Skip to main content

తెలంగాణ ఖజానా ఖాళీ.. కారణాలు ఇవే



రైతు బంధు పథకం రెండో దఫాకు  నిధులు లేవా...నవంబర్ నెల సగం గడిచినా ఈ పథకంపై  ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు...... ఖజానా నిండుకుందా.... ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి  పథకంలో మార్పులు చేసి పది ఎకరాల పరిమితి  విధించబోతున్నారా.....రైతు బంధు నిధుల విడుదల ఆలస్యంపై ప్రత్యేక కథనం...



తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతుబంధు పథకానికి నిధుల కొరత ఏర్పడిందని సమాచారం..ఇంతవరకు రెండో దఫా నిధుల విడుదల పై ప్రభుత్వంలో కదలికే లేదు.ఈ పథకం మొదటి విడతను మే, జూన్ నెలలో, రెండో విడతను అక్టోబర్, నవంబర్ లలో విడుదల చేస్తామని ప్రకటించారు..అయితే మొదటి దఫా నిధులే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు.హుజుర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో సూర్యాపేట జిల్లాలో పెండింగులో ఉన్న నిధులు ఒకేసారి విడుదల చేశారు. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.ఒక విడత రైతుబంధు కు ఆరు వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల కోట్లే విడుదలయ్యాయి... నిధుల కొరత కారణంగా ఒకేసారి ఇవ్వలేక దశల వారిగా విడుదల చేస్తున్నారు..మరో ఐదు వందల కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది.


 


మొదటి దఫా పూర్తి కాకుండానే రెండో విడత సమయం వచ్చింది.గత ఏడాది ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నవంబర్ నెలలోనే ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ రైతు బంధు చెక్కుల పంపిణీని నిలిపివేసింది.ఈసీ అనుమతించాక సరిగ్గా పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు నుంచి నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసింది ప్రభుత్వం.అయితే ఈ ఏడాది నవంబర్ నెల మధ్యలోకి వచ్చినా రెండో విడత నిధుల ఊసే ఎత్తడం లేదు..ఆర్థిక మాంద్యం ఉందని బడ్జెట్ నే కుదించారు. ఈ ఏడాది నిధుల కటకట ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.అందుకే రెండో విడత జాప్యమవుతోందని తెలిసింది..రాష్ట్రానికి ఉన్న రుణపరిమితి ని ఇప్పటికే సగానికి పైగా వినియోగించుకున్నారు. అప్పు తీసుకొని ఇతర అవసరాలకు వాడుకున్నారు. మళ్ళీ అప్పు కోసం మరో రెండు నెలలు ఆగక తప్పదు.నిధులు లేక రెండో విడత రైతు బంధుపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని అంటున్నారు అధికారులు.ఆర్థిక శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ సారి రైతు బంధు రెండో విడత అలస్యమయ్యే అవకాశం ఉందని తెలిసింది.


 


మరోవైపు ఈ పథకాన్ని పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు సమాచారం..నిధుల కొరత సాకుతో ఈ పథకాన్ని పది ఎకరాల లోపు రైతులకే పరిమితం చేసే యోచనలో ఉన్నారని తెలిసింది.దీని వల్ల ఏటా రెండు వేల కోట్లు ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు..టిఆర్ఎస్ మొదటి ప్రభుత్వ హయాంలో మెప్పు కోసం ప్రకటించిన కొన్ని విషయాల్లో పునఃసమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు.దీనికి ఆర్టీసీ, ఉద్యోగుల జీతాల పెంపుపై సిఎం ఇప్పటి వైఖరినే ఉదాహరణగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.కేసీఆర్ మొదటి సారి సీఎం అయ్యాక ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీతాల పెంపు విషయంలో ఉదారంగా వ్యవహరించారు.కానీ రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్టీసీ, ఉద్యోగుల జీతాల పెంపుపై కఠినంగా ఉంటున్నారు.ఇదే విధంగా రైతు బంధు పథకంలో కూడా 10 ఎకరాల పరిమితి విధించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి ఇప్పటి ఆర్థిక పరిస్థితి ని కారణంగా చూపి ప్రజల ను మెప్పించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం..


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత