే పరిస్థితిని అదుపులోకి తేవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత