Skip to main content

ఆలయం అంటే ఏమిటో ఎందరికి తెలుసు?

 


దేవుణ్ని నమ్మేవాళ్లు అందరూ ప్రతిరోజూ కాకపోయినా సందర్భానుసారమైనా ఆలయ దర్శనం, దైవ దర్శనం చేసుకుంటారు. అయితే గర్భగుడి అనే మాట గురించి అందరికీ తెలిసిదే. అసలు గర్భగుడి అంటే ఏమిటనేది చాలా మందికి తెలియదు. గర్భగుడి అనగానే విగ్రహాన్ని రక్షిస్తూ నాలుగు వైపులా గోడలు ఉండడం.. పైనేమో ఊర్వం.. అంటే విమానం గుర్తుకు వస్తుంది. విగ్రహ రూపంలో భగవంతుడు నెలకొని ఉన్న చోటే గర్భగుడి అని కొందరు.. గుడి గర్భం.. అంటే మధ్యభాగంలో భగవంతుడుంటాడు కాబట్టి గర్భగుడి అని మరికొందరు భావిస్తారు. అయితే ఆ గుడిగర్భంలో లేదా.. గర్భగుడిలో ఏముంటుంది? ఈ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చిందనేది చాలా మందికి తెలియదు. అదే ఇప్పుడు తెలుసుకుందాం. 


 


ఆగమ,శిల్పశాస్త్రాల్లో గర్భగుడిని.. ప్రాసాదం, సందనం,ధామం, నికేతనం, మందిరం, సౌధం, ఆలయం, నీలయం, ఆయతనం అనే పేర్లతో పిలుస్తారు. అవే గాక దాదాపు ఇంకా ముప్పైకి పైగా పేర్లున్నాయి. అదొక విశేషం. అయితే ప్రాచీనకాలంలో ఆలయాన్ని నిర్మించే ముందు ఆ ప్రదేశంలో గర్పన్యాసం అనే ప్రక్రియ నిర్వహించేవారు. ఒక రాగి కలశం తీసుకొని అందులో నవరత్నాలనూ, పంచలోహాలనూ, ఇంకా కొన్ని ధాతువులను, కొన్ని ఔషధమూలికలనూ ఉంచి పూజాదికాలు నిర్వహించి... గర్భస్థానంలో.. అంటే మధ్య భాగంలో ఉంచేవారు. ఇలా ఆ గర్భాన్ని గుడిలో ఉంచడం వల్ల అది ఆలయం అభివృద్ధికి కారణమౌతుంది. ఆ తర్వాత ఆ గర్భంపైనే ఆధార శిలను ఉంచి దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్థారు. అప్పుడే ఆ విగ్రహానికి జీవం వస్తుంది. అలా దాని చుట్టూ నిర్మించే గుడి దేహంతో సమానం. ఇదొక పద్ధతి. ఈ విషయాన్ని ఈశాన శివగురుదేవ పద్దతి చాలా స్పష్టంగా చెప్పిందని ఆగమ పండితులు చెబుతున్నారు. ఇంకా పలు ప్రాచీన గ్రంథాల్లో కూడా ఈ వివరం ఉంది. 


 


ఇక మరో సంప్రదాయం ప్రకారం ముందుగా ఆలయాన్ని నిర్మించి, ఆ తర్వాత అందులో విగ్రహం లేదా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే దాన్ని గృహగర్భం అంటారు. అదే ముందు విగ్రహం ప్రతిష్టించి ఆపై దానికి గుడి కడితే దాన్ని గర్భగుడి అంటారు. మనకు ఈ రెండు సాంప్రదాయాల్లో గుళ్లు నిర్మించుకునే పద్ధతులు పారంపర్యంగా వస్తున్నాయి. అందువల్ల స్వయంభూ విగ్రహాలకు నిర్మించిన ఆలయాన్ని మాత్రమే గర్భగృహం లేదా గర్భగుడి అని వ్యవహరించాలని ఆగమ నియమం. గర్భగుడిలో నెలకొన్న దేవుడికంటే ముందు ఆ దేవుడికి ఆశ్రయంగా నిలిచిన గర్భగుడి సాక్షాత్తు భగవంతుని శరీరం అని వైష్ణవాగమాలు చెప్తున్నాయి. గర్భగుడిలోకి ప్రవేశించడం అంటే భగవంతునిలో లయం కావడమే. అందుకే దాన్ని ఆలయం అని పండితులు పిలుస్తున్నారు. దైవదర్శనం ఒక ఫలితాన్ని ఇస్తే.. గర్భగుడిలోకి వెళ్లి దేవుణ్ని  దర్శించుకోవడం అనేది... మనల్ని దేవుడిలో లయం చేసే ప్రక్రియ అన్నమాట. ఇదండీ గర్భాలయం ప్రత్యేకత. 


 


- కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు


 


 


 


 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?