Skip to main content

సింగరేణి ఏరియా ఎమ్మెల్యేల్లో గుబులు


వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు...కానీ నియోజక వర్గాల్లోకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు ఇబ్బందిగా మారిందని ఆ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇంతకీ ఇబ్బందులు పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు... ఏ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వారు గుర్రుగా ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?



అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం తమకు ఇబ్బందులు తెస్తున్నాయని వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు ఉండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ...ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసి యూనియన్ ఆఫీసులకు తాళాలు వేయడంతో ఆ ప్రభావం తమపైన పడిందంటున్నారు గులాబీ పార్టీ  ఎమ్మెల్యేలు. అంతేకాదు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని భయపడుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, రామగుండం, భూపాల పల్లి, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహిస్తే బాగుండని అనుకుంటున్నారు. 



ఆర్టీసీ కార్మికుల సంఘాలను క్లోజ్ చేసినట్లే సింగరేణిలో కూడా కార్మికుల సంఘాలను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పటి వరకు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ సంఘం, సింగరేణి బొగ్గు గని కార్మిక  సంఘం కొంచెం వీక్ అవ్వడం బీజేపీ అనుబంధ సంఘం బియంయస్ బలంగా అవ్వడం కూడా ఒక కారణం అని అనుకుంటున్నారు. దీంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవాలని అనుకుంటున్నారని సమాచారం.



సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవాలని అనుకుంటున్నారట. సింగరేణి కార్మిక సంఘాన్ని క్లోజ్ చేస్తే తమ పైన నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరిగి రానున్న ఎన్నికల్లో  పార్టీ పైన ప్రభావం పడే ఛాన్స్ ఉందని ముఖ్యమంత్రి కి చెప్పాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇస్తారా....సింగరేణి కార్మిక సంఘాల పైన సీఎంకి ఎలాంటి అభిప్రాయం ఉందొ చూడాలి.


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.

అద్భుతమైన సినిమా - చెత్త మెసేజ్

శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది.  కథ విషయానికి వస్తే, హీరో సినిమా డైరెక్టర్. 2020 లోమొదటి సినిమా తీసి హిట్ సాధిస్తాడు. అతను పేరు సాధిస్తాడు. అనుకోకుండా అతను ఒక కేసులో  ఇరుక్కుని పోతాడు. ఆ కేసు నుండి బయట పడడానికి అతన్ని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే, ఆమె అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకొంటుంది. సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగా పోరాడుత