Skip to main content

అఖిలప్రియపై సొంత తమ్ముడు కోర్టుకెక్కడంలో అసలు కారణం ఇదే


భూమా అఖిలప్రియ మరో వివాదంలో  చిక్కుకున్నారా......ఆస్తికోసం సొంత తమ్ముడు .....సోదరిపైనే కోర్టుకెక్కాడా..... ఎప్పుడో 2016 లో  తండ్రి విక్రయించిన స్థలంపై  వాటా కోసం అఖిలప్రియ తమ్ముడు ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించినట్టు....ఒకవేళ నిజంగా  ఆస్తికోసం  అక్కపై  కోర్టుకెక్కితే ఆమె ఇంట్లోనే ఎందుకు ఉంటారు.... ఆమె కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ఎందుకు వెళతారు........దీని వెనుక ఎదైనా  హిడెన్ అజెండా  ఉందా....... అక్కపై తమ్ముడు  నిజంగా   కేసు పెట్టారా.... లేక ఫ్యామిలీ డ్రామానా? 


మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద ఆమె సోదరుడు కోర్టుకు వెళ్లారు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమా కుటుంబానికి హైదరాబాద్ శివారు గండిపేట వద్ద 1000 గజాల స్థలం ఉంది. అయితే, ఆ ఆస్తిని 2016లో విక్రయించారు. ఆ సమయంలో తాను మైనర్ అని తన తండ్రి భూమా నాగిరెడ్డి చెప్పడంతో వేలిముద్రలు వేశానని జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నాడు. అప్పట్లో సుమారు రూ.2కోట్లకు ఆ భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, మూడేళ్ల నాడు అమ్మిన ఆస్తిలో తనకు వాటా కావాలంటూ జగన్ విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ప్రచారం జరుగుతోంది.


ఈ ప్రచారంపై కర్నూలు జిల్లావాసులు భూమా అభిమానులు తీవ్ర కలత చెందుతున్నారు. తన ఇద్దరు అక్కలపై భూమా కుమారుడు ఎందుకు కోర్టుకు ఎక్కారు..... ఎప్పుడో అమ్మిన భూమిపై వాటా కోసం ఇప్పడు పట్టుబట్టడం ఏంటని బుర్రలు పీకుంటున్నారు. తల్లిదండ్రుల మరణంతో భూమా కుటుంబానికి అఖిలప్రయ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు...అటు  తమ  కుటుంబానికి అండగా నిలిచిన అభిమాన బలాన్ని కాపాడుకుంటూ .. ఇటు  రాజకీయ ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొంటుూ  ముందుకు సాగుతున్నారు. 


కొద్దిరోజుల క్రితం భూమా అఖిలప్రియ  భర్త భార్గవ్ రామ్ కేసులు వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో కూడా భార్గవ్‌పై ఓ కేసు నమోదయ్యింది. ఇప్పుడు తాజాగా సొంత తమ్ముడు కోర్టుకు ఎక్కాడన్న వార్తలు  కర్నూలు , నంద్యాలలో హాట్‌టాపిక్ గా మారాయి.  మరోపక్క  తన  కుటుంబంపై జరుగుతున్న  ప్రచారంపై  జగత్ విఖ్యాత్ రెడ్డి  స్పందించారు. తాను దుబాయ్‌లో ఉన్నానంటూ  తమ కుటుంబం అంతా కలిసే ఉందని.. తమపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. దీంతో  భూమా కుటుంబంలో కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తోంది. కేవలం భూమి కొనుగోలుదారులను ఇబ్బందిపెట్టేందుకే న్యాయవాదుల సలహా మేరకే విఖ్యాత్‌ కోర్టును ఆశ్రయించారని ఈ కేసును వాదిస్తున్న లాయర్‌ కూడా భూమా అఖిలప్రియ బంధువే అని సమాచారం.    అఖిలప్రియ స్పందించి నిజం ఏంటో  వెల్లడించాలని  అభిమానులు కోరుతున్నారు. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత