Skip to main content

Posts

ఆదిపురుష్ కాదు.. ఆద్యంతం వికార పురుష్

నాలుగు దశాబ్దాల క్రితం దూరదర్శన్లో మహాభారత్ వచ్చినప్పుడు ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఆ తరువాత రామాయణం వచ్చినప్పుడూ అంతే మైమరచిపోయి ఆస్వాదించారు. కొన్నేళ్లుగా వస్తున్న తాజా మహాభారత్ కు కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఇతిహాస ఇతివృత్తాలపై ఎందరు ఎన్నిసార్లు సినిమా తీసినా ఆదరించే భారతీయులు.. తాజా ఆదిపురుష్ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడాన్ని ఎవరూ ఇష్టపడరు. వినడానికి చేదుగా ఉన్నా, జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా.. ఆదిపురుష్ సినిమా దేశవ్యాప్తంగా వెలగబెడుతున్న నిర్వాకం మాత్రం ఇదే విషయాన్ని రూఢి చేస్తుందంటున్నారు సినీ అభిమానులు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ డిజాస్టర్ ను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. బాహుబలి వంటి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని, తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ కూడా అంతకుమించి అనేంతగా ఉంటుందని అంతా ఊహించారు. సనాతన భారతీయ సాహితీ సాంస్కృతిక విలువలకు ఆదిపురుష్ లో పట్టం కడతారని.. అంతర్జాతీయ రేంజ్ కు ఎదిగిన తెలుగు సినిమా.. తాజా సినిమాతో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశపడ్డారు. అయితే అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్టుగా ఆదిపురుష

తండ్రి లేని చదువుల తల్లికి వేదాస్ ప్రోత్సాహం

చదువుకోవాలన్న పట్టుదల ఉండాలే గానీ.. ఆ చదువుల తల్లే ఏదో దారి చూపిస్తుందంటారు పెద్దలు. అదే జరిగింది.. కొక్కొండ కపిలాదేవి అనే ఇంజినీరింగ్ అమ్మాయి విషయంలో కపిలాదేవి టెన్త్ లో ఉన్నప్పుడే పరీక్షలకు ముందు తండ్రి చనిపోయాడు. అప్పటికే చదువులో టాప్ స్టూడెంట్ గా ఉన్న ఆ అమ్మాయికి.. తండ్రి పోవడంతో చదువులు ఎలా కొనసాగించాలో పాలుపోలేదు. కానీ పెద్ద చదువులు చదివి ఐఏఎస్ కావాలన్న ఆకాంక్ష మాత్రం ఆ అమ్మాయిలో బలంగా ఉంది. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా 'వేదాస్' అసోసియేషన్ ముందుకొచ్చి ఆ అమ్మాయికి అండగా నిలబడాలని నిర్ణయించుకుందని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాచారి భాగ్యనగర్ పోస్టుకు చెప్పారు. దాతల్ని కూడగట్టి అమ్మాయిని ప్రోత్సహిస్తే వెనుకబడ్డ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం మరో ఆణిముత్యాన్ని ఈ సమాజానికి అందించినవారు అవుతామని భావించామని.. ఈ క్రమంలో ఖమ్మం వాస్తవ్యుడు సుదర్శనాచారి ముందుకొచ్చారని నాగాచారి చెప్పారు.  సుదర్శనాచారి ప్రోత్సాహంతో గత మూడేళ్లుగా అమ్మాయి బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్య కొనసాగిస్తోందని చెప్పారు. కపిలాదేవిని దత్తత తీసుకున్న సుదర్శనాచారి ఆమెకు ఏది కావలిస్తే అది ఏర్పాట్లు చేయడాన

తెచ్చుకున్న తెలంగాణలో హక్కుల సాధన కోసం మరో ఉద్యమం

తెలంగాణ సాకారమయ్యేందుకు జీవితాన్నే ధారవోసిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ కు పలువురు జర్నలిస్టులు నివాళులు అర్పించారు. జయశంకర్ లేకపోతే తెలంగాణ కల సాకారమయ్యేది కాదని, అలాంటి జయశంకర్ త్యాగాన్ని, నిస్వార్థపూరితమైన సేవభావాన్ని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణ పేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసమే కాబట్టి.. వారికి ఫలాలు అందడమే ప్రత్యేక తెలంగాణ ఉద్దేశమని జయశంకర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రావడం కోసం ప్రజలంతా ఏవిధంగా బయటికొచ్చి పోరాటాలు చేశారో.. తెచ్చుకున్న తెలంగాణలో కూడా హక్కులు సాధించుకోవాలంటే మరో పోరాటం చేయాల్సి ఉంటుందని.. అందుకోసం మరోసారి జయశంకర్ ఆలోచనా విధానాన్ని వ్యాపింపజేయాల్సిన అవసరం ఉందని వివిధ పత్రికల జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.  Also Read: తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ యాదిలో.. జయశంకర్ 12వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు టి.రమేశ్ బాబు, ఎం.ఎన్.చారి, సోహైల్, మహేశ్ చారి, ప్రభుచారి, ఎస్.ఎన్.చారి OWOP ఫౌండర్ ప్రెసిడెంట్ లక్ష్మణ

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత

రాజ్ ‎కుమార్ ఖాతాలో అవార్డులు, రివార్డులు, ప్రశంసాపత్రాలు

ఆయన అవార్డుల కోసం పని చేయడు. అయినా అవార్డులు వెదుక్కుంటూ ఆయన్ని వరిస్తాయి. పని పట్ల ఆయన చూపే బాధ్యతే ఆయన వెంట అవార్డులు క్యూ కట్టేలా చేసిందంటే అతిశయోక్తి కాదంటారు ఆయన స్నేహితులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీ పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్.రాజ్‎కుమార్ ను ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. తాజాగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‎కుమార్ తన సేవలకు గాను ప్రశంసా పత్రం అందుకున్నారు.  రాజ్‎కుమార్ ఇప్పటికే 38 ఉత్తమ సేవా పురస్కారు, 24 నగదు పురస్కారాలు, మరో 4 ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన రాజ్‎కుమార్ రెగ్యులర్ పోలీస్ డ్యూటీలే గాక, అధికారులు అప్పగించే ప్రత్యేకమైన టాస్కులు, డ్రాఫ్టింగ్ వంటి ఏ పనులు అప్పగించినా అన్నింటా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. అది చూసే రాజ్‎కుమార్ కోసమే పోలీస్ అధికారులు పలు ప్రత్యేకమైన పనులు అప్పగిస్తారన్న టాక్ కరీంనగర్ జిల్లాలో వినిపిస్తుంది. తాజా కార్యక్రమంలో ఎల్ఎండీ పోలీసులకు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్ఐ శీలం ప్రమోద్‎రెడ్డి, ఏఎస్ఐ నజీముద్దీన్, హెడ్ కాన

శ్రీకాంతాచారి బలిదానంతోనే తెలంగాణ స్వప్న సాకారం: జస్టిస్ చంద్రకుమార్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అమరుడు శ్రీకాంతాచారి బలిదానమే అత్యంత కీలకంగా మారిందని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలంతా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో... అమరుల కుటుంబాలను మాత్రం ఆదుకునేవారే కరువయ్యారన్నారు. కనీసం వారి త్యాగాలనైనా పట్టించుకునేవారు లేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అన్నారు. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదిరెడ్డి లాంటివారు ఎందరో ఉద్యమాన్ని రగిలిస్తే.. వారి కుటుంబాల్లోనే చీకట్లు అలుముకోవడం తెలంగాణ చరిత్రలో విషాదకరమైన ఘట్టంగా అభివర్ణించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు సగటు కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అంతకన్నా భిన్నంగా ఏమీ లేవని ఆవేదన చెందారు. అందుకే ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను మరో అంకానికి చేర్చే ప్రయత్నం జరుగుతుందని.. అమరుల స్ఫూర్తితో తెలంగాణ ప్రజల పార్టీ ఆ కార్యక్రమం పూర్తి చేస్తుందని చంద్రకుమార్ చెప్పారు. శ్రీకాంతాచారికి పాలాభిషేకం అంటే తెలంగాణ అమరులు అందరికీ చేసినట్టే అవుతుందన్నారు.   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్లో గల శ్రీకాంతాచారి వి

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా